టీడీపీ, చంద్రబాబుపై ఎనలేని ప్రేమ – ఏపీ బీజేపీకి ఏమయింది ?

ఆంధ్రప్రదేశ్ బీజేపీ నేతల్లో అనూహ్యమైన మార్పు కనిపిస్తోంది. ఇప్పటి వరకూ వైసీపీ తప్పు చేసినా టీడీపీనే విమర్శించేవారు. అప్పట్లో టీడీపీ చేసింది కాబట్టి ఇప్పుడు వైసీపీ చేసిందనేవారు. కానీ ఇప్పుడు సీన్ మారిపోయింది. వైసీపీనే విమర్శిస్తున్నారు. టీడీపీని పొగుడుతున్నారు. చివరికి సోము వీర్రాజుకూడా అదే పని చేస్తున్నారు. రాజధాని కట్టలేదు అని చంద్రబాబుపై ఎగిరెగిరిపడే సోము వీర్రాజు ఇప్పుడు చంద్రబాబు దార్శనికుడని అందుకే రాజధానికి డబ్బులిచ్చామని అంటున్నారు. ఇక వైసీపీపై బీజేపీ నేతలు చేసిన మాటల దాడితో హర్టయిన వైసీపీ నేతలు.. బీజేపీని బాబు జనతా పార్టీ అనడం ప్రారంభించారు.

మరో వైపు వైసీపీ నేతలు గల్లీలోనే కాదు ఢిల్లీలోనూ బీజేపీ నేతల్ని విమర్శిస్తున్నారు. చివరికి మోదీని కూడా వదిలి పెట్టడంలేదు. మోదీ కన్నా జగన్ పాలనే బెటరని విజయసాయిరెడ్డి లాంటినేతలంటున్నారు . రాజకీయంగా ఇదంతా అనూహ్య మార్పులకు కారణం అవుతోంది. అదే సమయంలో ఢిల్లీ నుంచి కూడా వైసీపీ కాకుండా టీడీపీ విషయంలో బీజేపీ ఫేవర్‌గా ఉందనడానికి సంకేతాలు కనిపిస్తున్నాయి. బీజేపీ అగ్రనేతలు .. టీడీపీతో టచ్‌లోకి వస్తున్నారు. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో మద్దతు తర్వాత సీన్ మారినట్లుగా కనిపిస్తోంది. చంద్రబాబు .. ఢిల్లీ పర్యటనకు వెళ్తున్నారు అక్కడ మోదీ, అమిత్ షాలతో భేటీ అవుతారన్న చర్చ జరుగుతోంది.

మరో వైపు తాము ఎంతగా సహకరిస్తున్నా.. రాజకీయంగా బలపడేందుకు బీజేపీ తమ డిమాండ్లు నేరవేర్చేడం లేదన్న అభిప్రాయం వైసీపీలో ప్రారంభమైనట్లుగా కనిపిస్తోందని చెబుతున్నారు. బీజేపీతో శత్రుత్వం పెంచుకున్న టీడీపీ.. ఇప్పుడు మిత్రులుగా మారకపోయినా కనీసం న్యూట్రల్‌గా అయినా ఉండేలా సంబంధాలు పెంచుకోవాలని చూస్తోంది. ఇది వైసీపీకి నచ్చడం లేదు. ఆ పార్టీ బీజేపీకి దూరమయ్యేందుకు ప్రయత్నం చేయడమో లేకపోతే.. బ్లాక్ మెయిలింగ్ లాంటి రాజకీయం చేయడమో చేస్తోందని అంచనాలు వస్తున్నాయి. మొత్తంగా టీడీపీని.. బీజేపీ చూసే కోణంలో స్పష్టమైన మార్పు మాత్రం కనిపిస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

నేడు ఏపీలో ప్రధాని పర్యటన..వైసీపీని టార్గెట్ చేస్తారా.?

సోమవారం ఏపీలో ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు ప్రధాని నరేంద్ర మోడీ.అనకాపల్లిలో బీజేపీ ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్ కు మద్దతుగా బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించనున్నారు. సాయంత్రం 5 : 30 గంటలకు...

ఓటేస్తున్నారా ? : మీ పిల్లలు బానిసలుగా బతకాలనుకుంటున్నారా ?

ఊరంటే ఉపాధి అవకాశాల గని కావాలి. మనం ఊళ్లో బతకాలంటే పనులు ఉండాలి. ఆ పనులు స్థాయిని బట్టి రియల్ ఎస్టేట్ పనుల దగ్గర నుంచి సాఫ్ట్...

తెలంగాణ మోడల్…బీజేపీ, బీఆర్ఎస్ కు రాహుల్ అస్త్రం ఇచ్చారా..?

కేంద్రంలో అధికారంలోకి వస్తే దేశమంతా తెలంగాణ మోడల్ ను అమలు చేస్తామని ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రకటన చర్చనీయాంశం అవుతోంది. తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ ఏర్పడి ఆరు నెలలే అవుతున్నా అప్పుడే...

జూన్6 తర్వాత పెను మార్పులు… షా వ్యాఖ్యల అంతర్యమేంటి..?

జూన్ 6 తర్వాత తెలంగాణలో పెను మార్పులు ఉంటాయన్న అమిత్ షా వ్యాఖ్యల అంతర్యం ఏంటి..? మరోసారి కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే రేవంత్ సర్కార్ ను కూల్చుతామని షా వ్యాఖ్యల సంకేతమా..?...

HOT NEWS

css.php
[X] Close
[X] Close