తెగ‌ని పంచాయితీలు.. బుల్లెట్ డౌట్‌?

గోపీచంద్ – బి.గోపాల్ క‌ల‌యిక‌లో రూపుదిద్దుకొన్న చిత్రం ఆర‌డుగుల బుల్లెట్. ఈ చిత్రం శుక్ర‌వారం విడుద‌ల అవ్వాల్సింది. అయితే… అనుకొన్న‌ట్టుగా ఈ సినిమా విడుద‌ల అవుతుందా? లేదా? అనే విష‌యంపై ఇంకా క్లారిటీ రాలేదు. కొద్ది గంట‌ల్లో సినిమా విడుద‌ల అవ్వాల్సివుంది. అయితే… ఆర్థిక ప‌ర‌మైన ఇబ్బందుల దృష్ట్యా ఆర‌డుగుల బుల్లెట్ విడుద‌ల‌కు ఇంకా క్లియ‌రెన్స్ రాలేదు. ప్ర‌స్తుతం పీవీవీ సంస్థ‌… ఫైనాన్పియ‌ర్ల‌తో మీటింగ్ పెట్టింది. ‘మా డ‌బ్బులు ఇస్తే గానీ.. ఈ సినిమాని విడుద‌ల కానివ్వం’ అంటూ అప్పుల వాళ్లు గొడ‌వ చేస్తున్నార‌ని తెలుస్తోంది. అయితే డ‌బ్బుల్ని తిరిగి ఇచ్చే ప‌రిస్థితిలో నిర్మాత లేడు. మ‌రోవైపు ఈ సినిమాకి సంబంధించిన ఆర్థిక ప‌ర‌మైన లావాదేవీల‌ను చూస్తున్న పీవీపీ కూడా చేతులు ఎత్తేసిన‌ట్టే క‌నిపిస్తోంద‌ని స‌మాచారం. ప‌రిస్థితి చూస్తుంటే… శుక్ర‌వారం ఈ సినిమా విడుద‌ల అవ్వ‌డం అనుమాన‌మే అని స‌న్నిహిత వ‌ర్గాలు చెబుతున్నాయి. రూ.6 కోట్లు అప్పు ఇచ్చిన ఎన్ ఆర్ ఐకి మాత్రం పీవీపీ కొంత మొత్తం ఇచ్చి కూల్ చేసిన‌ట్టు తెలుస్తోంది. మిగిలిన వాళ్లకు మాత్రం డ‌బ్బులు స‌ర్ద‌క‌పోవ‌డంతో.. బుల్లెట్ సినిమా ఆగిపోయే ప్ర‌మాదంలో చిక్కుకొంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

మ‌హేష్ – రాజ‌మౌళి.. ముందే ‘రుచి’ చూపిస్తారా?

మ‌హేష్ బాబు సినిమా కోసం రాజ‌మౌళి ఎడ‌తెర‌పి లేకుండా క‌ష్ట‌ప‌డుతున్నారు. స్క్రిప్టు ప‌నులు దాదాపుగా కొలిక్కి వ‌చ్చేశాయి. డైలాగ్ వెర్ష‌న్ బాకీ ఉంది. అది కూడా అయిపోతే... ముహూర్తం ఫిక్స్ చేసుకోవొచ్చు. ఏ...

దేశాన్ని బీజేపీ అధోగతి పాలు చేస్తోందా… వాస్తవాలు ఎలా ఉన్నాయంటే..?

విశ్వగురువుగా భారత్ అవతరిస్తోందని బీజేపీ అధినాయకత్వం గొప్పగా ప్రచారం చేసుకుంటున్నా వాస్తవాలు మాత్రం అందుకు విరుద్దంగా ఉన్నాయి. అభివృద్ధి సంగతి అటుంచితే ఆహార భద్రత విషయంలో బీజేపీ సర్కార్ వైఫల్యం చెందింది. నిరుద్యోగాన్ని...

కేసీఆర్ ఇంటి పక్కన క్షుద్రపూజలు.. అందుకే టార్గెట్ చేశారా..?

బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ ఇంటి పక్కన క్షుద్రపూజలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. నందినగర్ లో కేసీఆర్ ఇంటి పక్కన ఖాళీ స్థలం ఉండటంతో అక్కడ గుర్తు తెలియని వ్యక్తులు క్షుద్రపూజలు చేసినట్లుగా...

వైసీపీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులుకు శిక్ష ప‌డ్డ‌ ఈ శిరోముండ‌నం కేసు ఏంటీ?

వైసీపీ ఎమ్మెల్సీ, ప్ర‌స్తుత మండ‌పేట తోట త్రిమూర్తులుకు శిక్ష ప‌డ్డ శిరోముండ‌నం కేసు ఏపీలో సంచ‌ల‌నంగా మారింది. 28 సంవ‌త్స‌రాల త‌ర్వాత తీర్పు వెలువ‌డ‌గా... అసలు ఆరోజు ఏం జ‌రిగింది? ఎందుకు ఇంత...

HOT NEWS

css.php
[X] Close
[X] Close