పంచాయతీ ఎన్నికల ప్రక్రియ ఆపడం సాధ్యం కాదన్న హైకోర్టు..!

స్టేట్ ఎన్నికల కమిషనర్ నిర్ణయాలపై స్టే విధించాలంటూ.. హైకోర్టుకు వెళ్లిన ఏపీ సర్కార్‌కు ఎదురు దెబ్బ తగిలింది. ఎన్నికల ప్రక్రియను ప్రస్తుత పరిస్థితుల్లో నిలుపుదల చేయలేమని హైకోర్టు తేల్చి చెప్పింది. ఫిబ్రవరిలో ఎన్నికలు నిర్వహిస్తామని ఎస్ఈసీ రమేష్ కుమార్ ప్రభుత్వానికి తెలిపారు. ఏర్పాట్లు చేయాలని.. సహకరించాలని కోరుతున్నారు. అయితే.. కరోనా కారణంగా ఇప్పుడల్లా ఎన్నికలు నిర్వహించలేమంటున్న ప్రభుత్వం… ఎస్ఈసీకి సహకరించడం లేదు. సమీక్షలు కూడా చేయనివ్వడం లేదు. ఇలా చేయడం రాజ్యాంగ విరుద్ధమన్న విమర్శలు రావడంతో… హైకోర్టు ద్వారానే ఆపించాలన్న ప్రయత్నం చేసింది. ఈ మేరకు ఏపీలోని కరోనా పరిస్థితుల్ని వివరిస్తూ.. పిటిషన్లు దాఖలు చేశారు.

ఎన్నికలు నిర్వహణ కోసం ఎస్ఈసీ ఇచ్చిన ఆదేశాలపై స్టే ఇవ్వాలన్నారు. వీటిపై విచారణ జరిపిన హైకోర్టు.. స్టే ఇవ్వడం సాధ్యం కాదని తేల్చేసింది. అయితే.. కౌంటర్ దాఖలు చేయాల్సిందిగా ఎన్నికల కమిషనర్‌ను ఆదేసించింది. తదుపరి విచారణ ఈనెల 14కు వాయిదా వేసింది. ప్రభుత్వం సహకరించడం లేదని నిమ్మగడ్డ రమేష్ కుమార్ హైకోర్టులో పిటిషన్ వేయనున్నారని కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతోంది. అదే సమయంలో ప్రభుత్వం కూడా.. ఎన్నికలు నిర్వహించకుండా ఉండేందుకు నేరుగా అసెంబ్లీలోనే తీర్మానం చేశారు. దాని ఆధారంగా ఆర్డినెన్స్ జారీ చేసే యోచనలో ఉన్నారు.

ఇలా చేయడమూ… ఎస్ఈసీ విధుల్లో జోక్యం చేసుకోవడమేనన్న అభిప్రాయాల ఉండటంతో ప్రభుత్వం తదుపరి ఏం చేస్తుందన్నదానిపై ఉత్కంఠ ఏర్పడింది. ఎస్ఈసీ మాత్రం… ఫిబ్రవరిలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించి తీరుతామంటున్నారు. ప్రభుత్ం మాత్రం సహకరించడానికి సిద్ధం లేదు. ఈ క్రమంలో రాను రాను ఏపీలో స్థానిక ఎన్నికల విషయంలో కీలకమైన పరిణామాలు చోటు చేసుకునే అవకాశం కనిపిస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కండోమ్స్ ఎక్కువగా వాడేది వారేనా..మోడీకి కౌంటర్

లోక్ సభ ఎన్నికల్లో ప్రధాని మోడీ ప్రసంగం ఆశ్చర్యపరుస్తోంది. గతానికి భిన్నంగా మాట్లాడుతుండటమే ఇందుకు కారణం.గాంధీ కుటుంబంపై మాత్రమే విమర్శలు చేసే మోడీ గత కొద్ది రోజులుగా రూట్ మార్చారు. కాంగ్రెస్ అకారంలోకి...

ఔను..బీజేపీతో ఒప్పందం ఉందంటోన్న కేటీఆర్..!?

బీజేపీ - బీఆర్ఎస్ మధ్య లోపాయికారి ఒప్పందం ఉందని కాంగ్రెస్ ఆరోపిస్తోన్న వేళ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. తాము బీజేపీతో కలిసే ఉన్నామనే పరోక్షంగా...

గాజు గ్లాస్ జనసేనకు మాత్రమే !

వైసీపీ నేతల ఆశలన్నీ అడియాశలయ్యాయి. ఇండిపెండెంట్లుగా తమ వారిని నిలబెట్టి వారికి గాజు గ్లాస్ గుర్తు ఇప్పించుకోవాలని చేసిన ప్రయత్నాలన్నీ ఫెయిలయ్యాయి. గాజుగ్లాస్ గుర్తును జనసేన పార్టీకి రిజర్వ్ చేస్తూ...

ఓటేస్తున్నారా ? : ల్యాండ్ టైటింగ్ యాక్ట్ గురించి తెలుసుకోండి !

ఆంధ్రప్రదేశ్ లో లోక్‌సభతో పాటు అసెంబ్లీకి ఎన్నికలు జరుగుతున్నాయి. ఢిల్లీలో ఎవరు ఉన్నా రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ప్రజల బతుకుల్ని ప్రభావితం చేస్తుంది. గతంలో ఏ ప్రభుత్వం ఉన్నా ఏముందిలే...

HOT NEWS

css.php
[X] Close
[X] Close