చింతపల్లిలో విజయవంతమైన జగన్ బహిరంగసభ

హైదరాబాద్: విశాఖపట్నం జిల్లాలో బాక్సైట్ తవ్వకాలకు వ్యతిరేకంగా మన్యంలోని చింతపల్లిలో ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ నిర్వహించిన బహిరంగసభ విజయవంతమైంది. సభకు ఆదివాసీలు, స్థానికులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. స్థానిక ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి మాట్లాడుతూ చంద్రబాబు నాయుడపై నిప్పులు చెరిగారు. గిరిజనులను చంద్రబాబు మోసం చేస్తున్నారని ఆరోపించారు. తర్వాత మాట్లాడిన జగన్, చంద్రబాబు నాయుడు ప్రతిపక్షనేతగా ఉన్నపుడు బాక్సైట్ తవ్వకాలను వ్యతిరేకించారని, అధికారంలోకి రాగానే మాట మార్చారని జగన్ ఆరోపించారు. బాక్సైట్‌ తవ్వకాలపై విడుదల చేసిన శ్వేతపత్రంలో గ్రామసభల ద్వారా ప్రజలు తవ్వకాలకు అనుమతి ఇచ్చారని పేర్కొన్నారని, అయితే అసలు గ్రామసభలు జరగనేలేదని స్థానికులు చెబుతున్నారని జగన్ తెలిపారు. గిరిజన ఎమ్మెల్యేలు ఏడుగురిలో ఆరుగురు వైసీపీ వారే ఉన్నారని, అందుకే చంద్రబాబు ట్రైబల్ అడ్వైజరీ కమిటీ వేయటం లేదని జగన్ ఆరోపించారు. ఇప్పటికైనా బాక్సైట్ తవ్వకాలకు సంబంధించిన జీవో నం.97ను వెనక్కుతీసుకోవాలని డిమాండ్ చేశారు. కేంద్రంపై ఒత్తిడి తేవటంతో బాక్సైట్ తవ్వకాలకు ఆగస్టులో అనుమతి ఇచ్చిందని చెప్పారు. వైఎస్ మొదట బాక్సైట్ తవ్వకాలకు అనుమతి ఇచ్చినా, ప్రజల అభిప్రాయం తెలుసుకుని దానిని ఆపేశారని జగన్ వ్యాఖ్యానించారు. చంద్రబాబు ఒక్క వెంట్రుక కూడా పీకలేడని, అందరమూ ఒక్కటై పోరాడదామని జగన్ అన్నారు. బాక్సైట్ తవ్వకాలను ఒక్క అడుగు కూడా ముందుకు కదలనీయమని చెప్పారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఒకే టైటిల్… మూడు సినిమాలు

టాలీవుడ్ లో టైటిళ్ల‌కు కొర‌త వ‌చ్చిందా? ప‌రిస్థితి చూస్తుంటే అదే అనిపిస్తోంది. త‌మ సినిమాల‌కు ఎలాంటి టైటిల్ పెట్టాలో అర్థం కాక‌, ఒక‌టే టైటిల్ తో మూడు సినిమాలు తీసేస్తున్నారు. టాలీవుడ్ లో...

బీజేపీపై పోస్టర్లు – అప్పట్లో బీఆర్ఎస్ ఇప్పుడు కాంగ్రెస్

బీజేపీపై చార్జిషీట్ అంటూ కాంగ్రెస్ పార్టీ నేతలు పోస్టర్లు రిలీజ్ చేశారు. తెలంగాణకు బీజేపీ చేసిన అన్యాయం అంటూ విభజన హామీలు సహా అనేక అంశాలను అందులో ప్రస్తావించింది. వాటిని హైదరాబాద్...

నామినేషన్‌లో పవన్ ఫోటో వాడేసుకున్న గుడివాడ అమర్నాథ్ !

రాజకీయ నాయకులకు కొంచెమైన సిగ్గు.. ఎగ్గూ ఉండవని జనం అనుకుంటూ ఉంటారు. అది నిజమేనని తరచూ కొంత మంది నిరూపిస్తూంటారు. అలాంటి వారిలో ఒకరు గుడివాడ్ అమర్నాథ్. పవన్ కల్యాణ్ పై...

కవిత అరెస్ట్ వెనక సంతోష్ రావు..!?

కవిత లిక్కర్ స్కామ్ లో కటకటాల పాలవ్వడానికి ఆ నేతే కారణమా..? తన స్వప్రయోజనాల కోసం ఆయన కవితను ఇరికించారా..?నమ్మకస్తుడిగా ఉంటూనే కేసీఆర్ కు వెన్నుపోటు పొడిచారా..?గత కొద్ది రోజులుగా సంతోష్ రావు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close