అనసూయ ఆవేశంతో “ఆంటీ” ట్రెండింగ్ !

ఓ పాతికేళ్లు దాటిన యువకుడినైనా.. యువతినైనా ఎవరైనా అంటీ లేదా అంకుల్ అని పిలిస్తే మనసు చివుక్కుమంటుంది. అలా పిలిచిన వాళ్లపై కోపగించుకోవడమో.. మరోసారి ఎదురు పడకపోవడమో చేస్తారు. అంతే కానీ గెలికి గెలికి.. అందరి చేత ఆ మాట అనిపించుకోరు. కానీ జబర్దస్త్ నుంచి బయటకు వచ్చేసిన అనసూయ ఖాళీగా ఉందేమో కానీ రోజంతా ట్విట్టర్‌లో ఆంటీ పేరుతో రచ్చ పెట్టేసుకున్నారు. ఎవరో ఆంటీ అన్నారని.. అది తనను.. ఏజ్ షేమింగ్ చేయడమేనని కేసులు పెట్టి అందర్నీ జైల్లో పెట్టిస్తానని హెచ్చరించారు.

ఆమె అలా రియాక్ట్ అయ్యే సరికి.. ఒక్క సారిగా ట్విట్టర్‌లో అనసూయ ఫ్యాన్స్ రెచ్చిపోయారు. ఒక్కొక్కరుగా ఆంటీ అంటూ ట్వీట్లు చేయడం ప్రారంభించారు. అసభ్యకరంగా ఉన్నా సరే వారందరిపై పోలీసులకు కంప్లైంట్లు చేస్తానని.. ఆ ట్వీట్లను తాను షేర్ చేసుకుని సమాధానాలిచ్చింది. ఆన్ లైన్ వేధింపులు వద్దని హ్యాష్ ట్యాగ్ కూడా పెట్టుకుంది. ఆమె ఇలా సమాధానం ఇచ్చే కొద్దీ దారుణంగా మాట్లాడేవారు ఎక్కువైపోయారు. చివరి వరకూ ఆమె అలా చేస్తూనే ఉంది.

కొంత మంది సినీ ప్రముఖులు ఎందుకు ఇలా ట్విట్టర్‌లో పరువుతీసుకుంటున్నావని మందలిస్తే.. అప్పుడుామె విరమించుకుంటున్నట్లుగా చెప్పారు. కానీ ఆ తర్వాత కూడా అవే ట్వీట్లు పెట్టారు. ఆమె దెబ్బకు ఆంటీ అనే హ్యాష్ ట్యాగ్ టాప్ త్రీలోకి ట్రెండింగ్లోకి వచ్చింది. ప్రతీ ఒక్కరూ జోకులేయడమే. నిజానికి ఆంటీ అంటే.. కేసులు పెట్టేలా ఏ చట్టమూ లేదు. కానీ అలా పిలిస్తే తాను డిప్రెషన్‌కు గురవుతానని.. అది కేసులు పెట్టగలికే కేసని అంటోంది. ఆమె తీరుతో ఆశ్చర్యరపోవడం.. రెచ్చగొట్టేలా వ్యవహారించడం నెటిజన్ల వంతయింది.

సోషల్ మీడియాలో సెలబ్రిటీలు ఎవరూ రెస్పాండ్ కారు. అలా రెస్పాండ్ అయితే పరిస్థితి దారుణంగా ఉంటుంది. ఆ విషయం అనసూయకు తెలియనిదేం కాదు. కానీ రోజంతా ఇలా రచ్చ చేసుకుని..అందరూ దూషించారని కన్నీళ్లు పెట్టుకుంటే ప్రయోజనం ఏముంటుంది ?

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో నాని

రాజ‌మౌళి - నాని కాంబోలో 'ఈగ' వ‌చ్చింది. అది సూప‌ర్ హిట్ అయ్యింది. మ‌ళ్లీ ఈ కాంబో కోసం ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు ప్రేక్ష‌కులు 'ఈగ 2' ఆలోచ‌న రాజ‌మౌళికి ఉంది. కానీ...

కేసీఆర్ పై ఈసీ బ్యాన్

మాజీ సీఎం కేసీఆర్ ను ప్రచారం చెయ్యకుండా ఎన్నికల కమిషన్ నిషేధించింది. ఈరోజు రాత్రి8 గంటల నుండి రెండు రోజుల పాటు అంటే 48గంటల పాటు ఈ నిషేధం అమల్లో ఉంటుంది అని...

టీడీపీ మేనిఫెస్టోకి మరిన్ని కలిపి ఆకర్షణీయంగా ప్రచారం చేస్తున్న జగన్

టీడీపీ వాళ్లు సూపర్ సిక్స్ పథకాలపై చాలా కాలంగా ప్రచారం చేసుకుంటున్నారు. ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. వారి మేనిఫెస్టోను వారు ప్రచారం చేసుకుంటున్నారు. అయితే వారితో పాటు జగన్ కూడా ప్రచారం చేస్తున్నారు. ...

పాన్ ఇండియా ‘సుడిగాడు’

అల్లరి నరేష్ కెరీర్ లో హిట్ సినిమా 'సుడిగాడు'. స్పూఫ్ లకు పరాకాష్టగా వచ్చిన ఆ సినిమా బాగానే నవ్వించింది. తర్వాత నరేష్ కి వరుస పరాజయాలు వచ్చాయి. ఏ సినిమా చేసిన...

HOT NEWS

css.php
[X] Close
[X] Close