బ‌న్నీ బాట‌లో… శిరీష్‌

తెలుగు క‌థానాయ‌కులు త‌మిళ మార్కెట్‌పై దృష్టి పెట్టారు. తెలుగు, త‌మిళం.. ఇలా ఒకేసారి రెండు భాష‌ల్లోనూ సినిమాలు చేసి.. ఒకే సినిమాతో రెండు మార్కెట్ల‌నీ ప‌ట్టేద్దామ‌ని ప్లాన్ వేశారు. అలా జ‌ర‌గాలంటే.. త‌మిళ ద‌ర్శ‌కుల‌తో ఓ తెలుగు సినిమా చేయ‌డం ఉత్త‌మ‌మార్గం. ప్ర‌స్తుతం మ‌హేష్ బాబు, అల్లు అర్జున్‌లు అదే చేస్తున్నారు. మురుగ‌దాస్ తో మ‌హేష్ ఓ సినిమా చేస్తున్నాడు. లింగుస్వామి క‌థ‌కు బ‌న్నీ ఓకే చెప్పాడు. ఇవి రెండూ ద్విభాషా చిత్రాలే. ఇప్పుడు అల్లు శిరీష్‌కూడా అదే ప్లాన్ వేశాడు. శ్రీ‌ర‌స్తు – శుభ‌మ‌స్తుతో కాస్త ఉప‌శ‌మ‌నం పొందాడు శిరీష్‌. ఇదే జోష్‌తో మ‌రో హిట్టు కొట్టి.. అంద‌రి దృష్టి త‌న‌వైపుకు తిప్పుకోవాల‌ని చూస్తున్నాడు. ప‌నిలో ప‌నిగా త‌మిళ ప్రేక్ష‌కుల్నీ ఆక‌ట్టుకోవాల‌న్న ధ్యేయంతో ఉన్నాడు.

అందులో భాగంగా త‌మిళ ద‌ర్శ‌కుడు సుశీంద్ర‌న్‌తో శిరీష్ ఓ సినిమా చేయ‌బోతున్నాడ‌ని తెలుస్తోంది. నా పేరు శివ‌లాంటి సినిమాతో ఆక‌ట్టుకొన్నాడు సుశీంద్ర‌న్‌. ప‌క్కా నేటివిటీతో, స‌హ‌జమైన క‌థల‌తో ఆక‌ట్టుకొనే ద‌ర్శ‌కుడు సుశీంద్ర‌న్‌. బ‌డా హీరోలు సైతం సుశీంద్ర‌న్‌తో క‌ల‌సి ప‌నిచేయ‌డానికి ఉత్సాహం చూపిస్తున్నారు. అలాంటి ద‌శ‌లో శిరీష్‌కి క‌ల‌సి ఓ క‌థ చెప్పాడ‌ట సుశీంద్ర‌న్‌. అది విన్న శిరీష్‌.. ఫ్లాటైపోయిన‌ట్టు టాక్‌. ఈ సినిమాని తెలుగు, త‌మిళ భాష‌ల్లో గీతా ఆర్ట్స్ సంస్థ తెర‌కెక్కించే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి. ఈ సినిమా ఓకే అయి ప‌ట్టాలెక్కితే గ‌నుక‌.. శిరీష్ త‌మిళ ఇన్నింగ్స్‌కి కొబ్బ‌రికాయ్ కొట్టేసిన‌ట్టే.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఈ ప్ర‌శ్న‌కు బ‌దులేది జ‌క్క‌న్నా..?!

RRR.... ఇండియ‌న్ ఫిల్మ్ ఇండ‌స్ట్రీలోనే ఓ చ‌రిత్ర‌. వ‌సూళ్ల ప‌రంగా, రికార్డుల ప‌రంగా, అవార్డుల ప‌రంగానూ... ఈ సినిమాకు తిరుగులేదు. మ‌ల్టీస్టార‌ర్ స్టామినా పూర్తి స్థాయిలో చాటి చెప్పిన సినిమా ఇది. తెలుగు...

నో హోప్స్ : డబ్బుల పంపకంపై జగన్ సిగ్నల్ ఇచ్చారా ?

చంద్రబాబులా నా దగ్గర డబ్బల్లేవు.. చంద్రబాబు డబ్బులిస్తే తీసుకుని నాకే ఓటేయండి అని జగన్ రెడ్డి ఎన్నికల ప్రచారసభల్లో తన ప్రచార స్పీచ్‌లలో కొత్తగా చెబుతున్నారు. జగన్ దగ్గర డబ్బుల్లేవా అని వైసీపీ...

కాంగ్రెస్‌లో మల్లారెడ్డి కోవర్టులా .. అసలు కాంగ్రెస్ కోవర్టే మల్లారెడ్డినా ?

మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి కాంగ్రెస్ పార్టీలో తన కోవర్టులున్నారని ప్రకటించుకున్నారు. ఎవరయ్యా వాళ్లు అంటే.. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే కాంగ్రెస్ లోకి జంప్ అయిన వాళ్లు. వాళ్లందర్నీ తానే కాంగ్రెస్ లోకి పంపానని...

ఈసీ ఆదేశించకుండానే షర్మిలపై కేసులు కూడా !

ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత ఎన్నికలకు సంబంధించిన ప్రకటనలు.. వ్యవహారాలు అన్నీ ఈసీ పరిధిలోకి వస్తాయి. కోడ్ ఉల్లంఘిస్తే.. చర్యలు ఈసీ తీసుకోవాలి. కానీ ఏపీలో రాజ్యాంగం వేరుగా ఉంటుంది. ఎన్నికల...

HOT NEWS

css.php
[X] Close
[X] Close