బాబు ఢిల్లీ టూర్ సక్సెస్!

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇవాళ ఢిల్లీలో రాష్ట్రానికి సంబంధించిన మూడు కీలక ఒప్పందాలను కుదుర్చుకున్నారు. చైనాకు చెందిన జియాన్ లాంగి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మధ్య మొదటి ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందంలో భాగంగా జియాన్ లాంగి సంస్థ చిత్తూరు జిల్లాలోని శ్రీసిటీలో రు.1,600 కోట్లతో 60 ఎకరాల్లో సౌర విద్యుత్ ఫలకాల తయారీ యూనిట్‌ను నెలకొల్పనుంది. ఈ ఒప్పందంపై శ్రీ సిటీ ప్రైవేట్ లిమిటెడ్, జియాన్ లాంగి ప్రతినిధులు సంతకాలు చేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ, స్కేల్, స్కిల్, స్పీడ్ నినాదాలతో చైనా ముందుకెళుతోందని ప్రశంసించారు. ఏపీలో రెండంకెల వృద్ధి సాధించటమే లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారు. ఏపీలో అపార వనరులన్నాయని అన్నారు. సోలార్ విద్యుత్ వల్ల పర్యావరణానికి హాని జరగదని చెప్పారు.

మరోవైపు కేంద్ర గ్రామీణ విద్యుదీకరణ సంస్థ, ఏపీ జెన్‌కో మధ్య సోమవారం రెండు కీలక ఒప్పందాలు కుదిరాయి. అనంతపురంలో రు.3 వేల కోట్లతో 500 మెగావాట్ల సౌర విద్యుత్‌కేంద్రాన్ని నిర్మించనున్నారు. మరోవైపు నవ్యాంధ్ర రాజధానిలో ట్రాన్స్‌మిషన్ అండ్ సిస్టమ్ ఇంప్రూవ్‌మెంట్ ప్రాజెక్టుకు చంద్రబాబునాయుడు, కేంద్ర మంత్రి సుజనా చౌదరి సమక్షంలో ఒప్పందం కుదిరింది. రు.6 వేలకోట్లతో ఈ ప్రాజెక్ట్ నిర్మాణం జరుగుతుంది. చంద్రబాబు సింగపూర్‌కు చేసిన నాలుగు విడతల పర్యటనల సంగతేమోగాని ఇవాళ్టి ఢిల్లీ యాత్రమాత్రం ఫలవంతంగా సాగిందని చెప్పాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో నాని

రాజ‌మౌళి - నాని కాంబోలో 'ఈగ' వ‌చ్చింది. అది సూప‌ర్ హిట్ అయ్యింది. మ‌ళ్లీ ఈ కాంబో కోసం ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు ప్రేక్ష‌కులు 'ఈగ 2' ఆలోచ‌న రాజ‌మౌళికి ఉంది. కానీ...

కేసీఆర్ పై ఈసీ బ్యాన్

మాజీ సీఎం కేసీఆర్ ను ప్రచారం చెయ్యకుండా ఎన్నికల కమిషన్ నిషేధించింది. ఈరోజు రాత్రి8 గంటల నుండి రెండు రోజుల పాటు అంటే 48గంటల పాటు ఈ నిషేధం అమల్లో ఉంటుంది అని...

టీడీపీ మేనిఫెస్టోకి మరిన్ని కలిపి ఆకర్షణీయంగా ప్రచారం చేస్తున్న జగన్

టీడీపీ వాళ్లు సూపర్ సిక్స్ పథకాలపై చాలా కాలంగా ప్రచారం చేసుకుంటున్నారు. ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. వారి మేనిఫెస్టోను వారు ప్రచారం చేసుకుంటున్నారు. అయితే వారితో పాటు జగన్ కూడా ప్రచారం చేస్తున్నారు. ...

పాన్ ఇండియా ‘సుడిగాడు’

అల్లరి నరేష్ కెరీర్ లో హిట్ సినిమా 'సుడిగాడు'. స్పూఫ్ లకు పరాకాష్టగా వచ్చిన ఆ సినిమా బాగానే నవ్వించింది. తర్వాత నరేష్ కి వరుస పరాజయాలు వచ్చాయి. ఏ సినిమా చేసిన...

HOT NEWS

css.php
[X] Close
[X] Close