తెలంగాణ బీజేపీలో బండి సంజయ్ వర్సెస్ న్యూ లీడర్స్ !

తెలంగాణ బీజేపీలో ఆల్ ఈజ్ నాట్ వెల్ అని క్లారిటీ వచ్చేసింది. ఆ పార్టీలో కొత్తగా చేరిన నేతలు ఎవరూ సంతృప్తిగా లేరు. బండి సంజయ్ మొత్తం డామినేట్ చేస్తున్నారని ఎవరికీ అవకాశాలు లేకుండా చేస్తున్నారని అసంతృప్తితో ఉన్నారు. పార్టీ ఎదగలేకపోవడానికి అనేక కారణాలు ఉన్నాయని వాటిలో బండి సంజయ్ ఒకటని.. ఆయనను తక్షణమే తొలగించాలని ఢిల్లీలో లాబీయింగ్ చేస్తున్నారు.

ఈటల రాజేందర్, రాజగోపాల్ రెడ్డి, డీకే అరుణ, జితేందర్ రెడ్డి, కొండా విశ్వేశ్వర్ రెడ్డి సహా పలువురు నేతలు ప్రస్తుతం ఢిల్లీలోనే మకాం వేశారు. బండి సంజయ్ ను కూడా హైకమాండ్ పిలిపించింది. ఇప్పుడు ఏ నిర్ణయం తీసుకుంటారన్నది కీలకంగా మారింది. బీజేపీపై వ్యతిరేక వ్యాఖ్యలు చేయడం ద్వారా కొండా విశ్వేశ్వర్ రెడ్డి పై తాము కీలక నిర్ణయం తీసుకుంటామని చెప్పకనే చెప్పారు. బండి సంజయ్ ను తప్పించి ఈటల రాజేందర్ ను నియమిస్తే కొత్త నేతలు శాటిస్ ఫై అవుతారు. కానీ పాత నేతలు అసంతృప్తికి గురయ్యే అవకాశాలు ఉంటాయి.

బీజేపీలో పరిస్థితిని రేవంత్ రెడ్డి చాలా పక్కాగా పట్టుకున్నారు. ఆందుకే ఆయన పేర్లు పెట్టి మరీ పిలిచి ఎమోషనల్ బ్లాక్ మెయిలింగ్ చేస్తున్నారు. పరిస్థితి చూస్తూంటే.కేసీఆర్ ను ఓడించేందుకు అందరం కలిసి… కాంగ్రెస్ పార్టీలో చేరిపోతున్నామనే ప్రకటన చేయడానికి సిద్ధమవుతున్నారన్న అభిప్రాయం గట్టిగానే వినిపిస్తోంది. అదే జరిగితే బీజేపీ గాలి బుడగ పేలిపోతుందన్న సెటైర్లు పడుతున్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కండోమ్స్ ఎక్కువగా వాడేది వారేనా..మోడీకి కౌంటర్

లోక్ సభ ఎన్నికల్లో ప్రధాని మోడీ ప్రసంగం ఆశ్చర్యపరుస్తోంది. గతానికి భిన్నంగా మాట్లాడుతుండటమే ఇందుకు కారణం.గాంధీ కుటుంబంపై మాత్రమే విమర్శలు చేసే మోడీ గత కొద్ది రోజులుగా రూట్ మార్చారు. కాంగ్రెస్ అకారంలోకి...

ఔను..బీజేపీతో ఒప్పందం ఉందంటోన్న కేటీఆర్..!?

బీజేపీ - బీఆర్ఎస్ మధ్య లోపాయికారి ఒప్పందం ఉందని కాంగ్రెస్ ఆరోపిస్తోన్న వేళ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. తాము బీజేపీతో కలిసే ఉన్నామనే పరోక్షంగా...

గాజు గ్లాస్ జనసేనకు మాత్రమే !

వైసీపీ నేతల ఆశలన్నీ అడియాశలయ్యాయి. ఇండిపెండెంట్లుగా తమ వారిని నిలబెట్టి వారికి గాజు గ్లాస్ గుర్తు ఇప్పించుకోవాలని చేసిన ప్రయత్నాలన్నీ ఫెయిలయ్యాయి. గాజుగ్లాస్ గుర్తును జనసేన పార్టీకి రిజర్వ్ చేస్తూ...

ఓటేస్తున్నారా ? : ల్యాండ్ టైటింగ్ యాక్ట్ గురించి తెలుసుకోండి !

ఆంధ్రప్రదేశ్ లో లోక్‌సభతో పాటు అసెంబ్లీకి ఎన్నికలు జరుగుతున్నాయి. ఢిల్లీలో ఎవరు ఉన్నా రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ప్రజల బతుకుల్ని ప్రభావితం చేస్తుంది. గతంలో ఏ ప్రభుత్వం ఉన్నా ఏముందిలే...

HOT NEWS

css.php
[X] Close
[X] Close