టీడీపీ ఫిర్యాదుపై ఈసీ స్పందించింది, కానీ…

ఢిల్లీలోని సీఈసీ సునీల్ అరోరాని కలుసుకున్న ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు.. రాష్ట్రంలో ఎన్నికలు జరిగిన తీరు, ఎన్నికల సంఘం వైఫల్యం, ఈవీఎంల పనితీరుపై అభ్యంతరాలు వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. దీనిపై స్పందించిన ఈసీ టీడీపీకి లేఖ రాసింది. ఈవీఎంల పనితీరుపై సాంకేతికంగా ఉన్న అనుమానాలను చర్చించేందుకు నిపుణులతో ఈనెల 15న మరోసారి కలవొచ్చని లేఖలో స్పష్టం చేసింది. అయితే, టీడీపీ తరఫున హరిప్రసాద్ చర్చల్లో పాల్గొనడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఆయనపై కేసు ఉందనీ, ఆయనకి బదులుగా వేరెవరైనా చర్చలకు రావొచ్చని పేర్కొంది.

శనివారం ఉదయం సునీల్ ఆరోరాను చంద్రబాబు కలిసినవారిలో హరిప్రసాద్ ఉన్నారు. ఈవీఎంలను ఏవిధంగా టేంపర్ చెయ్యొచ్చు, చిప్ ని ఎలా మార్చొచ్చు అనే అంశాన్ని సునీల్ అరొరాకు ఆయన వివరించే ప్రయత్నం చేశారు. అయితే, ఈ అంశాలను టెక్నికల్ టీమ్ తో చర్చించండి అంటూ సాయంత్రం 4 గంటలకి మీటింగ్ ఏర్పాటు చేశారు. ఈవీఎంలకు ఇన్ ఛార్జ్ గా ఉన్న సుదీప్ జైన్, ఢిల్లీకి చెందిన మరో ఐఐటీ నిపుణుడితో ఈ సమావేశం జరిగింది. అయితే, టీడీపీ తరఫున హరిప్రసాద్ వచ్చేసరికి… ఆయనతో మాట్లాడేది లేదంటూ ఆ ఇద్దరూ వెళ్లిపోవడం విశేషం. కారణం ఏంటంటే… గుజరాత్ లో ఆయనపై ఒక కేసు ఉందని. ఆ తరువాత, టీడీపీకి సోమవారం రమ్మంటూ తాజా లేఖ రాశారు.

ఈ లేఖపై టీడీపీ నేత జూపూడి ప్రభాకర్ ఢిల్లీలో మాట్లాడుతూ… హరిప్రసాద్ సాంకేతిక నిపుణుడనీ, ఆయనతో చర్చించడానికి వారెందుకు భయపడుతున్నారన్నారు. ఆయన మీద కేసు ఉందని మాట్లాడేది లేదనడం సరికాదన్నారు. ఈవీఎంలు ట్యాంపర్ అవుతాయని గతంలో హరిప్రసాద్ నిరూపించారనీ, అయితే దాని నిరూపణకు వాడిన ఈవీఎం ఎక్కడి నుంచి వచ్చిందని మాత్రమే ఆయనపై కేసు ఉందన్నారు. అవినీతి కేసుల్లో ఎ-1, ఎ-2లుగా ఉన్నవారికి ఒక రూలు… ఒక అడ్వైజర్ గా ఉన్నవారికి మరొక రూలా అని జూపూడి ప్రశ్నించారు. హరిప్రసాద్ మీదున్నది మర్డర్ కేసు కాదనీ, దేశాన్ని దోచుకున్న కేసు అంతకన్నా కాదన్నారు. సాంకేతికంగా తమని ఎన్నికల సంఘం ఎందుకు ఎదుర్కోవడం లేదన్నారు. పక్షపాత ధోరణితో వారు వ్యవహరిస్తున్నారనడానికి ఇది మరొక సాక్ష్యం అన్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

జగన్ మానసిక స్థితిపై డౌట్ గా ఉంది : షర్మిల

జగన్ మానసిక పరిస్థితిపై తేడాగా ఉందని బ్యాలెన్స్ తప్పిందేమోనని డౌట్ గా ఉందని ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల అన్నారు. కడపలో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా జగన్ కు ఓ...

ఖమ్మంలో నామా వైపు టీడీపీ సానుభూతిపరులు !

పరిస్థితి క్లిష్టంగానే ఉన్నా ఖమ్మంలో నామా నాగేశ్వరరావు ధైర్యంగా పోరాడుతున్నారు. బీజేపీ తరపున సరైన అభ్యర్థి లేకపోవడం ఎవరికీ తెలియని వినోద్ రావు అనే వ్యక్తిని బీజేపీ నిలబెట్టింది. బీజేపీకి ఉన్న...

రోహిత్ శ‌ర్మ ఫీల్డ్ లో ఉండ‌డం కూడా ఇష్టం లేదా పాండ్యా…?!

ఈ ఐపీఎల్ లో ముంబై ఆట ముగిసింది. ప్లే ఆఫ్ రేసు నుంచి ఈ జ‌ట్టు దూర‌మైంది. ఐదుసార్లు ఐపీఎల్ విజేత‌గా నిలిచిన ముంబై ఈసారి క‌నీసం ప్లే ఆఫ్‌కు కూడా అర్హ‌త...

డైరెక్టర్స్ డే ఈవెంట్.. కొత్త డేట్‌!

మే 4.. దాస‌రి నారాయ‌ణ‌రావు జ‌న్మ‌దినం. దాస‌రిపై గౌర‌వంతో ఆయ‌న పుట్టిన రోజుని డైరెక్ట‌ర్స్ డేగా జ‌రుపుకొంటోంది చిత్ర‌సీమ‌. నిజానికి ఈ రోజు ఎల్ బీ స్టేడియంలో భారీ ఈవెంట్ జ‌ర‌గాల్సింది. ఎన్నిక‌ల...

HOT NEWS

css.php
[X] Close
[X] Close