ఢిల్లీలో ఏపీ బీజేపీ పంచాయతీ !

ఆంధ్రప్రదేశ్ బీజేపీ ముఖ్య నేతలు దాదాపుగా 30 మంది ఢిల్లీలో ఏపీ వ్యవహారాల ఇంచార్జ్ మురళీధరన్‌తో సమావేశం అయ్యారు. పార్టీలో పరిస్థితులు.. సోము వీర్రాజు, జీవీఎల్ చేస్తున్న నిర్వాకాలపై పూర్తి స్థాయి నివేదిక అందించారు. తక్షణం సోము వీర్రాజను తప్పించాలని.. జీవీఎల్‌ను ఏపీ రాజకీయాల్లో జోక్యం చేసుకోకుండా చూడాలని వారు మురళీధరన్‌కు తేల్చి చెప్పినట్లుగా తెలుస్తోంది. ఈ నేతలంతా కొద్ది రోజుల కిందటే విజయవాడలో సమావేశం అవ్వాలనుకున్నారు. కానీ అలా సమావేశం అయితే మొదటికే మోసం వస్తుందని.. కావాలంటే అందరూ ఢిల్లీకి వచ్చి చెప్పుకోవాలని హైకమాండ్ సమాచారం పంపింది.

హైకమాండ్ సూచనలతో ఢిల్లీకి వెళ్లిన ఏపీ బీజేపీ ముఖ్య నేతలు.. తాము చెప్పాలనుకున్నదంతా చెప్పారు. ఇప్పటికే పలువురు నేతలు బీజేపీని వదిలి టీడీపీ వైపు చూస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది. కన్నా లక్ష్మినారాయణ పార్టీలో చేరిపోయారు. ఆయన వర్గం అంతా టీడీపీలోకి వెళ్లడం ఖాయమే. ఇక ఆయనతో సంబంధం లేకుండా.. బీజేపీ రాష్ట్ర నాయకత్వంపై అసహనంతో.. వచ్చేది టీడీపీనేనన్న నమ్మకంతో మరికొంత మంది తెలుగుదేశం వైపు చూస్తున్నారు. కొంత మంది నేతలు ఇప్పటికే చర్చలు జరిపారని కూడా చెబుతున్నారు.

పార్టీలో ఇప్పుడు సోము వీర్రాజు.. జీవీఎల్ నరసింహారావు తప్పితే ఎవరూ తెర మీద కనిపించడం లేదు. వారిద్దరూ వైసీపీ కోవర్టులుగా బీజేపీని మరింతగా దిగజారుస్తున్నారని క్యాడర్ మొదటి నుంచి ఆందోళనలో ఉంది. ఇప్పుడు హైకమాండ్ ఏపీ బీజేపీ నేతలకు ఎలాంటి అభయం ఇచ్చి పంపిస్తుందనేది కీలకం. పట్టించుకోకపోతే.. ఏపీ బీజేపీలోచాలా మంది టీడీపీలోచేరిపోయే అవకాశాలు ఉన్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో నాని

రాజ‌మౌళి - నాని కాంబోలో 'ఈగ' వ‌చ్చింది. అది సూప‌ర్ హిట్ అయ్యింది. మ‌ళ్లీ ఈ కాంబో కోసం ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు ప్రేక్ష‌కులు 'ఈగ 2' ఆలోచ‌న రాజ‌మౌళికి ఉంది. కానీ...

కేసీఆర్ పై ఈసీ బ్యాన్

మాజీ సీఎం కేసీఆర్ ను ప్రచారం చెయ్యకుండా ఎన్నికల కమిషన్ నిషేధించింది. ఈరోజు రాత్రి8 గంటల నుండి రెండు రోజుల పాటు అంటే 48గంటల పాటు ఈ నిషేధం అమల్లో ఉంటుంది అని...

టీడీపీ మేనిఫెస్టోకి మరిన్ని కలిపి ఆకర్షణీయంగా ప్రచారం చేస్తున్న జగన్

టీడీపీ వాళ్లు సూపర్ సిక్స్ పథకాలపై చాలా కాలంగా ప్రచారం చేసుకుంటున్నారు. ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. వారి మేనిఫెస్టోను వారు ప్రచారం చేసుకుంటున్నారు. అయితే వారితో పాటు జగన్ కూడా ప్రచారం చేస్తున్నారు. ...

పాన్ ఇండియా ‘సుడిగాడు’

అల్లరి నరేష్ కెరీర్ లో హిట్ సినిమా 'సుడిగాడు'. స్పూఫ్ లకు పరాకాష్టగా వచ్చిన ఆ సినిమా బాగానే నవ్వించింది. తర్వాత నరేష్ కి వరుస పరాజయాలు వచ్చాయి. ఏ సినిమా చేసిన...

HOT NEWS

css.php
[X] Close
[X] Close