రాజీనామాల సవాల్‌కు మరింత పదును పెట్టిన అచ్చెన్న..!

రాజధాని విషయంలో ఆంధ్రప్రదేశ్ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు.. అధికార పార్టీని కార్నర్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. గతంలో చంద్రబాబు ప్రజాభిప్రాయసేకరణ కోసం ఎన్నికలకు వెళ్లాలని సవాల్ చేశారు. అయితే.. వైసీపీ ఉత్తరాంధ్ర నేతలు.. భిన్నమైన ప్రచారం చేస్తున్నారు. రాజీనామాలు చేయాలని సవాళ్లు చేస్తున్నారు. ఈ క్రమంలో విశాఖ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి ఎంపీ సహా అందరం రాజీనామా చేసి.. తేల్చుకుందామని అయ్యన్నపాత్రుడు సవాల్ చేశారు. దానికి వైసీపీ నేతలు సైలెంటయ్యారు. కొద్ది రోజుల కిందట.. మంత్రి అప్పలరాజు కూడా తన స్థానం నుంచి రాజీనామా చేస్తానని రాజధాని ఎజెండాగా తనపై పోటీచేయాలని టీడీపీ నేతలకు సవాల్ చేశారు.

తర్వాత టీడీపీ నేతలే రాజీనామా చేయాలని మాట మార్చారు. ఈ క్రమంలో అచ్చెన్నాయుడు.. ఉత్తరాంధ్ర విషయంలో కీలకమైన సవాల్‌ను వైసీపీ నేతల ముందు ఉంచారు. ఏపీ టీడీపీ అధ్యక్షుడుగా బాధ్యతలు చేపట్టనున్నసమయంలో… టీవీచానళ్లతో మాట్లాడుతున్న ఆయన రాజధాని విషయంలో చాలా స్పష్టమైన వైఖరితో ఉన్నారు. వైసీపీకి ధీటుగా సమాధానం చెబుతున్నారు. తనతో సహా ఉత్తరాంధ్ర ప్రజాప్రతినిధులందరం రాజీనామా చేద్దామని… రాజధాని ఎజెండాగా ఎన్నికలకు వెళ్ధామని.. ప్రజాభిప్రాయం ఏమిటో తెలిసిపోతుందని సవాల్ చేస్తున్నారు.

రాజధాని పేరుతో ఉత్తరాంధ్రలో పెద్ద ఎత్తున సెంటిమెంట్ ఏర్పడిందని వైసీపీ నేతలు భావిస్తున్నారు. కానీ టీడీపీ నేతలు మాత్రం… ప్రజల్ని భయపెట్టి నోరు తెరవకుండా చేస్తున్నారని.. వైసీపీ నేతలు చేస్తున్న దందాల కోసమే రాజధాని పేరుతో హడావుడి చేస్తున్నారని అంటున్నారు. వైసీపీ నేతలు.. తరచూ ఎన్నికల ప్రస్తావన తెస్తూండటంతో.. టీడీపీ దాన్ని మరింత విస్తృతం చేస్తోంది. రాజీనామాలకు భయపడుతోంది వైసీపీ నేతలేనన్న అభిప్రాయం కల్పించేందుకు ప్రయత్నిస్తోంది. ఈ విషయంలో అచ్చెన్న మరింత దూకుడుగా వ్యవహరిస్తున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

సికింద్రాబాద్ లో ఎవరిదీ పైచేయి..?

సికింద్రాబాద్ లోక్ సభ సెగ్మెంట్ లెక్కలు మారుతున్నాయా..? సికింద్రాబాద్ సిట్టింగ్ ఎంపీ కిషన్ రెడ్డికి ఝలక్ తప్పదా..? కేసీఆర్ చెప్పినట్టుగానే సికింద్రాబాద్ లో బీఆర్ఎస్ అభ్యర్థి పద్మారావు ముందంజలో ఉన్నారా..? బలమైన అభ్యర్థిగా...

ఏపీకి ప్రధాని మోడీ…షెడ్యూల్ ఇదే

ప్రధాని మోడీ ఏపీ ఎన్నికల పర్యటన ఖరారు అయింది.మే 3, 4తేదీలలో మోడీ ఏపీలో పర్యటించనున్నారు. 3న పీలేరు, విజయవాడలో పర్యటించనున్నారు. 4న రాజమండ్రి, అనకాపల్లిలో ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు మోడీ. 3న...

నాలుగైదు సినిమాలకు అడ్వాన్సులు – గెలిచినా పవన్ బిజీనే !

పవన్ కల్యాణ్ ఎన్నికల తర్వాత కూడా తీరిక లేకుండా ఉంటారు. అయితే రాజకీయాలతో కాదు. సినిమాలతో. పవన్ కల్యాణ్ పిఠాపురంలో నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా తన ఆస్తులు,...

మేనిఫెస్టో మోసాలు : చేసింది జలయజ్ఞం కాదు జలభగ్నం !

వైఎస్ఆర్ జలయజ్ఞం.. వైఎస్ఆర్ కలలు కన్నారు. ఆ యజ్ఞాన్ని పూర్తి చేస్తాం. పోలవరం, వెలిగొండ యుద్ధప్రాతిపదికన పూర్తి చేస్తాం. రక్షిత మంచినీరు, సాగునీరు కల నిజం చేస్తాం. చెరువులను పునరుద్ధరిస్తాం .. జలకళను...

HOT NEWS

css.php
[X] Close
[X] Close