‘రంగ‌స్థ‌లం’ చిరుకి అంత బాగా న‌చ్చేసిందా??

రామ్ చ‌ర‌ణ్ సినిమా అన‌గానే అందులో చిరంజీవి ఇన్‌వాల్వ్‌మెంట్ త‌ప్ప‌నిస‌రి. క‌థ, న‌టీన‌టుల ఎంపిక… ఇలా అన్ని విష‌యాల్లోనూ చిరు ప్ర‌మేయం ఉంటుంది. ఆఖ‌రికి ఎడిటింగ్ టేబుల్ ద‌గ్గ‌ర కూడా చిరు ఉండాల్సిందేన‌ని చెబుతుంటారు. ఆయ‌న మార్పులు, చేర్పులూ ఏ స్థాయిలో సాగుతాయో.. ‘గోవిందుడు అంద‌రివాడే’ టైమ్‌లో తెలిసిపోయింది. అందులో రాజ్ కిర‌ణ్‌ని త‌ప్పించి, ఆయ‌న స‌న్నివేశాల్ని ప్ర‌కాష్‌రాజ్‌తో రీషూట్ చేయించింది చిరునే. ఇప్పుడు చ‌ర‌ణ్ నుంచి ‘రంగ‌స్థలం’ రాబోతోంది. ఈ సినిమా అవుట్ పుట్ ఇప్ప‌టికే చిరు చూసేశారు. అయితే ఆయ‌న ఒక్క క‌ర‌క్ష‌న్ కూడా చెప్ప‌లేద‌ట‌. ‘అంతా బాగుంది.. గో ఎహెడ్‌’ అంటూ స్టాంపు వేసేశార్ట‌. సాధార‌ణంగా చిరు వంక‌లు పెట్ట‌డ‌మో, లేదంటే బెట‌ర్ మెంట్స్ చెప్ప‌డ‌మో చేస్తార‌ని, ఈ సినిమా విష‌యంలో మాత్రం ఆయ‌న ఒక్క మార్పు కూడా చెప్ప‌లేద‌ని, రంగ‌స్థ‌లం చిరంజీవికి అంత బాగా న‌చ్చేసింద‌ని ఇన్ సైడ్ వ‌ర్గాలు చెబుతున్నాయి. కాక‌పోతే రిలీజ్ డేట్ విష‌యంలో కాస్త జాగ్ర‌ర్త‌గా ఆలోచించి అడుగువేయ‌మ‌ని స‌ల‌హా ఇచ్చార్ట‌. రీ రికార్డింగ్‌, ఫైన‌ల్ క‌ట్ మొత్తం అయిపోయిన త‌ర‌వాత మ‌రోసారి చిరంజీవి ఈ సినిమా చూస్తార‌ని టాక్‌. అప్పుడేమైనా మార్పులు చెబుతారేమో. మొత్తానికి ‘రంగ‌స్థ‌లం’ అవుట్ పుట్‌పై చిరు పూర్తిగా హ్యాపీగా ఉన్నారు. అయితే ‘హిట్‌’ అయ్యే ఛాన్సులు ఎక్కువ ఉన్నాయ‌న్న‌మాట‌.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.