హోదాపై చర్చే లేదంటున్న జీవీఎల్ !

పదిహేడో తేదీన రెండు తెలుగు రాష్ట్రాల ఆర్థిక శాఖ కార్యదర్శులతో కేంద్ర హోంశాఖ కార్యదర్శి విభజన సమస్యలపై చర్చించబోతున్నారు. ఇందులో ప్రత్యేకహోదా అంశం కూడా ఉందని ఓ నోట్ విడుదలయింది. దీంతో ఆ నోట్ బయటకు వచ్చినప్పటి నుండి ప్రభుత్వ ముఖ్య సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి నుండి ఎండీ భరత్ వరకూ అందరూ ప్రత్యేకహోదా జగన్ కృషి ఫలితమని చెప్పడం ప్రారంభిచారు. ఆ పార్టీ నేతలు సోషల్ మీడియాలో ఏపీకి ప్రత్యేకహోదాను సీఎం జగన్ సాధించేశారన్నట్లుగా ప్రచారం చేస్తున్నారు. ఇది మరీ ఎక్కువ అయిందేమోకానీ బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు వెంటనే తెరపైకి వచ్చారు.

ఏపీకి ప్రత్యేకహోదా అంశంపై కేంద్ర హోంశాఖ దగ్గర చర్చ జరుగుతుందన్నది అబద్దమని ప్రకటించారు. ఉదయం నుంచి జరుగుతున్న ప్రచారంతో వైసీపీ నేతలు (ఎదో సాధించారని అనుకున్నానని). కేంద్ర ప్రభుత్వ హోంశాఖ అధికారులను సంప్రదిస్తే అసలు విషయం తెలిసిందన్నారు. ఏపీకి ప్రత్యేకహోదా ఇవ్వాలంటే తెలంగాణతో చర్చించాల్సిన అవసరం ఏమిటని జీవీఎల్ నరసింహారావు ప్రశ్నించారు. అస‌లు ఆ అజెండా కాపీలు బ‌య‌ట‌కు ఎలా వ‌చ్చాయని జీవీఎల్ ప్రశ్నించారు. కేవ‌లం ఆర్దిక ప‌ర‌మ‌యిన విష‌యాలు పైనే చ‌ర్చ ఉంటుంద‌ని చెప్పారు. ఎపీకి కేంద్రం ఆర్దికంగా అన్ని విధాలుగా అండగా ఉంటుంద‌ని హోదా పై చర్చ మాత్రం ఉండదన్నారు.

అయితే బీజేపీ తరపున జీవీఎల్ నరసింహారావు స్పందించారు కానీ హోంశాఖ నుంచి అధికారికంగా విడుదలైన పత్రం ప్రకారం ఎనిమిదో అంశంగా ప్రత్యేకహోదా ఉంది. ఈ విషయంలో కేంద్ర హోంశాఖ మళ్లీ సవరణ ప్రకటన చేస్తేనే ప్రత్యేకహోదా అంశంపై చర్చ లేదని అధికారికంగా అనుకోవడానికి అవకాశం ఉంటుందని భావిస్తున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

దానం ఓడిపోయేందుకే పోటీ చేస్తున్నారా..?

అనుభవజ్ఞుడు, సమర్ధుడని సికింద్రాబాద్ కాంగ్రెస్ ఎంపీ టికెట్ కట్టబెడితే దానం నాగేందర్ మాత్రం అందుకు విరుద్దంగా వ్యవహరిస్తున్నారు. ఆయన వైఖరితో కాంగ్రెస్ పెద్దలే విసుగు చెందగా గ్రేటర్ హైదరాబాద్ నేతలు కూడా దానంపై...

ఎన్నికల్లో ప్రజలకు పరీక్ష పెడుతోన్న జగన్ రెడ్డి..!?

ఈ ఎన్నికల్లో ఏపీ ప్రజలను జగన్ రెడ్డి పరిక్షీస్తున్నట్టు ఉంది. సొంత చెల్లి మీడియా ముంగిటకు వచ్చి జగన్ నిజస్వరూపం బయటపెడుతున్నా నిజాన్ని నిందగా చిత్రీకరించుకుంటూ జనం మద్దతు కూడగట్టుకునే ప్రయత్నం చేస్తుండటం...

జగన్ మానసిక స్థితిపై డౌట్ గా ఉంది : షర్మిల

జగన్ మానసిక పరిస్థితిపై తేడాగా ఉందని బ్యాలెన్స్ తప్పిందేమోనని డౌట్ గా ఉందని ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల అన్నారు. కడపలో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా జగన్ కు ఓ...

ఖమ్మంలో నామా వైపు టీడీపీ సానుభూతిపరులు !

పరిస్థితి క్లిష్టంగానే ఉన్నా ఖమ్మంలో నామా నాగేశ్వరరావు ధైర్యంగా పోరాడుతున్నారు. బీజేపీ తరపున సరైన అభ్యర్థి లేకపోవడం ఎవరికీ తెలియని వినోద్ రావు అనే వ్యక్తిని బీజేపీ నిలబెట్టింది. బీజేపీకి ఉన్న...

HOT NEWS

css.php
[X] Close
[X] Close