వైసీపీలో ఇంత వ్యతిరేకతను జగన్ ఊహించారా !?

పదవులు రాలేదని అసంతృప్తికి గురి కావడం వేరు… నిర్ణయాల పట్ల అసంతృప్తికి గురి కావడం వేరు రాజకీయ పార్టీల్లో పార్టీ అధినేత తీసుకునే నిర్ణయాలపై అసహనం పెద్దగా కనిపించదు. వైసీపీలో అసలు కనిపించదు. ఎంతటి దారుణమైన నిర్ణయం తీసుకున్నా అందరూ సమర్థిస్తారు. చివరికి మూడు రాజధానుల నిర్ణయాన్ని వ్యతిరేకించలేక సమర్థించారు. ఇష్టం లేని వాళ్లు ఊరుకున్నారు. కానీ అలాంటి నిర్ణయాలు రాను రాను పెరిగిపోతూండటంతో వారిలోనూ అసహనం పెరుగుతోంది. బహిరంగంగానే వ్యతిరేకిస్తున్నారు.

ఎన్టీఆర్ హెల్త్ వర్శిటీ పేరు మార్చి వైఎస్ఆర్ పేరు పెట్టడంపై వైసీపీలోనే అసంతృప్తి వ్యక్తమయింది. సోషల్ మీడియాలో ఆ పార్టీని హార్డ్ కోర్‌గా అభిమానించేవారే తుగ్లక్ నిర్ణయంగా తేల్చేశారు. పార్టీ ద్వితీయ శ్రేణి నేతల్లో నిరాశ కనిపించింది. ఎందుకిలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారనే నిర్వేదమూ కనిపించింది. అధికారం పోతే పరిస్థితి ఏమిటన్న ఆందోళన ఎక్కువ మందిలో కనిపించింది. ఈ సారి విషయం ఏమిటంటే చాలా మంది తమ అభిప్రాయాలను బహిరంగంగా వ్యక్తం చేశారు.

ఏ పార్టీ అయినా ప్రభుత్వం అయినా పూర్తి స్థాయిలో ప్రజల అభిప్రాయం తెలుసుకునే ప్రయత్నం చేస్తుంది. మొదట లీకుల ద్వారా మీడియాలో ప్రచారం చేసి అయినా స్పందన ఎలా ఉంటుందో తెలుసుకుని ముందుకెళ్తుంది. కానీ ఈ ప్రభుత్వం ప్రజలు తమకు అధికారం ఇచ్చారు కాబట్టి ఏదైనా చేయవచ్చని ముందుకెళ్తోంది. ఇది అందర్నీ నిరాశకు గురి చేస్తోంది. పైసా ప్రయోజనం లేని నిర్ణయాల వల్ల మొదటికే మోసం వస్తుందని గందరగోళపడుతున్నారు. ఇలాంటి అభిప్రాయాలను తెలుసుకునే తీరిక వైసీపీ నేతలకు లేకుండా పోయింది. రేపు పార్టీ కోసం పని చేయాల్సింది వాళ్లేనని ఇప్పటికీ వైసీపీ హైకమాండ్ గుర్తించలేకపోతోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

సూప‌ర్ స్టార్ బ‌ర్త్‌డేని టార్గెట్ చేసిన సుధీర్ బాబు

మే 31... సూప‌ర్ స్టార్ కృష్ణ పుట్టిన రోజు. ఈ సంద‌ర్భంగా మ‌హేష్ బాబు - రాజ‌మౌళి కాంబోలో రాబోయే సినిమాకు సంబంధించిన అప్ డేట్ ఏమైనా వ‌స్తుందా? అని మ‌హేష్...

జేడీ లక్ష్మినారాయణకు ప్రాణహాని – ఎవరి పని ?

సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మినారాయణ తనకు ప్రాణహాని ఉందని విశాఖ సీపీ రవిశంకర్ అయ్యన్నార్ కు ఫిర్యాదు చేశారు. ఇంత కాలం నిర్భయంగా తిరిగిన ఆయనకు హఠాత్తుగా ప్రాణభయం ఏర్పడటానికి...

వైసీపీలో చేరి అన్నీ పోగొట్టుకుని బయటకు వచ్చిన డొక్కా !

ఆయన ప్రముఖ దళిత నేత. కాంగ్రెస్ నుంచి రాజకీయాల్లోకి వచ్చారు. రాయపాటి సాంబశివరావు రాజకీయాల్లోకి తీసుకు వచ్చారు. వైఎస్ఆర్ ప్రోత్సహించారు. ఆయనకు మంత్రి పదవి కూడా ఇచ్చారు. ఆయన చనిపోయిన తర్వాత...

ఎక్స్ క్లూజీవ్‌: బెల్లంకొండ రూ.50 కోట్ల సినిమా

బెల్లంకొండ శ్రీ‌నివాస్ ఇప్పుడు ఫుల్ జోష్ లో ఉన్నాడు. త‌ను హీరోగా చేస్తున్న `టైస‌న్ నాయుడు` సెట్స్‌పై ఉంది. 'చావు క‌బురు చ‌ల్ల‌గా' ద‌ర్శ‌కుడితో 'కిష్కింద పురి' అనే ఓ సినిమా చేస్తున్నాడు....

HOT NEWS

css.php
[X] Close
[X] Close