చంద్రబాబుకి కేసీఆర్ హెచ్చరిక: నిద్రపోతున్న పులిని లేపొద్దు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డిని తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ చాలా ఘాటుగా హెచ్చరించారు. తెలంగాణా ప్రభుత్వం చేపట్టిన నీటి ప్రాజెక్టులపై అనవసరమయిన కుట్రలు, రాజకీయాలు చేసి నిద్రపోతున్న పులిని లేపొద్దని హెచ్చరించారు. మీరు ఇటుకతో కొడితే మేము రాళ్ళూ పెట్టి కొడతామని తీవ్రంగా హెచ్చరించారు. కృష్ణా, గోదావరి నదీ జలాలలో తెలంగాణా రాష్ట్రానికి న్యాయంగా ఉన్న వాటా నీళ్ళని వాడుకొనేందుకు ప్రాజెక్టులు కట్టుకొంటే మామీద పడి ఎందుకు ఏడుస్తారు? అని ప్రశ్నించారు. తెలంగాణా ప్రాజెక్టులపై అనవసరమయిన ఆరోపణలు చేస్తూ ఆంధ్రా నేతలు పరువు పోగొట్టుకోవద్దని హెచ్చరించారు. చంద్రబాబు నాయుడు, జగన్మోహన్ రెడ్డి ఇద్దరూ కడుపులో కత్తులు దాచుకొని నోట్లో బెల్లం ముక్క పెట్టుకొని కపటంగా మాట్లాడుతారని కేసీఆర్ ఇద్దరిని విమర్శంచారు. ఆంధ్రాలో రాజకీయాలు చేసుకోదలిస్తే చేసుకోండి కానీ మాజోలికి వస్తే కబడ్ధార్! అని హెచ్చరించారు.

చంద్రబాబు, జగన్ లపై కేసీఆర్ నిప్పులు ఈవిధంగా చెరుగుతుంటే, తెలంగాణా నీటి పారుదల శాఖ మంత్రి టి. హరీష్ రావు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావుకి స్వయంగా ఫోన్ చేసి నీటి సమస్యలను చర్చల ద్వారా సామరస్యంగా పరిష్కరించుకొందామని చెప్పడం విశేషం. అందుకు దేవినేని కూడా సానుకూలంగా స్పందించి, అన్ని సమస్యలను కేంద్ర జలవనరుల శాఖ మంత్రి ఉమా భారతి సమక్షంలో పరిష్కరించుకొందామని సూచించారు.

ఈవిధంగా ఇరు పక్షాలు చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించుకొనే ప్రయత్నం చేయకుండా ఒకరినొకరు రెచ్చగొట్టుకొనే విధంగా సవాళ్లు విసురుకోవడం చాలా శోచనీయం.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

గుర్తుకొస్తున్నారు గురువు గారూ!!

ఇండ‌స్ట్రీలో స్టార్లు, సూప‌ర్ స్టార్లు చాలామంది ఉన్నారు. లెజెండ్లు, సెల‌బ్రెటీల‌కైతే లెక్కేలేదు. కానీ గురువు ఒక్క‌రే. ఆయ‌నే దాస‌రి... దాస‌రి నారాయ‌ణ‌రావు. ఇండ‌స్ట్రీ మొత్తం గురువుగారూ.. అనిపిలుచుకొనే వ్య‌క్తి.. ఒకే ఒక్క దాస‌రి. ద‌ర్శ‌కుడిగా ఆయ‌నేంటి? ఆయ‌న ప్ర‌తిభేంటి?...

చాయ్‌కీ.. చైతూకీ భ‌లే లింకు పెట్టేశారుగా!

స‌మంత‌తో విడిపోయాక‌.. నాగ‌చైత‌న్య మ‌రో పెళ్లి చేసుకోలేదు. కాక‌పోతే... త‌న‌కో 'తోడు' ఉంద‌న్న‌ది ఫిల్మ్‌న‌గ‌ర్ వ‌ర్గాల మాట‌. క‌థానాయిక‌ శోభిత ధూళిపాళ తో చై స‌న్నిహితంగా ఉంటున్నాడ‌ని, వీరిద్ద‌రూ డేటింగ్ చేస్తున్నార‌ని చాలార‌కాలుగా...

ఎక్స్ క్లూజీవ్‌: దిల్ రాజు బ్యాన‌ర్‌లో ధ‌నుష్‌

ధ‌నుష్ ఈమ‌ధ్య తెలుగు ద‌ర్శ‌కులు, తెలుగు నిర్మాత‌ల‌పై దృష్టి పెట్టాడు. 'సార్' అలా వ‌చ్చిందే. ఈ సినిమా బాక్సాఫీసు ద‌గ్గ‌ర మంచి ఫ‌లితాన్ని అందుకొంది. ఇప్పుడు శేఖ‌ర్ క‌మ్ముల ద‌ర్శ‌క‌త్వంలో 'కుబేర‌' చేస్తున్నాడు....

ఇస్మార్ట్… ప‌ట్టాలెక్కింది!

రామ్ - పూరి జ‌గ‌న్నాథ్ కాంబోలో వ‌చ్చిన 'ఇస్మార్ట్ శంక‌ర్‌' ఇన్‌స్టెంట్ హిట్ అయిపోయింది. రామ్ కెరీర్‌లోనే భారీ వ‌సూళ్ల‌ని అందుకొన్న సినిమా ఇది. ఇప్పుడు ఈ చిత్రానికి సీక్వెల్‌గా 'డ‌బుల్ ఇస్మార్ట్'...

HOT NEWS

css.php
[X] Close
[X] Close