ప్రభాస్ ‘కల్కి’ సీక్వెల్ నుంచి దీపికా పదుకొణెని తప్పించారు నిర్మాతలు. ఈ విషయాన్ని తెలుపుతూ నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్ ఓ పోస్ట్ పెట్టింది. “చాలా జాగ్రత్తగా ఆలోచించిన తర్వాత ఒక నిర్ణయానికి వచ్చాం. ‘కల్కి’ సీక్వెల్లో దీపిక భాగం కాదని అధికారికంగా తెలియజేస్తున్నాం. తొలి భాగంలో ఆమెతో సుదీర్ఘ ప్రయాణం చేసినప్పటికీ రెండో భాగంలో పార్ట్ కావడం లేదు. కల్కి లాంటి సినిమా చేయాలంటే చాలా అంకితభావం అవసరం. దీపికకి ఆల్ ది బెస్ట్” అంటూ అఫీషియల్ స్టేట్మెంట్ రిలీజ్ చేశారు.
కల్కి దీపికకి తొలి తెలుగు సినిమా. చాలా అంచనాలతో అడుగుపెట్టింది. ఆమె పాత్రకు మంచి పేరు కూడా వచ్చింది. రెండో భాగంలో చాలా కీలకం. అయినప్పటికీ నిర్మాతలు తొలగించే పరిస్థితి వచ్చిందంటే మామూలు విషయం కాదు. నిర్మాతలు ఈ నిర్ణయానికి రావడానికి కారణం దీపికనే. బాలీవుడ్లో దీపిక స్టార్ హీరోయిన్. అయితే దీపికతో వర్క్ చేయడం అంత ఈజీ కాదు. చాలా కండీషన్లు ఉంటాయి. స్పిరిట్ కోసం సందీప్ రెడ్డి వంగా ఆమెని సంప్రదించి, ఆమె పెట్టిన కండీషన్లు భరించలేక వెంటనే తప్పించేశాడు. ఇప్పుడు కల్కి విషయంలో కూడా అదే జరిగింది.
కల్కి చాలా అంబిషియస్ ప్రాజెక్ట్. రెగ్యులర్ సినిమాల కంటే చాలా హార్డ్ వర్క్, టైమ్ అవసరం. వైజయంతీ సంస్థ ట్రీట్మెంట్, రెమ్యునరేషన్ విషయంలో ఎక్కడా వెనకడుగు వేయదు. కానీ తలకు మించిన కండీషన్లు పెడితేనే చిక్కు. ఇప్పుడు దీపిక తన యాటిట్యూడ్ చూపించింది. తొలి పార్ట్లో భాగమయ్యాను, ఇప్పుడు లేనిపోని పేచీలు పెడితే ప్రాజెక్ట్కే ఇబ్బందనే వృత్తి ధర్మం గురించి కూడా ఆలోచించలేదు దీపిక. ఇకపై సౌత్ సినిమాలు ఆమె వైపు చూడకపోవచ్చు.
