తెదేపా గుదిబండను తప్పించండి అంటున్న భాజపా ‘

గ్రేటర్‌ హైదరాబాద్‌ ఎన్నికలు కూడా పూర్తైన నేపధ్యంలో, తెలంగాణ భారతీయజనతాపార్టీ, తెలుగుదేశం పార్టీని వదిలించుకోవడానికి ప్రయత్నిస్తున్నట్లుగా కనిపిస్తోంది. తెలుగుదేశంతో మైత్రి బంధాన్ని ఒక భారంగా భారతీయజనతాపార్టీ నాయకులు భావిస్తున్నట్లుగా కనిపిస్తోంది. ఆపార్టీతో పొత్తులు ఇక మీదట వద్దే వద్దనీ, తమ సొంత బలాన్ని నమ్ముకోని కనీసం తెలంగాణ రాష్ట్రం వరకు ,కేవలం తమ సొంతకాళ్ల మీద నిలబడడానికే ప్రయత్నిస్తే కొంతమేరకైనా భవిష్యత్తు ఉంటుందనీ, తెలుగుదేశం పార్టీతో జట్టు కట్టే పరిస్తితిని కొనసాగిస్తే ఇప్పుడు ఉన్నదానికంటే మరింత తీసికట్టుగా పరిస్తితి తయారవుతుందనీ, భారతీయజనతా పార్టీనాయకులు భావిస్తున్నారు. ఇదే విషయాన్ని పార్టీ అధినాయకత్వం దగ్గరికి తీసుకువెళ్లి తెలంగాణ రాష్ట్రం వరకు తెలుగుదేశంతో తెగదెంపులు చేసుకోవాలని వారు సూచిస్తున్నట్లుగా, బతిమాలుతున్నట్లుగా పార్టీవర్గాలనుండి సమాచారం అందుతుంది.

గత సార్వత్రిక ఎన్నికలకు పూర్వం తెలుగుదేశం పార్టీ, భారతీయజనతా పార్టీ ఇద్దరు పొత్తులుపెట్టుకున్నప్పటికీ, బీజేపీ నాయకులు ఆ పొత్తులను అయిష్టంగానే స్వీకరిస్తూ వచ్చారు. కిషన్‌రెడ్డి అప్పట్లోనే తెలుగుదేశం పార్టీ పట్ల చాలా విముఖంగా, చాలా సందర్భాలలో తన అసంతృప్తిని బాహాటంగానే ప్రదర్శించారు. అయితే కింద మీదా పడుతూ ఆ ఎన్నికల్లో ఇద్దరు కలిసే పోటీ చేశారు. అప్పటి నుంచి కిషన్‌రెడ్డి గానీ, పార్టీ భారతీయజనతా పార్టీలోని చాలామంది సీనియర్‌ నాయకులుగానీ, తెలుగదేశంతో మిత్రపక్షంలాగా వ్యవహరిస్తూ వచ్చిన సందర్భాలు చాలా తక్కువనే చెప్పాలి. గ్రేటర్‌ హైదరాబాద్‌ ఎన్నికలలో కూడా రకరకాల భేటీలు, మంతనాలు, మల్లగుల్లాల తర్వాత ఇద్దరూ వార్డులను పంచుకున్నారు. అయితే చివరికి ఇద్దరు కూడా ఏ మాత్రం పెద్దగా తేడా లేకుండా ఫలితాలను సాధించలేకపోయారు. అయితే పార్టీలు కలిసి పనిచేయడం వలన రెండు పార్టీలకు ఎలాంటి ప్రయోజనం, అదనపు ప్రయోజనం సమకూరాలో అలాంటి లభం ఈ ఇద్దరికీ కూడా దక్కకుండా పోయింది.

అదే అంశాన్ని బేస్‌ చేసుకుని తెలుగుదేశంతో మైత్రి మనకిక అక్కర్లేదంటూ వదిలించుకోవడానికి భాజపా రాష్ట్రనాయకత్వం, పార్టీ అధిష్టానానికి నివేదించనున్నట్లుగా తెలుస్తోంది. గత ఎన్నికలలో భారతీయజనతా పార్టీకీ నగరంలో ఐదు డివిజన్లు దక్కాయి. ఈసారీ తెలుగుదేశంతో పొత్తుపెట్టుకున్నందువల్ల కనీసం ఒక్కటైనా ఎక్కువ రావాలని ఏ పార్టైనా కోరుకుంటుంది. ఇది చాలా సహజమైన పరిణామం. కానీ ఈ ఎన్నికలలో భారతీయజనతా పార్టీకి కేవలం నాలుగే స్థానాలు దక్కాయి. అంటే తమకు సహజంగా బలం ఉన్న డివిజన్లను వాళ్లు దక్కించుకోగలిగారు తప్పా, తెలుగదేశం తో పొత్తు వల్ల వారికి అదనంగా వారికి ఒక్క ఓటుకూడా రాలేదన్నది సత్యం.పైగా ఉన్న డివిజన్లలో వారు ఒకటి అనవసరంగా కోల్పోవలసి వచ్చింది. తెలుగుదేశంతో పొత్తు వల్లనే ఇది కోల్పోయామనీ, ఆపొత్తేగనక లేకపోతే ఈసారీ కూడా కనీసం ఐదు డివిజన్లను కూడా దక్కించుకునే వాళ్లమనీ భారతీయజనతాపార్టీ ఇప్పుడు వాదిస్తే కాదనగలిగే వారేవరూ ఉండరు. ఇలాంటి నేపద్యంలో ఈ పరిణామాలంన్నిటినీ పార్టీ ఢిల్లీ కేంధ్ర జాతీయ నాయకత్వానికి నివేదిస్తూ తెలంగాణ రాష్ట్రం వరకు తెలుగుదేశం పార్టీతో పొత్తును వదిలించుకుంటే తప్పా భాజపాకు కూడా మనుగడ ఉండదనే సంగతినీ వారు పదే పదే నివేదిస్తున్నారనీ, పదేపదే అలోచిస్తున్నారనీ, పార్టీవర్గాలు తెలియజేస్తున్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఒకే టైటిల్… మూడు సినిమాలు

టాలీవుడ్ లో టైటిళ్ల‌కు కొర‌త వ‌చ్చిందా? ప‌రిస్థితి చూస్తుంటే అదే అనిపిస్తోంది. త‌మ సినిమాల‌కు ఎలాంటి టైటిల్ పెట్టాలో అర్థం కాక‌, ఒక‌టే టైటిల్ తో మూడు సినిమాలు తీసేస్తున్నారు. టాలీవుడ్ లో...

బీజేపీపై పోస్టర్లు – అప్పట్లో బీఆర్ఎస్ ఇప్పుడు కాంగ్రెస్

బీజేపీపై చార్జిషీట్ అంటూ కాంగ్రెస్ పార్టీ నేతలు పోస్టర్లు రిలీజ్ చేశారు. తెలంగాణకు బీజేపీ చేసిన అన్యాయం అంటూ విభజన హామీలు సహా అనేక అంశాలను అందులో ప్రస్తావించింది. వాటిని హైదరాబాద్...

నామినేషన్‌లో పవన్ ఫోటో వాడేసుకున్న గుడివాడ అమర్నాథ్ !

రాజకీయ నాయకులకు కొంచెమైన సిగ్గు.. ఎగ్గూ ఉండవని జనం అనుకుంటూ ఉంటారు. అది నిజమేనని తరచూ కొంత మంది నిరూపిస్తూంటారు. అలాంటి వారిలో ఒకరు గుడివాడ్ అమర్నాథ్. పవన్ కల్యాణ్ పై...

కవిత అరెస్ట్ వెనక సంతోష్ రావు..!?

కవిత లిక్కర్ స్కామ్ లో కటకటాల పాలవ్వడానికి ఆ నేతే కారణమా..? తన స్వప్రయోజనాల కోసం ఆయన కవితను ఇరికించారా..?నమ్మకస్తుడిగా ఉంటూనే కేసీఆర్ కు వెన్నుపోటు పొడిచారా..?గత కొద్ది రోజులుగా సంతోష్ రావు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close