రూ. రెండున్నర వేల కోట్లకు కర్ణాటకలో సీఎం సీటు !

ఏ ముహుర్తాన రకరకాల ఆపరేషన్ ఆకర్ష్‌లు ప్రయోగించి కర్ణాటకలో కాంగ్రెస్ – జేడీఎస్ ప్రభుత్వాన్ని కూల్చేసి.. తాము పీఠంపై కూర్చున్నారో కానీ బీజేపీకి ఏదీ కలసి రావడం లేదు. ముఖ్యమంత్రిని మారిస్తే సీన్ మారుతందనుకుంటే మరింత వరస్ట్‌గా మారింది. ఇప్పుడు మరోసారి ముఖ్యమంత్రిని మారుస్తారన్న చర్చలు ప్రారంభయ్యాయి. దీంతో ముఖ్యమంత్రి పదవిపై ఆశలు పెట్టుకున్న వారు రకరకాల విన్యాసాలు చేస్తున్నారు. తాజాగా ఓ ఎమ్మెల్యే రూ. రెండున్నర వేల కోట్లు ఇస్తే తనకు సీఎం పదవి ఇస్తామన్నారని ప్రకటించి.. కొత్త తలనొప్పి తెచ్ిచ పెట్టారు.

సీఎం పదవి ఇవ్వాలంటే రూ. రెండున్నర వేల కోట్లు అడుగుతున్నారని బీజేపీ ఎమ్మెల్యే బసనగౌడ పాటిల్ నేరుగా వ్యాఖ్యానించారు. ఆయన మాజీ కేంద్రమంత్రి కూడా. కర్ణాటకలో సీఎంను మారుస్తున్ారన్న ఊహాగానాల కారణం తాను కూడా రేసులో ఉన్నానని గతంలో ప్రకటించారు. ఇప్పుడు ఇలా రూ. రెండున్నర వేల కోట్లు డిమాండ్ చేస్తున్నారన్న ఆరోపణలు చేయడంతో బీజేపీ వర్గాల్లోనూ సంచలనం ప్రారంభమయింది. అయితే బసనగౌడ పాటిల్ తన పార్టీ నేతలు అడుగుతున్నారని చెప్పడం లేదు . ” ఢిల్లీ నుంచి కొంతమంది నా దగ్గరకు వచ్చి నన్ను సీఎంను చేస్తానని, అందుకు రూ. 2500కోట్లు సిద్ధం చేసుకోవాలని చెప్పారంటున్నారు” .

కర్ణాటక బీజేపీ నేతలెవరూ బసనగౌడ పాటిల్ చేసిన వ్యాఖ్యలపై సీరియస్‌గా స్పందించలేదు. కానీ ఇతర పార్టీల నేతలు మాత్రం మండి పడుతున్నారు. కర్ణాటక కాంగ్రెస్‌ చీఫ్‌ డీకే శివకుమార్‌ ఈ పరిణామాలను తీవ్రంగా తీసుకోవాలని, దీనిపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టాలని డిమాండ్‌ చేశారు. తెలంగాణ మంత్రి కేటీఆర్ కూడా దీనిపై విచారణ సంస్థలు దర్యాప్తు చేయవా అని ట్వీట్ చేశారు. మొత్తంగా కర్ణాటకలో బీజేపీ పరువు రోడ్డున పడుతోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

చెల్లిని కించపర్చి జాతీయ మీడియాలో జగన్ నవ్వులపాలు

జాతీయ మీడియాకు జగన్ ఇచ్చిన ఇంటర్యూలు నవ్వుల పాలయ్యాయి. ఇతర విషయాల సంగతేమో కానీ చెల్లి షర్మిలపై ఆయన చేసిన వ్యాఖ్యలు బీహార్ లో పురుషాహంకారం ఉండే నేతలు కూడా...

పోస్టల్ బ్యాలెట్స్ కూడా రీపోలింగ్ – ఇదేం ఎన్నికల నిర్వహణ ?

ఎన్నికల నిర్వహణ ఎంత అసమర్థుల చేతుల్లో ఉందో తెలిపే ఘటన ఇది. పల్నాడు జిల్లాలో చిలకలూరిపేట లో పోస్టల్ బ్యాలెట్లకు బదులు ఉద్యోగులకు డమ్మీ బ్యాలెట్లు ఇచ్చారు. రోజంతా ఉద్యోగులు కష్టపడి...

రైతు భరోసా స్టార్ట్ … క్రెడిట్ బీఆర్ఎస్ దేనా..?

రైతు భరోసాకు ప్రభుత్వం నిధులు విడుదల చేయడంతో కేసీఆర్ తనదైన రాజకీయం ప్రదర్శిస్తున్నారు. ఎన్నికల వేళ పెట్టుబడి కింద రైతుల అకౌంట్లో డబ్బులు జమ అవుతుండటంతో ఆ క్రెడిట్ బీఆర్ఎస్ ఖాతాలో వేస్తున్నారు....

ఓటేస్తున్నారా ? : కష్టాల్లో నేనున్నానని భరోసా ఇచ్చే పాలకుడెవరో ఆలోచించండి !

ఓ డ్యామ్ పగిలిపోయింది.. కొట్టుకుపోయింది. డ్యామ్ అంటే చిన్న విషయం కాదు. ఆ డ్యామ్ ఎందుకు కొట్టుకుపోయిందన్న సంగతి తర్వాత ముందుపాలకుడు ఏం చేయాలి ?. ఉన్న పళంగా అక్కడికి వెళ్లి...

HOT NEWS

css.php
[X] Close
[X] Close