యనమలకు ఘాటుగా కౌంటర్ ఇచ్చిన పవన్

హైదరాబాద్: భూసేకరణపై తనను ఎద్దేవా చేస్తూ ఏపీ ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు చేసిన వ్యాఖ్యలపై పవన్ ఘాటుగా స్పందించారు. భూసేకరణ చేయకుండా రాజధాని నిర్మించటానికి ఇదేమీ త్రిశంకు స్వర్గంకాదని, తాము విశ్వామిత్రులం కామని అన్న యనమల వ్యాఖ్యలకు కౌంటర్ ఇస్తూ ముందు కట్టేది స్వర్గమనేది తెలిస్తే, అది త్రిశంకు స్వర్గమా, రెగ్యులర్ స్వర్గమా అనేది తర్వాత ఆలోచించొచ్చని అన్నారు. సినిమా పరిశ్రమకు హైదరాబాద్‌లో ఇచ్చినవి కొండలు…బహుళ పంటలు పండే పొలాలు కాదని, ఇది రామకృష్ణుడికి తెలియదనుకుంటా అని ట్వీట్ చేశారు. హైదరాబాద్‌ కొండల్లోగానీ, విశాఖపట్నం కొండల్లోలోగానీ తనకు స్టూడియోలు లేవని తెలిపారు. తాను ఎంతో బాధ్యతతో రైతుల సమస్యని ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తే విజ్ఞతతో స్పందించటంమానేసి రైతుల ఆవేదనను వెటకారం చేయటం వారికే చెల్లిందని పేర్కొన్నారు. త్వరలో బేతపూడి, ఉండవల్లి, పెనుమాక తదితర నదీ పరీవాహక గ్రామాల రైతులను కలుస్తానని తెలిపారు.

మరోవైపు గుంటూరుజిల్లా మంగళగిరి పట్టణంలో పవన్ ఫోటోకు రైతులు, జనసేన కార్యకర్తలు పాలాభిషేకం చేశారు. రాజధానికోసం భూసేకరణ చేపట్టనున్న సమయంలో భూసేకరణ చట్టం ప్రయోగించొద్దంటూ రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసిన నేపథ్యంలో ఈ పాలాభిషేకం నిర్వహించారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఈ ప్ర‌శ్న‌కు బ‌దులేది జ‌క్క‌న్నా..?!

RRR.... ఇండియ‌న్ ఫిల్మ్ ఇండ‌స్ట్రీలోనే ఓ చ‌రిత్ర‌. వ‌సూళ్ల ప‌రంగా, రికార్డుల ప‌రంగా, అవార్డుల ప‌రంగానూ... ఈ సినిమాకు తిరుగులేదు. మ‌ల్టీస్టార‌ర్ స్టామినా పూర్తి స్థాయిలో చాటి చెప్పిన సినిమా ఇది. తెలుగు...

నో హోప్స్ : డబ్బుల పంపకంపై జగన్ సిగ్నల్ ఇచ్చారా ?

చంద్రబాబులా నా దగ్గర డబ్బల్లేవు.. చంద్రబాబు డబ్బులిస్తే తీసుకుని నాకే ఓటేయండి అని జగన్ రెడ్డి ఎన్నికల ప్రచారసభల్లో తన ప్రచార స్పీచ్‌లలో కొత్తగా చెబుతున్నారు. జగన్ దగ్గర డబ్బుల్లేవా అని వైసీపీ...

కాంగ్రెస్‌లో మల్లారెడ్డి కోవర్టులా .. అసలు కాంగ్రెస్ కోవర్టే మల్లారెడ్డినా ?

మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి కాంగ్రెస్ పార్టీలో తన కోవర్టులున్నారని ప్రకటించుకున్నారు. ఎవరయ్యా వాళ్లు అంటే.. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే కాంగ్రెస్ లోకి జంప్ అయిన వాళ్లు. వాళ్లందర్నీ తానే కాంగ్రెస్ లోకి పంపానని...

ఈసీ ఆదేశించకుండానే షర్మిలపై కేసులు కూడా !

ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత ఎన్నికలకు సంబంధించిన ప్రకటనలు.. వ్యవహారాలు అన్నీ ఈసీ పరిధిలోకి వస్తాయి. కోడ్ ఉల్లంఘిస్తే.. చర్యలు ఈసీ తీసుకోవాలి. కానీ ఏపీలో రాజ్యాంగం వేరుగా ఉంటుంది. ఎన్నికల...

HOT NEWS

css.php
[X] Close
[X] Close