పదకొండో సీటు లాక్కుంటున్న బీజేపీ !

ఆంధ్రప్రదేశ్‌లో పొత్తుల వ్యవహారం గుడారంలో అరబ్బు – ఒంటె కథలా మారుతోంది. చలికి చస్తుందని ఒంటె తన ముక్కుని గుడారంలో పెట్టుకునేందుకు చాన్సిస్తే.. మొత్తం అరబ్బును గెంటేసి.. గుడారాన్ని ఆక్రమించుకున్న ఒంటె చందంగా బీజేపీ వ్యవహరిస్తోంది. నోటాకు దాటని ఓట్ల శాతమే కాదు.. గట్టిగా పోటీ చేసి డిపాడిట్ కూడా తెచ్చుకునే గట్టి లీడల్లు కూడా లేని బీజేపీ ఏకంగా ఆరు ఎంపీ, పది అసెంబ్లీ సీట్లు తీసుకుంది. టీడీపీ, జనసేన భుజాలపై మోసుకుని పోయి తమను గెలిపిస్తాయని అనుకుంటున్నారు. ఆ రెండు పార్టీలు అదే చేయాలనుకుంటున్నాయి. కానీ బీజేపీ సంతృప్తి పడటం లేదు. తమకు మరో సీటు కావాలని అంటోంది.

బీజేపీ ఎన్నికల ఇంచార్జ్ అరుణ్ సింగ్ నేతృత్వంలో విజయవాడలో పదాధికారుల సమావేశం జరిగింది. ఇందులో బీజేపీ పదకొండు ఎమ్మెల్యే సీట్లలో పోటీ చేస్తుందని ఆయన చెప్పారు. ఆ పదకొండో సీటు ఏమిటన్నది స్పష్టత రాలేదు . టీడీపీ నుంచో.. బీజేపీ నుంచో లాక్కోవడం ఖాయంగా కనిపిస్తోంది. ఇప్పటికే ఆ పార్టీకి అభ్యర్థులు లేరు. అయితే బయట నుంచి తెచ్చుకోవడమో…లేకపోతే ఆర్థిక స్తోమత చూసి ఇవ్వడమో చేయాల్సి వస్తోంది. అయినా పదకొండో సీటు అంటూ.. రంగంలోకి దిగడంతో టీడీపీ, జనసేన నేతుల నివ్వెర పోతున్నారు.

రాజంపేట లేదా తంబళ్లపల్లె నియోజకవర్గాల్లో ఒక దాన్ని కేటాయించాలన్న డిమాండ్ చేస్తున్నట్లుగా చెబుతున్నారు. అయితే్ టీడీపీ స్పందన ఎలా ఉందో మాత్రం తెలియడం లేదు. జనసేన పార్టీ ఇంకా మూడు స్థానాలకు అభ్యర్థుల్ని ప్రకటించాల్సి ఉంది. ఇప్పటికే పొత్తుల వ్యవహారం, రఘురామరాజుకు నర్సాపురం సీటు కేటాయించకపోవడం వంటి అంశాలతో ఇరు పార్టీల క్యాడర్ అసహనంతో ఉన్నారు. ఇప్పుడు బీజేపీ పదకొండో సీటు కూడా తీసుకుంటే… పొత్తుల అపహాస్యం అయ్యే అవకాశం ఉంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఈ ప్ర‌శ్న‌కు బ‌దులేది జ‌క్క‌న్నా..?!

RRR.... ఇండియ‌న్ ఫిల్మ్ ఇండ‌స్ట్రీలోనే ఓ చ‌రిత్ర‌. వ‌సూళ్ల ప‌రంగా, రికార్డుల ప‌రంగా, అవార్డుల ప‌రంగానూ... ఈ సినిమాకు తిరుగులేదు. మ‌ల్టీస్టార‌ర్ స్టామినా పూర్తి స్థాయిలో చాటి చెప్పిన సినిమా ఇది. తెలుగు...

నో హోప్స్ : డబ్బుల పంపకంపై జగన్ సిగ్నల్ ఇచ్చారా ?

చంద్రబాబులా నా దగ్గర డబ్బల్లేవు.. చంద్రబాబు డబ్బులిస్తే తీసుకుని నాకే ఓటేయండి అని జగన్ రెడ్డి ఎన్నికల ప్రచారసభల్లో తన ప్రచార స్పీచ్‌లలో కొత్తగా చెబుతున్నారు. జగన్ దగ్గర డబ్బుల్లేవా అని వైసీపీ...

కాంగ్రెస్‌లో మల్లారెడ్డి కోవర్టులా .. అసలు కాంగ్రెస్ కోవర్టే మల్లారెడ్డినా ?

మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి కాంగ్రెస్ పార్టీలో తన కోవర్టులున్నారని ప్రకటించుకున్నారు. ఎవరయ్యా వాళ్లు అంటే.. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే కాంగ్రెస్ లోకి జంప్ అయిన వాళ్లు. వాళ్లందర్నీ తానే కాంగ్రెస్ లోకి పంపానని...

ఈసీ ఆదేశించకుండానే షర్మిలపై కేసులు కూడా !

ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత ఎన్నికలకు సంబంధించిన ప్రకటనలు.. వ్యవహారాలు అన్నీ ఈసీ పరిధిలోకి వస్తాయి. కోడ్ ఉల్లంఘిస్తే.. చర్యలు ఈసీ తీసుకోవాలి. కానీ ఏపీలో రాజ్యాంగం వేరుగా ఉంటుంది. ఎన్నికల...

HOT NEWS

css.php
[X] Close
[X] Close