పీఎం కిసాన్ యోజన ( రైతు భరోసా ) ప్రకటనల్లో కనిపించని మోడీ ఫోటో..! బీజేపీ గుస్సా..!

ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రైతు భరోసా పథకంలో భాగంగా రైతుల అకౌంట్లకు డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేశారు. అలా చేస్తున్నట్లుగా పత్రికలకు ప్రకటనలు ఇచ్చారు. అయితే అందులో ఎక్కడా ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఫోటో లేదు. మామూలుగా అయితే ఎవరూ పట్టించుకునేవారు కాదు కానీ… అసలు పథకం పేరే “వైఎస్ఆర్ రైతు భరోసా – పీఎం కిసాన్ యోజన..” . పేరుతో కూడా పీఎం ఉంది. అయనా మోడీ ఫోటో పెట్టలేదు. వైఎస్ఆర్ ఫోటో..జగన్ ఫోటోలను మాత్రం పెట్టారు. గత ఏడాది మోడీ ఫోటో కూడా పెట్టారు. దీంతో బీజేపీ నేతల అహం దెబ్బతిన్నది. రైతు భరోసా పథకంలో భాగంగా మూడు విడతల్లోరైతులకు ఇస్తున్న రూ.13500లో..రూ.ఏడు వేల ఐదు వందలు మాత్రమే ఏపీ సర్కార్ ఇస్తోంది.

మిగతా ఆరు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇస్తోంది. ఈ రైతు భరోసా పథకం కింద ఏపీ ప్రభుత్వం 6 వేల 500 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నామని ప్రకటించినప్పటికీ ఇందులో దాదాపుగా 40 శాతం నగదు కేంద్రం నుంచి వచ్చేవే. పీఎం కిసాన్ పథకం కింద ఈ సొమ్మును కేంద్ర ప్రభుత్వం నేరుగా రైతుల ఖాతాల్లో జమచేస్తుంది. ఏపీ ప్రభుత్వం ఇచ్చేది కేవలం 7 వేల 500 రూపాయలుండగా .. కేంద్రం ఇచ్చేవి 6 వేలు రూపాయలుగా ఉంది. ఈ పథకం సొమ్మంతా తామే ఇస్తున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం ప్రచారం చేసుకోవడాన్ని బీజేపీ నేతలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.

కనీసం ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఫొటో ముద్రించకుండా కేంద్రం ఇచ్చే డబ్బును తమ పథకంగా జగన్ ప్రచారం చేసుకోవడం ఏమిటని బీజేపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. ఈ విషయాన్ని ఇంతటితో వదిలి పెట్టకూడదని.. బీజేపీ నేతలు భావిస్తున్నారు. ఏపీ ప్రభుత్వ తీరుపై ఇప్పటికే.. బీజేపీ వర్గాల్లోచర్చ నడుస్తోంది. రేపోమాపో దీనిపై ప్రభుత్వంపై విమర్శలు గుప్పించాలని భావిస్తున్నారు. ప్రధానమంత్రికి జరిగిన అవమానాన్ని హైకమాండ్ దృష్టికి తీసుకెళ్లిన నేతలు వారి స్పందన కోసం ఎదురు చూస్తున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ట్యాపింగ్ కేసు మొత్తం అధికారులపై నెట్టేసిన కేసీఆర్ !

ట్యాపింగ్ కేసుపై కేసీఆర్ తేల్చేశారు. ఆ కేసులో చట్టవిరుద్ధంగా ఏది జరిగినా అదంతా అధికారుల తప్పే కానీ సీఎంకు.. మంత్రులకు సంబంధం లేదనేశారు. తనకు తెలిసి జరిగినదంతా చట్టబద్దంగా జరిగిందని.. మిగిలిన...

అదేదో ప్రెస్మీట్‌లో చెబితే సరిపోయేదిగా -అన్ని టీవీల్లో వచ్చేది !

పదేళ్ల తర్వాత కేసీఆర్ టీవీ డిబేట్‌లో పాల్గొంటున్నారని బీఆర్ఎస్ నేతలు హడావుడి చేశారు. ఎన్నికల ప్రచారం కోసం ఊళ్లల్లో ఏర్పాటు చేసిన డిజిటల్ ప్రచార వాహనాల్లో ప్రత్యక్ష ప్రసారం చేస్తామని...

వివేకా హత్య కేసులోకి జగన్‌నూ లాక్కొస్తున్న దస్తగిరి !

మావాళ్లు చెప్పినట్లు చేయి.. ఏం జరిగినా అండగా ఉంటానని దస్తగిరికి సీఎం జగన్ స్వయంగా హామీ ఇచ్చారట. ఈ విషయాన్ని స్వయంగా దస్తగిరినే చెబుతున్నారు. వివేకాను చంపే ముందు జగన్ ఆయనతో ఫోన్...

ఖమ్మం సీటు రిస్క్ లో పడేసుకున్న కాంగ్రెస్

కాంగ్రెస్ పార్టీ అత్యంత సులువుగా గెలిచే సీటు ఖమ్మం అనుకున్నారు. మిత్రపక్షంతో కలిసి ఆ లోక్ సభ పరిధిలో ఉన్న అన్ని చోట్లా గెలిచారు. అదీ కూడా భారీ మెజార్టీలతో. ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close