గుంటూరు మాజీ మేయర్ కావటి మనోహర్ నాయుడును వైసీపీ నుంచి సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఆయనతో పాటు మరో ఇద్దరు కార్పొరేటర్లను కూడా సస్పెండ్ చేశారు. పార్టీ అనుమతి లేకుండా మేయర్ పదవికి రాజీనామా చేసి.. మేయర్ సీటు టీడీపీకి వెళ్లేలా చేశారని కావటిపై ఆరోపణలు ఉన్నాయి. అదే సమయంలో ఆయన పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడం లేదు. పార్టీకి దూరంగా ఉండే వారికి సందేశం ఇవ్వాలన్న ఉద్దేశంతో ఆయనను సస్పెండ్ చేసినట్లుగా తెలుస్తోంది.
కావటి మనోహర్ నాయుడుకు నోటి దురుసు చాలా ఎక్కువ. ఆయన లోకేష్ పై అత్యంత ఘోరంగా. బూతులు తిట్టారు. పవన్ కల్యాణ్ నూ వదిలి పెట్టలేదు. ఈ అంశంపై ఆయనపై కేసులు ఉన్నాయి. ఆయనను ఏ పార్టీలోనూ చేర్చుకునే అవకాశం ఉండదని భావిస్తున్నారు. రాజకీయ జీవితం సంగతేమో కానీ కేసుల బారి నుంచి తప్పించుకోవడానికి అయినా ఆయన పార్టీకి దూరంగా ఉండక తప్పదని అనుకున్నట్లుగా చెబుతున్నారు.
చిలుకలూరిపేట ఎమ్మెల్యే విడదల రజనీకి గుంటూరు టిక్కెట్ ఇచ్చిన తర్వాత .. గుంటూరు మేయర్ కావటి మనోహర్ నాయుడుకు చిలుకలూరిపేట టిక్కెట్ ఇచ్చారు. కానీ అక్కడ ఆయన గెలవలేదు. దీంతోమళ్లీ రజనీ చిలుకలూరిపేట వెళ్లారు. కావటికి అక్కడా ఇంచార్జ్ పోస్టు పోయింది.చివరికి ఆయన వైసీపీకి దూరమయ్యారు.