కరెంట్ నష్టాలను మీరే భరించండి..! కేంద్రానికి రివర్స్‌లో ఏపీ ఘాటు లేఖ..!

ఆంధ్రప్రదేశ్ పవర్ పర్చేజింగ్ అగ్రిమెంట్ల సమీక్ష విషయంలో జగన్మోహన్ రెడ్డి నిర్ణయాలను కేంద్రం పదే పదే తప్పు పడుతూండటంతో ఏపీ సర్కార్ ఎదురుదాడి ప్రారంభించింది. పీపీఏల వల్ల తమ రాష్ట్రానికి ఏటా రూ. ఐదు వేల కోట్ల నష్టం జరుగుతోందని… కేంద్రం కొంత మేర భరించాలంటూ… నేరుగా కేంద్ర విద్యుత్ మంత్రి ఆర్కేసింగ్‌కు ఏపీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి లేఖ రాశారు. సోలార్‌ విద్యుత్‌ కొనుగోలు వల్ల ఏపీకి తీవ్ర నష్టం జరుగుతోందని లేఖలో బాలినేని పేర్కొన్నారు. సోలార్‌, విండ్‌ పవర్‌ కారణంగా ఏటా రూ.5వేల కోట్ల భారం పడుతోందని… గత నాలుగేళ్లుగా పరిమితికి మించి సోలార్‌, విండ్‌ పవర్‌ కొంటున్నామని లేఖలో పేర్కొన్నారు. సోలార్‌, విండ్‌ పవర్‌కి కేంద్రం సబ్సిడీలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. విద్యుత్‌రంగంలో సంక్షోభాన్ని అధిగమించేందుకు చర్చలు జరుపుతున్నామని.. విద్యుత్‌రంగంలో సంక్షోభానికి పరిష్కారం కోసం కేంద్రం కమిటీ వేయాలని బాలినేని లేఖలో కోరారు.

గత సర్కార్ హయాంలో జరిగిన పవర్ పర్చేజింగ్ అగ్రిమెంట్లను ఎట్టి పరిస్థితుల్లోనూ క్యాన్సిల్ చేయాలన్న ఉద్దేశంలో ఉన్న ఏపీ సర్కార్ ను.. కేంద్రం పదే పదే హెచ్చరించింది. ఆ నిర్ణయాల వల్ల దేశంలో పెట్టుబడుల వాతావరణంపై ప్రభావం పడుతోందని… హెచ్చరించింది. అయినప్పటికీ.. జగన్మోహన్ రెడ్డి లెక్క చేయలేదు. చాలా వరకు రద్దు చేశారు. ఆయా కంపెనీలు కోర్టుకెళ్లడంలో వెనక్కి తగ్గక తప్పలేదు. అయితే ఇప్పుడు… ఈఆర్సీ ద్వారా ఆ ఒప్పందాలను రద్దు చేసే ప్రయత్నం చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే కొన్ని కంపెనీల విద్యుత్ కనెక్షన్లను తొలగించారు. ఈ విషయాలపై కేంద్ర విద్యుత్ మంత్రి ఆర్కేసింగ్ పలుమార్లు లేఖలు రాశారు. ఒప్పందాలను కచ్చితంగా పాటించాల్సిందేనని స్పష్టమైన హెచ్చరికలు ఎప్పటికప్పుడు చేస్తూ వస్తున్నారు.

సౌర, పవన విద్యుత్ ను… ప్రభుత్వం కొనుగోలు చేయడం నిలిపివేయడంతో ఏపీ సర్కార్ విద్యుత్ సంక్షోభంలో పడింది. అదనపు విద్యుత్ కోసం.. యూనిట్ కు రూ. పన్నెండు చెల్లించి కొనుగోలు చేస్తున్నారు. రూ. నాలుగుకు వచ్చే సౌర, పవన విద్యుత్ కొనుగోలు నిలిపివేసి.. అత్యధిక రేటు పెట్టి కొనుగోలు చేయడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. అయితే.. ఇలా కొనడానికి కూడా చంద్రబాబే కారణమని విమర్శలు చేస్తూ.. తమకు వచ్చే నష్టాలను కేంద్రం భరించాలంటూ.. ఏకంగా లేఖ రాసేశారు. ఏపీ సర్కార్ తీరుపై కేంద్ర ప్రభుత్వంలోనూ విస్మయం వ్యక్తమవుతోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

పేర్ని నాని – ఇంకా వైసీపీ ఓడిపోలేదుగా !?

మాచర్లలో ఎంతో మంది హత్యకు గురి కావడానికి... మరెన్నో హత్యా ప్రయత్నాల వెనుక ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు ఉన్నారని రాష్ట్రమంతా గగ్గోలు పెడుతూంటే వైసీపీ కొత్త సిద్దాంతంతో తెరపైకి...

ఫ్లాష్ బ్యాక్‌: వేసేది దేవుడి వేషం.. నోట్లో సిగ‌రెట్!

పాత్ర కోసం ప్రాణాలిచ్చేస్తాం అని కొంత‌మంది చెబుతుంటారు. అది మ‌రీ అతిశ‌యోక్తి కానీ, కొన్ని పాత్ర‌లు చేసేట‌ప్పుడు నిష్ట‌గా నియ‌మంగా ఉండ‌డం మాత్రం స‌ర్వ సాధార‌ణంగా క‌నిపించే వ్య‌వ‌హార‌మే. ముఖ్యంగా దేవుడి పాత్ర‌లు...

బెయిల్ షరతులు ఉల్లంఘించిన పిన్నెల్లి

మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి బెయిల్ షరతులు మొదట్లోనే ఉల్లంఘించారు. ఆరో తేదీ వరకూ ఆయన నర్సరావుపేటలో మాత్రమే ఉండాలని హైకోర్టు స్పష్టం చేసింది . అయితే ఆయన నర్సరావుపేటకు చేరుకున్నట్లు కానీ...

జవహర్ రెడ్డి చక్కబెడుతున్న భూములెన్ని !?

సీఎస్ జవహర్ రెడ్డి వ్యవహారం ఏపీలో ఎన్నో సంచలనాలకు కారణం అవుతోంది . కొత్త ప్రభుత్వం ఏర్పడిన కొద్ది రోజుల్లోనే ఆయన రిటైర్ కాబోతున్నారు. ఈ లోపు ఆయన వ్యవహారాలు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close