పెద్దిరెడ్డి విశ్వరూపం – వాడిపోతున్న రోజా !

నగరి వైసీపీలో ఐదు మండలాల ఇంచార్జ్‌లతో పాటు ఇతర నేతలంతా ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు. తిరుపతిలో ప్రెస్ మీట్ పెట్టి.. రోజాను ఘోరంగా ఓడించి .. నగరి నుంచి తరిమేస్తామని ప్రకటించారు. వీరంతా మంత్రి పెద్దిరెడ్డి అనుచరులు. పెద్దిరెడ్డి తనను గెలవకుండా చేస్తున్నారని తన వ్యతిరేకుల్ని ఆయనే పెంచి పోషిస్తున్నారని హైకమాండ్ కు ఎంత మొర పెట్టుకున్నా ఫలితం రాలేదు. చివరికి తన అధికారంతో పెద్దిరెడ్డి అనుచరుల్ని పార్టీ నుంచి సస్పెండ్ చేయడం ప్రారంభించారు. దీంతో వారు మండిపోయి పార్టీకి గుడ్ బై చెప్పారు.

వరుసగా రెండు సార్లు గెలిచిన రోజా ఒకసారి వెయ్యి ఓట్లు.. మరోసారి రెండు వేల ఓట్లు లోపు తేడాతో గెలిచారు. అప్పట్లో రోజాపై ఇంత అసంతృప్తి లేదు. కానీ పార్టీ అధికారంలోకి వచ్చాక ఎవరికీ చాన్స్ లేకుండా తానే సంపాదించుకోవడంతో సమస్యలు ప్రారంభమయ్యాయి. చివరికి లోకల్ పోల్స్ లో కూడా డబ్బులు తీసుకుని టిక్కెట్లు ఇవ్వడంతో అందరూ వ్యతిరేకమయ్యారు. ఐదు మండలాల్లో రోజాకు ఫ్లెక్సీ పెట్టే నేత కూడా లేరు. అయినా రోజా ఎప్పుడూ తగ్గలేదు. వ్యతిరేకుల్ని దగ్గరకు తీసుకునే ప్రయత్నం చేయలేదు.

మొత్తంగా ఎన్నికలకు ముందు అందరూ బయటపడ్డారు. రోజా ఎలాగూ గెలవరు.. వైసీపీ రాష్ట్రంలో గెలవదని క్లారిటీ రావడంతో… రాజకీయం ప్రారంభించారు. అందరూ మూకుమ్మడిగా రాజీనామాలు చేశారు. టీడీపీ లోకి వెళ్తామని ప్రకటించారు. రోజా మాత్రం ఇప్పటికీ చేయగలిగిందేమీ లేదని.. పథకాల లబ్దిదారులు పార్టీలతో సంబంధం లేకుండా ఓట్లేస్తారని ఆశ పడుతున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఊపిరి పీల్చుకున్న డబ్బింగ్ బొమ్మ

తమిళ సినిమాలు తెలుగులో తెగ అడేస్తాయి. విక్రమ్, జైలర్ విజయాల్లో తెలుగు ప్రేక్షకుల వాటానే ఎక్కువ. అయితే కొన్నాళ్ళుగా తమిళ సినిమాల సందడి తగ్గింది. ఇలా రావడం అలా వెళ్ళిపోవడమే కానీ ఒక్కటంటే...

ట్రైనీ ఐఏఎస్ గా కూతురు… ఉప్పొంగిన హృదయంతో తండ్రి సెల్యూట్

ఆ దృశ్యం... అందరినీ కదిలించింది. ఆమె విజయం.. ఆ కన్నతండ్రికి గర్వకారణమైంది. తమ పిల్లలు ఉన్నత స్థాయికి చేరుకుంటే చూసి మురిసిపోవాలని తండ్రులందరూ భావిస్తారు కానీ, కొంతమంది తండ్రుల ఆశలు మాత్రమే...

చెవిరెడ్డి శ్రీవారి దర్శన వ్యాపారం రేంజే వేరు !

చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి .. జగన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు. జగన్ రెడ్డి సతీమణికి తన ఇంటి పక్కన గోశాల లాంటి కుటీరం కావాలని అనిపిస్తే.. అఘమేఘాల మీద కట్టేస్తాడు....

ఫర్నిచర్‌కు జగన్ డబ్బులిచ్చేస్తారట !

సీఎంగా చేసి ఫర్నీచర్‌ను కొట్టేశారని జగన్ పై వస్తున్న ఆరోపణలకు వైసీపీ స్పందించింది. ఓడిపోగానే.. ప్రజాధనంతో క్యాంప్ ఆఫీసు కోసం కొనుగోలు చేసిన వస్తువులన్నింటికీ డబ్బులిస్తామని ప్రభుత్వానికి సమాచారం ఇచ్చామని వైసీపీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close