ఇప్పుడు దేశ రాజకీయాల అసలు సమస్య “పనౌతీ” !

రాహుల్ గాంధీకి కేంద్ర ఎన్నికల సంఘం నోటీసులు జారీ చేసింది. ఎందుకంటే ఆయన ఎన్నికల ప్రచారంలో పనౌతీ అన్నారట. ఎవరిని అన్నారంటే.. నేరుగా ఎవరినీ అనలేదు.. పరోక్షంగా ప్రధాని మోదీని అన్నారు. ప్రధాని మోదీని పట్టుకుని అంత మాట అంటారా అని బీజేపీ ఈసీకి ఫిర్యాదు చేసింది. అంత కంటే బూతు మాటలు ఇంత వరకూ ఎన్నికల ప్రచారం లో ఎవరూ వాడలేదన్నట్లుగా ఈసీ రాహుల్‌కు నోటీసులు జారీ చేసింది. సమాధానం ఎలా ఇచ్చినా… ఆయనపై ప్రచారం చేయకుండా నిషేధం విధించినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. మన పోల్ బాడీ నిజాయితీని ఎవరూ శంకించలేరు.

ఇంతకీ పనౌతీ అంటే ఏమిటి ?. ఈ పదంపై బీజేపీ కార్యకర్తలు ఎందుకు అంత ఉలిక్కి పడ్డారు? . పనౌతీ అంటే… హిందీలో అపశకునపు పక్షి, శని, దరిద్ర పాదం ఇలా రకరకాలుగా చెప్పుకోవచ్చు. అంటే.. ఏదైనా పని సజావుగా సాగుతున్న సమయంలో ఎవరైనా వస్తే… ఆ పని చెడితే అతన్ని పనౌతీ అని సంబోధిస్తారు. తెలుగులో ఐరన్ లెగ్ అని చెప్పుకున్నట్లుగా.. ఇటీవల ప్రపంచకప్ ఫైనల్ సందర్భంగా ప్రధాని మోదీ స్టేడియంకు వెళ్లిన సందర్భాన్ని పురస్కరించుకుని రాహుల్ ఈ వ్యాఖ్య చేశారు. మనం కప్ గెలిచే వాళ్లమేనని ఓ పనౌతి వెళ్లడం వల్ల ఓడిపోయామని వెటకారం చేశారు. దీనిపై బీజేపీ నేతలు భగ్గుమటున్నారు.

దేశంలో చాలా సమస్యలు ఉన్నాయి. ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో చెప్పుకోవడానికి ఇంకా చాలా ఉంటాయి. కానీ అదేమీ లేదన్నట్లుగా రాహుల్ మోదీని.. పనౌతీ అంటారా అని బీజేపీ నేతలు దాన్నే అతి పెద్ద సమస్యగా మార్చేశారు. నేషనల్ మీడియా అంతా బీజేపీ సపోర్టే కాబట్టి.. చర్చలు కూడా విస్తృతంగా నిర్వహించారు. వీటిని చూసి.. జనం కూడా అయ్యో మోదీ అనుకోవాల్సి వస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

స్మూత్ గా ఓట్ల బదిలీ ఖాయం – ఫలించిన కూటమి వ్యూహం !

ఏపీలో ఎన్డీఏ కూటమి మధ్య ఓట్ల బదిలీ సాఫీగా సాగిపోయే వాతావరణం కనిపిస్తోది. ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ, బీజేపీ, జనసేన కలిసి పోటీ చేయాలని అనుకున్నప్పుడు చాలా మంది ఓటు బదిలీపై...

బెట్టింగ్ రాయుళ్ల టార్గెట్ ప‌వ‌న్‌!

ఏపీ మొత్తానికి అత్యంత ఫోక‌స్ తెచ్చుకొన్న నియోజ‌క వ‌ర్గం పిఠాపురం. ప‌వ‌న్ క‌ల్యాణ్ అక్క‌డి నుంచి పోటీ చేయ‌డంతో పిఠాపురం ఒక్క‌సారిగా టాక్ ఆఫ్ ఏపీ పాలిటిక్స్ అయ్యింది. గ‌త ఎన్నిక‌ల్లో భీమ‌వ‌రం,...

ప్రధాని రేసులో ఉన్నా : కేసీఆర్

ముఖ్యమంత్రి పదవి పోతే పోయింది ప్రధానమంత్రి పదవి కోసం పోటీ పడతానని కేసీఆర్ అంటున్నారు. బస్సు యాత్రతో చేసిన ఎన్నికల ప్రచారం ముగియడంతో .. తెలంగాణ భవన్ లో మీడియాతో మాట్లాడారు. ఈ...

ఎక్స్ క్లూజీవ్‌: ర‌ణ‌వీర్‌, ప్ర‌శాంత్ వ‌ర్మ‌… ‘బ్ర‌హ్మ‌రాక్ష‌స‌’

'హ‌నుమాన్' త‌రువాత ప్ర‌శాంత్ వ‌ర్మ రేంజ్ పెరిగిపోయింది. ఆయ‌న కోసం బాలీవుడ్ హీరోలు, అక్కడి నిర్మాణ సంస్థ‌లు ఎదురు చూపుల్లో ప‌డిపోయేంత సీన్ క్రియేట్ అయ్యింది. ర‌ణ‌వీర్ సింగ్ తో ప్ర‌శాంత్ వ‌ర్మ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close