ఆ విష‌యంలో జ‌గ‌న్‌ కు ఎందుకంత అశ్ర‌ద్ధ‌..?

గ‌తంలో పోల్చుకుంటే ప్ర‌తిప‌క్ష పార్టీ వైకాపాలో ఈ మ‌ధ్య కాస్త ఊపు క‌నిపిస్తోంది. ఆప‌రేష‌న్ ఆకర్ష్‌ దెబ్బ‌తో కొంత‌మంది ఎమ్మెల్యేలు దూరం కావ‌డం, ప్ర‌జా స‌మ‌స్య‌ల ప‌ట్ల కాస్త ఆల‌స్యంగా స్పందిస్తుండ‌టం వంటి కార‌ణాల‌తో పార్టీ శ్రేణుల్లో ఒకింత నిరుత్సాహ వాతావ‌ర‌ణ‌మే ఉండేది. అయితే, ఈ మ‌ధ్య కొంత‌మంది నేత‌లు వైకాపాలోకి చేర‌డంతో న‌యా జోష్ పెరిగింది. పైగా, ఎన్నిక‌లు ఇప్ప‌టికిప్పుడే ముంచుకొచ్చేస్తున్న‌ట్టుగా పార్టీలో ఒక హ‌డావుడి వాతావ‌ర‌ణాన్ని జ‌గ‌న్ తీసుకొచ్చారు. ఏదో ధీమాతో త‌మ అధినేత దూసుకుపోతున్నార‌నే భావ‌న పార్టీ వ‌ర్గాల్లో క‌ల్పించారు. మ‌ధ్యంత‌రం వ‌స్తుంద‌న్న ఆశ వైకాపా వ‌ర్గాల్లో కాస్త బ‌లంగానే ఉన్న‌ట్టుంది. నోట్ల ర‌ద్దు అంశంపైగానీ, ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు ప్ర‌త్యేక హోదా విష‌యంలోగానీ కేంద్రంతో త‌ల‌ప‌డుతున్నారు. సో… పైపైకి అంతా బాగుప‌డుతోంద‌న్న ఒక‌స్థాయి న‌మ్మ‌కాన్ని పార్టీ వ‌ర్గాల్లో తీసుకురాగ‌లిగారు. కానీ, పార్టీ పునాదులను దృఢంగా చేసే ప్ర‌య‌త్నాలు మాత్రం ఇంకా ఆరంభం కావ‌డం లేద‌ని చెప్పాలి.

ఎంత గొప్ప చ‌రిత్ర‌గ‌ల పార్టీకైనా కార్య‌క‌ర్త‌లే బ‌లం. ఆ బ‌ల‌గాన్ని పెంచుకోవ‌డం కోసం నిత్యం ఆరాట‌ప‌డుతూ ఉండాలి. ఆ విష‌యంలో అధికార పార్టీ తెలుగుదేశం నిరంత‌రం అప్ర‌మ‌త్తంగా ఉంటుంద‌ని అన‌డంలో సందేహం లేదు. ఫిరాయింపుల పేరుతో ఎంత‌మంది నాయ‌కుల సంఖ్య‌ను పెంచుకుంటూ ఉన్నా… దాంతోపాటు, కార్య‌క‌ర్త‌ల సంఖ్య‌ను కూడా క్షేత్ర‌స్థాయిలో పెంచుకుంటోంది. కానీ, వైకాపా ఇప్ప‌టికిప్పుడు నాయ‌కుల సంఖ్య‌ను పెంచుకోవ‌డంపైనే ఎక్కువ దృష్టిపెడుతోంద‌ని అనిపిస్తోంది. తెలుగుదేశంతోపాటు, ఇత‌ర పార్టీల నేత‌ల‌కు కూడా వ‌ల‌లు వేస్తోంది. ఇప్ప‌టి నుంచే వ‌చ్చే ఎన్నిక‌ల్లో బ‌రిలో దిగే అభ్య‌ర్థుల‌ను కూడా ఎంపిక చేసేంత హ‌డావుడి పార్టీలో కొన‌సాగుతోంది.

పార్టీలోకి కొత్త‌వారు చేర‌డం త‌ప్పుకాదు. సామ‌ర్థ్య‌మున్న నాయ‌కులు అవ‌స‌ర‌మే. కానీ, దాంతోపాటు కిందిస్థాయిలో పార్టీ కార్య‌క‌ర్త‌ల్ని కూడా పెంచుకోవాలి క‌దా! అభిమానులంద‌రూ కార్య‌క‌ర్త‌లే, జ‌గ‌న్ స‌భ‌కు వ‌చ్చి చ‌ప్ప‌ట్లు కొడుతున్న‌వారంతా రేపొద్దున్న ఎన్నిక‌ల్లో ఓటు వేస్తార‌నే లెక్క‌లు వేసుకుంటే మొద‌టికే మోసం అవుతుంది. పార్టీ బ‌లోపేతంలో ప్ర‌ధాన‌మైన అంకం స‌భ్య‌త్వ న‌మోదు కార్య‌క్ర‌మం. వైకాపా ఇంత‌వ‌ర‌కూ ఆ ఊసే ఎత్త‌డం లేదు. దాని గురించి అధినేత జ‌గ‌న్ కూడా కాస్త లైట్‌గానే తీసుకుంటున్నార‌ట‌. వ‌చ్చే ఏడాది దాని గురించి ఆలోచించ‌వచ్చులే అనే ధోర‌ణిలో ఉన్న‌ట్టుగా పార్టీ వ‌ర్గాలు అభిప్రాయ‌ప‌డుతున్నాయి. ఏ రాజ‌కీయ పార్టీకైనా పునాదులు అంటేనే స‌భ్య‌త్వాల సంఖ్య‌. మ‌రి, ఈ దిశ‌గా ఎందుకింత తాత్సారం చేస్తున్నారో వారికే తెలియాలి. ఇప్ప‌టికే న‌మోదు ఆల‌స్య‌మైంది. ఇప్ప‌టికైనా, దాని ప్రాధాన్య‌త గుర్తిస్తే పార్టీ పునాదులు బ‌ల‌ప‌డ‌తాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఓటేస్తున్నారా ? : ఓ సారి రోడ్ల వైపు చూడండి!

ఏదైనా ఓ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే ముందుగా మౌలిక సదుపాయాలు ఉండాలి. అంటే రోడ్లు, కరెంట్, నీరు వంటివి. ఏపీలో రూ. 43 వేల కోట్లతో రోడ్లేశామని మేనిఫెస్టో విడుదల సందర్భంగా...

రికార్డ్ స్థాయి ఉష్ణోగ్రతలు..ప్రజలకు వైద్య ఆరోగ్యశాఖ సూచనలివే

తెలుగు రాష్ట్రాల్లో భానుడు సెగలు కక్కుతున్నాడు. రికార్డ్ స్థాయి ఉష్ణోగ్రతలతో ప్రజలు అల్లాడిపోతున్నారు. ఉదయం , సాయంత్రం అనే తేడా లేకుండా భానుడు బెంబేలెత్తిస్తున్నాడు. మే నెల ప్రారంభమైన మొదటి రోజే భానుడు...

టీడీపీ స్టార్ క్యాంపెయినర్ గా జగన్ రెడ్డి..!?

తెలంగాణలో బీఆర్ఎస్ చేసిన పొరపాటే వైసీపీ కూడా చేస్తోంది. అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఆరు గ్యారంటీలను బీఆర్ఎస్ విస్తృతంగా జనాల్లోకి తీసుకెళ్తే..ఏపీలో టీడీపీ సూపర్ సిక్స్ గ్యారంటీలను జగన్ రెడ్డి ప్రజల్లోకి...

జాతీయ స్థాయిలోనూ కాంగ్రెస్ ను రేసులో నిలబెడుతోన్న రేవంత్..!!

రేవంత్ రెడ్డి...ఈ పేరు జాతీయ స్థాయిలో చర్చనీయాంశం అవుతోంది. వ్యుహమో మరేమో కానీ, రిజర్వేషన్లపై కుట్ర జరుగుతుందంటూ బీజేపీకి ఊపిరి ఆడకుండా చేస్తున్నారు. రిజర్వేషన్లపై రేవంత్ వ్యాఖ్యల పుణ్యమా అని బీజేపీ జాతీయ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close