దటీజ్ కేసీఆర్..! ఉపఎన్నిక ముందు కాంగ్రెస్ సెల్ఫ్ గోల్ ..!

తెలంగాణ సీఎం కేసీఆర్ రాజకీయంగా కొట్టే దెబ్బ సుతిమెత్తగా ఉంటుంది. కానీ ప్రభావం మాత్రం తీవ్రంగా ఉంటుంది. ఆయన వ్యూహాలు ఎత్తుగడలు అర్థం చేసుకోకపోతే.. రాజకీయ ప్రత్యర్థులకు భవిష్యత్ ఉండదు. తెలంగాణ కాంగ్రెస్ నేతలు అలాంటి ట్రాప్‌లోనే పడ్డారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత కాంగ్రెస్ నేతలకు కేసీఆర్ ఒక్క సారి కూడా అపాయింట్‌మెంట్ ఇవ్వలేదు. తొలి సారి వారికి ఈ రోజు అపాయింట్‌మెంట్ లభించింది. కేసీఆర్ ప్రగతి భవన్ గేట్లు తెరిచారనే ఆనందంతో.. శ్రీధర్ బాబు, భట్టి విక్రమార్క , జగ్గారెడ్డి వంటి ముఖ్య నేతలు పోలోమంటూ ప్రగతి భవన్‌కు వెళ్లారు. ఇంతకూ వారెందుకు వెళ్లాలంటే.. కొద్ది రోజుల కిందట మరియమ్మ అనే మహిళ యాదాద్రి జిల్లాలో లాకప్ డెత్‌కు గురయ్యారు.

ఆ అంశం తెలంగాణలో రాజకీయం అవుతోంది. కాంగ్రెస్ నేతలు ఆందోళనలు చేస్తున్నారు. ఈ అంశంపై పోలీసులపై ఫిర్యాదు చేసేందుకంటూ… సీఎం అపాయింట్‌మెంట్‌ను కాంగ్రెస్ నేతలు అడిగారు. కేసీఆర్ వెంటనే ఇచ్చేశారు. కాంగ్రెస్ నేతలు పోలోమంటూ వెళ్లి కలిశారు. కానీ వారు ముందూ వెనుకా చూసుకోలేకపోయారు. ప్రస్తుతం హుజూరాబాద్ ఎన్నిక జరుగుతోంది. ఇలాంటి సమయంలో కాంగ్రెస్ నేతలు కేసీఆర్‌తో భేటీ అవడం తప్పుడు సంకేతాలు పంపే ప్రమాదం కనిపిస్తోంది. అదే సమయంలో హుజూరాబాద్‌లో టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ అన్నట్లుగా జరిగే పరిస్థితి ఉంది.

తాము పోటీలో ఉన్నామని కాంగ్రెస్ నిరూపించుకోవడానికి తీవ్రమైన ప్రయత్నాలు చేయాల్సి ఉంది. కానీ.. అలా చేయకుండా.. కేసీఆర్‌తో భేటీ కావడంతో.. పొలిటికల్ సీన్ మారిపోయే అవకాశం కనిపిస్తోంది. ఈ భేటీ జరిగిన వెంటనే.. బీజేపీ నేతలు విమర్శలు ప్రారంభించారు. కాంగ్రెస్ ఓట్లను టీఆర్ఎస్‌కు బదలాయింపు చేయడానికే భేటీ జరిగిందని రఘునందన్ రావు విమర్శించారు. సాధారణ ప్రజల్లోకి ఈ భావాన్ని తీసుకెళ్లేందుకు టీఆర్ఎస్ తమ శక్తి మేర ప్రయత్నిస్తుందనడంలో సందేహం లేదు. కేసీఆర్ వ్యూహంతో … కాంగ్రెస్ సెల్ఫ్ గోల్ గోల్ చేసుకున్నట్లయింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రేవంత్ ను కలిసిన రోహిత్ వేముల తల్లి..కేసు రీఓపెన్ కు హామీ

హెచ్ సీ యూ విద్యార్ధి రోహిత్ వేముల ఆత్మహత్యకు ఎవరూ కారణం కాదని, ఈ కేసును ఇంతటితో మూసివేస్తున్నట్లు హైకోర్టు ప్రకటించడంతో తాజాగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు రోహిత్...

అనంత శ్రీ‌రామ్ పై బాల‌య్య ఫ్యాన్స్ ఫైర్‌

టాలీవుడ్ లో పేరున్న గీత ర‌చ‌యిత‌... అనంత శ్రీ‌రామ్‌. ఇప్పుడు ఈయ‌న‌కు కూడా రాజ‌కీయం బాగానే వంటబ‌ట్టింద‌నిపిస్తోంది. అప్పుడ‌ప్పుడూ కొన్ని పొలిటిక‌ల్ సెటైర్ల‌తో క‌వ్వించ‌డం అనంత శ్రీ‌రామ్‌కు అల‌వాటే. తాజాగా ఆయ‌న చేసిన...

య‌శ్ స‌ర‌స‌న న‌య‌న‌తార‌

'కేజీఎఫ్`తో య‌శ్ పాన్ ఇండియా హీరో అయిపోయాడు. 'కేజీఎఫ్‌' త‌ర‌వాత య‌శ్ ఎలాంటి సినిమా చేయ‌బోతున్నాడా? అని దేశ‌మంతా ఆస‌క్తిగా ఎదురు చూస్తోంది. ఈ నేప‌థ్యంలో గీతు మోహ‌న్ దాస్ ద‌ర్శ‌క‌త్వంలో న‌టించ‌డానికి...

శింగనమల రివ్యూ : కాంగ్రెస్ రేసులో ఉన్న ఒకే ఒక్క అసెంబ్లీ నియోజకవర్గం !

అనంతపురం జిల్లా శింగనమల నియోజకవర్గం అందర్నీ ఆకర్షిస్తోంది. ఈ సారి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ రేసులో ఉందని చెప్పుకుంటున్న ఒకే ఒక్క నియోజకవర్గం శింగనమల. మాజీ మంత్రి శైలజానాథ్ గతంలో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close