తెలంగాణ జాగృతికి, బీఆర్ఎస్ పార్టీకి మధ్య కనిపించని రేస్ జరుగుతోంది. కవిత ఈ విషయంలో ముందుకెళ్లిపోతున్నారు. ప్రస్తుతానికి వన్ ఉమెన్ ఆర్మీ కాబట్టి ఆమెకు పిలుపునివ్వాల్సిన పని లేదు. అనుచరుల్ని తీసుకుని రోడ్డు మీదకు వెళ్లిపోతున్నారు. బీఆర్ఎస్ ఏమీ చేయడం లేదు..నేనే ప్రజల్లో ఉన్నాన్న సంకేతాన్ని పంపుతున్నారు.
తాజాగా ప్రభుత్వం బస్ పాస్ ధరల్ని పెంచింది. అసలు రాజకీయ పార్టీలు ఎలాంటి ఆందోళనలు చేద్దాము అని నిర్ణయించుకోక ముందే కవిత బస్ భవన్ ముందు ధర్నా చేశారు. పెంచిన బస్సు రేట్లపై తెలంగాణ జాగృతి తప్పకుండా ఉద్యమం చేస్తుందని హెచ్చరించారు. ఉచిత బస్సు పథకం పెట్టమని మేము అడిగామాఅని ప్రశ్నించారు. కాసేపు ధర్నా చేసిన తర్వాత పోలీసులు ఆమెను అరెస్టు చేశారు.
కవిత పాత రాజకీయాలను నమ్ముకుంటున్నారు. తెలంగాణ ఉద్యమంలో చెప్పన డైలాగుల్ని ఇప్పుడు కూడా చెబుతున్నారు. బోనాలు వస్తున్నాయని అందరూ
ప్రతి బోనం పైన జై తెలంగాణ అని రాయాలని.. మన తెలంగాణ అస్తిత్వాన్ని మనమే కాపాడుకోవాలి అంటున్నారు. ఫోన్ ఎత్తినప్పుడు హలో అని కాకుండా జై తెలంగాణ అనాలని కూడా పిలుస్తున్నారు. అప్పుడు అంటే తెలంగాణలో అలా పిలివాలని పిలపునిచ్చారు.. మరి ఇప్పుడెందుకు?. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగానే ఉంది. ఇంకా అస్థిత్వం కాపాడుకోవడం అనే కాన్సెప్ట్ ఎందుకు తెరపైకి తెస్తున్నారు?. కాలం మారినట్లుగా కవితకు ఇంకా అర్థం కాలేదు కానీ.. సేమ్ ఓల్డ్ పాలిటిక్స్ చేస్తున్నారన్న సెటైర్లు వినిపిస్తున్నాయి.