కేసీఆర్ ఫామ్‌హౌస్‌పై అక్బరుద్దీన్, ఎర్రబెల్లి సెటైర్‌లు

హైదరాబాద్: ఇవాళ ప్రారంభమైన తెలంగాణ అసెంబ్లీ సమావేశాలలో రైతు ఆత్మహత్యలపై ప్రధానంగా చర్చ జరిగింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌కు మెదక్ జిల్లా ఎర్రవల్లిలో ఉన్న ఫామ్‌హౌస్ పలుసార్లు ప్రస్తావనకొచ్చింది. రైతు ఆత్మహత్యలపై కేసీఆర్ ప్రకటన, వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి మాట్లాడిన తర్వాత టీడీడీపీ నేత ఎర్రబెల్లి దయాకరరావు ప్రసంగించారు. ఈ ఉదయం ఎడ్లబండిపై అసెంబ్లీకి వచ్చిన ఎర్రబెల్లి, లాభసాటి కాని సాగువల్లే రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని అన్నారు. నీరున్న సమయంలో ప్రభుత్వం కరెంట్ ఇవ్వటంలేదని, రైతన్న పండించిన పంటకు గిట్టుబాటుధర కల్పించటంలేదని చెప్పారు. ముఖ్యమంత్రి తన ఫామ్‌హౌస్‌లో ఎకరాకు కోటి రూపాయలు రాబడి సాధిస్తున్నట్లు గతంలో చెప్పిన విషయాన్ని గుర్తుచేస్తూ, తమ ఎమ్మెల్యేలను ఫామ్‌హౌస్‌కు తీసుకెళితే తామూ ఆ వ్యవసాయం నేర్చుకుంటామని అన్నారు. అంతేకాక ఇక్కడే ఎకరాకు కోటిరూపాయలు వస్తుంటే అధ్యయనం కోసం చైనాకు, ఇజ్రాయెల్‌కు వెళ్ళటమెందుకని అన్నారు. ముఖ్యమంత్రి అంత రాబడి సాధించటంపై తమకూ సంతోషమని చెప్పారు. కేసీఆర్ ఆదర్శ రైతు అన్నారు. ఆయన ఇవన్నీ అయిపోయిన తర్వాత ఫామ్‌హౌస్‌కు వెళ్ళి విశ్రాంతి తీసుకుంటారని చెప్పారు. ఎర్రబెల్లి ఈ వ్యాఖ్యలు చేస్తున్నపుడు కేసీఆర్ ముసిముసి నవ్వులు నవ్వుకుంటూ కనిపించారు.

మరోవైపు మజ్లిస్ పార్టీ నేత అక్బరుద్దీన్ ఓవైసీ మాట్లాడుతూ, రాష్ట్రంలోనేకాక సొంత నియోజకవర్గంలోనూ రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రం తన ఫామ్‌హౌస్‌లో చక్కగా టోపీ పెట్టుకుని తిరుగుతున్నారని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. దేశంలోనే రెండో ధనిక రాష్ట్రమైన తెలంగాణలో రైతులంతా కేసీఆర్‌లాగానే టోపీలు పెట్టుకుని తిరగాలని తాము కోరుకుంటున్నామని అన్నారు. కేసీఆర్ ఫామ్‌హౌస్‌లాగా రాష్ట్రమంతా సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షిస్తున్నానని ప్రభుత్వానికి చురకలంటించారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ట్రబుల్ షూటర్… ట్రబుల్ మేకర్ అవుతున్నారా?

14... ఇది లోక్ సభ ఎన్నికల్లో సీఎం రేవంత్ రెడ్డి టార్గెట్. అందుకు తగ్గట్టుగానే ప్రచారం చేపడుతున్నారు. అభ్యర్థుల గెలుపు బాధ్యతను తనే తీసుకొని రాష్ట్రవ్యాప్తంగా సుడిగాలి పర్యటన చేస్తున్నారు.ఇప్పటికే పలు నియోజకవర్గాల్లో...

కేసీఆర్‌కు సమాచారం ఇచ్చింది చెవిరెడ్డేనా ?

తెలంగాణలో 8 నుంచి 12 లోక్ సభ స్థానాల్లో బీఆర్ఎస్ గెలుస్తుదంటూ కేసీఆర్ చేసిన ప్రిడిక్షన్ వైరల్ అవుతోంది. అదే సమయంలో ఏపీలో జగన్ గెలుస్తారని తనకు సమాచారం వచ్చిందని కూడా ఓ...

ఫ‌హ‌ద్ ఫాజిల్‌పై ‘పుష్ష‌’ ఆశ‌లు

ఆగ‌స్టు 15న 'పుష్ష 2' రిలీజ్‌కి రెడీ అయ్యింది. ఈ డేట్ కి ఎప్ప‌టి ప‌రిస్థితుల్లోనూ 'పుష్ష 2' రిలీజ్ చేయాల‌ని టీమ్ మొత్తం అహ‌ర్నిశ‌లూ కృషి చేస్తోంది. ఈ సినిమా విడుద‌ల‌పై...

దెందులూరు రివ్యూ : లండన్ బాబు వర్సెస్ లోకల్ మాస్ లీడర్

చింతమనేని ప్రభాకర్. తనదైన రాజకీయం చేయడంలో ప్రత్యేకత చూపించారు. మాస్ లీడర్ గా ఎదిగారు. ఆయన గత ఎన్నికల్లో ఓడిపోతారని ఎవరూ అనుకోలేదు.కానీ ఓడిపపోయారు. లండన్ లో ఉండే అబ్బయ్య చౌదరి...

HOT NEWS

css.php
[X] Close
[X] Close