మధ్యప్రదేశ్ రైలు ప్రమాదాలు: 31కు చేరిన మృతుల సంఖ్య

మధ్యప్రదేశ్‌లో మంగళవారం రాత్రి 11.45గంటలకు జరిగిన ప్రమాదాలలో చనిపోయినవారి సంఖ్య 31కు చేరింది. మరో 70 మంది గాయపడ్డారు. కామయాని ఎక్స్‌ప్రెస్, జనతా ఎక్స్‌ప్రెస్ రైళ్ళు ఒక వంతెన దాటుతుండగా పట్టాలుతప్పి నదిలో పడిపోయాయి. ముంబై నుండి వారణాసి వెళుతున్న కామయాని ఎక్స్ ప్రెస్ నదిపై ఉన్న వంతెన మీదకు రాగానే పట్టాలు తప్పింది. ఇంజనుతో సహా 10 బోగీలు నదిలో పడిపోయాయి. ఆ తరువాత మరికొన్ని క్షణాల వ్యవధిలోనే అదే వంతెనపైకి రెండవ వైపు నుండి ప్రవేశించిన జబల్ పూర్ నుండి ముంబై వెళుతున్న జనతా ఎక్స్ ప్రెస్ కూడా పట్టాలు తప్పడంతో ఇంజనుతో సహా 5 బోగీలు నదిలో పడిపోయాయి. గత కొన్ని రోజులుగా మధ్యప్రదేశ్ రాష్ట్రంలో భారీగా వర్షాలు కురుస్తుండటంతో మాచక్ నదికి వరద వచ్చింది. నదిలో నీళ్ళు ఉప్పొంగడంతో పట్టాల క్రింద ఉండే మట్టి, రాళ్ళు కొట్టుకుపోయాయి. ఆ కారణంగానే రెండు రైళ్ళు పట్టాలు తప్పాయని తెలుస్తోంది. ఈ ప్రమాదంలో ఇంతవరకు 12 మంది మరణించినట్లు, 25మంది గాయపడినట్లు సహాయక చర్యలు చేపడుతున్న అధికారులు తెలియజేసారు.

ప్రమాదం జరిగిన వెంటనే అక్కడికి చేరుకొన్న రైల్వే ఉన్నతాధికారులు, సహాయ సిబంది అక్కడికి చేరుకొని సహాయ చర్యలు మొదలు పెట్టారు. హోరున కురుస్తున్న వానలో కటిక చీకటిలో క్రిందన చాల ఉదృతంగా ప్రవహిస్తున్న మాచక్ నదిపై ఉన్న వంతెన వద్దకు చేరుకొని సహాయ చర్యలు చేప్పట్టడం చాలా కష్టంగా ఉన్నప్పటికీ సహాయ సిబ్బంది, స్థానికులు కలిసి ప్రమాదంలో చిక్కుకొన్న సుమారు 300 మంది ప్రయాణికులను రక్షించగలిగారు. గాయపడిన వారినందరినీ స్థానిక ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రులకు తరలించి చికిత్సలు అందిస్తున్నారు.

సమాచార లోపం కారణంగానే జనతా ఎక్స్ ప్రెస్ ని కూడా నదిపై ఉన్న వంతెన మీదకు అనుమతించినట్లు తెలుస్తోంది. కానీ స్థానిక రైల్వే సిబ్బంది నిర్లక్ష్యం, అజాగ్రత్త కారణంగానే ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చును. భారీ వర్షాల కారణంగా మాచక్ నది ఉదృతంగా ప్రవహిస్తున్న సంగతి స్థానిక రైల్వే సిబ్బందికి, అధికారులకి తెలియదని భావించలేము. వారు ఎప్పటికప్పుడు నదిపై ఉన్న వంతెనను గమనిస్తూ పరిస్థితిని అంచనా వేసిన తరువాతనే రైళ్ళను అనుమతించాల్సి ఉంటుంది. కానీ అదేమీ పట్టించుకోకుండా రైళ్ళను ఆ నదిపై ఉన్న వంతెనపైకి అనుమతించడం వలననే ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చును.

స్థానిక రైల్వే సిబ్బంది అప్రమత్తంగా మెలిగి ఉంటే ఈ ఘోర ప్రమాదాలను నివారించగలిగేవారని స్పష్టం అవుతోంది. ఇప్పుడు ప్రమాదం జరిగిన తరువాత మేల్కొన్న స్థానిక రైల్వే అధికారులు పలు రైళ్ళను వేరే మార్గం ద్వారా పంపిస్తున్నారు. రైల్వే శాఖ ముందస్తు జాగ్రత్తగా ముంబై, ఉత్తర ప్రదేశ్, మధ్యప్రదేశ్, పంజాబ్ రాష్ట్రాల నుండి బయలుదేరవలసిన అనేక రైళ్ళను రద్దు చేసింది. ఇదే నిర్ణయం ముందే తీసుకొని ఉండి ఉంటే ఇంత ఘోర ప్రమాదం జరిగి ఉండేదే కాదు. రైల్వే సహాయక బృందాలు నిన్న రాత్రినుండి నిర్విరామంగా సహాయ చర్యలలో పాల్గొంటున్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రేవంత్‌కు ఢిల్లీ పోలీసుల నోటీసులు – తెలంగాణపై దాడే !

ఓ సోషల్ మీడియా పోస్టు షేర్ చేసినందుకు ఢిల్లీ నుంచి వచ్చి పోలీసులు నోటీసులు ఇవ్వడాన్ని సీఎం రేవంత్ రెడ్డి.. తెలంగాణపై దాడిగా పేర్కొన్నారు. బీజేపీ విధానాలను ప్రశ్నించినందుకు తెలంగాణ ముఖ్యమంత్రికి,...

దేవగౌడ మనవడి రాసలీలలు – బీజేపీకి తలనొప్పి !

కర్ణాటకలో రాజకీయ నేతల రాసలీలల ఎపిసోడ్ లేకుండా ఎన్నికలు జరగవు. గతంలో అసెంబ్లీలోనే ఎమ్మెల్యేలు బ్లూ ఫిల్మ్‌ చూస్తూ దొరికిపోయారు. తర్వాత మంత్రిగా ఉండి రమేష్ జార్కిహోళి అనే నేత చేసిన...

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ

వైఎస్ జగన్ సర్కార్ ఇంప్లిమెంట్ చేసిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ జరుగుతోంది. ఏ గ్రామంలో చూసినా దీనిపైనే చర్చ. పట్టణ ప్రాంతాల్లో రాజకీయ అవగాహన ఉన్న...

కొన్ని చోట్ల స్వతంత్రులకు గాజు గ్లాస్ గుర్తు – ఈసీ ఆదేశాలపై గందరగోళం !

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఎన్నికల సంఘం నిర్దిష్టమైన ఆదేశాలపై రిటర్నింగ్ అధికారులకే స్పష్టత లేకపోవడంతో ఎక్కడికక్కడ గందరగోళం ఏర్పడుతోంది. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో స్వతంత్రులకు రిటర్నింగ్ అధికారులు గుర్తులు కేటాయింటారు. ఫ్రీ సింబల్స్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close