‘మంచు’ ఆస్తి పంప‌కాలు

మంచు మోహన్ బాబు త‌న వార‌సుల‌కు ఆస్తిని పంచేశారా? ఎవ‌రి వాటా వాళ్ల‌కు సెటిల్ చేసేశారా? అవున‌నే అంటున్నాయి టాలీవుడ్ వ‌ర్గాలు. ఈరోజు ఉద‌యం మోహ‌న్‌బాబు రిజిస్ట్రేష‌న్ ప‌నిమీద షాద్ న‌గ‌క్‌ వెళ్లారు. అక్క‌డ ఆయ‌న‌కు కొన్ని విలువైన ఆస్తులున్నాయి. అవ‌న్నీ త‌న ఇద్ద‌రు కొడుకుల పేర్లు మీద బ‌ద‌లాయించార‌ని టాక్‌. మోహ‌న్ బాబు.. ఆస్తిని పంచ‌డం ఇదే తొలిసారి కాదు. ఇది వ‌ర‌కు త‌న ఆస్తుల్ని త‌న ముగ్గురు పిల్ల‌ల‌కు రాసిచ్చారు. ఫిల్మ్‌న‌గ‌ర్‌లో మోహ‌న్ బాబుకి ఓ ఇల్లు ఉంది. అది కుమార్తె మంచు ల‌క్ష్మికి రాసిచ్చారు. తిరుప‌తిలో ఉన్న ఆస్తుల్ని విష్ణుకి ఇచ్చారు. హైద‌రాబాద్ శివార్ల‌లో ఉన్న ఫ్లాటుని మ‌నోజ్ పేరు మీద బ‌ద‌లాయించారు. అప్ప‌టికీ మోహ‌న్ బాబు పేరుమీద ఇంకొన్ని ఆస్తులు మిగిలాయి. వాటిని ఇప్పుడు క్లియ‌ర్ చేసిన‌ట్టు తెలుస్తోంది. ఆమ‌ధ్య విష్ణు, మ‌నోజ్‌ల మ‌ధ్య గ‌లాటా జ‌రిగింది. మీడియాకు మ‌నోజ్ స్వ‌యంగా కొన్ని లీకులు అందించారు. ఆ విష‌యాన్ని ఆ త‌ర‌వాత రియాలిటీ షో పేరుతో క‌ప్పిపుచ్చాల‌ని చూశారు. కానీ.. కుద‌ర్లేదు. ఆ వివాదాల వ‌ల్లే.. మోహ‌న్ బాబు ఇప్పుడు త‌న వార‌సుల‌కు ఆస్తి పంచి ఫైన‌ల్ సెటిల్‌మెంట్ చేశార‌ని తెలుస్తోంది. కొస‌రు విష‌యం ఏమిటంటే… షాద్ న‌గ‌ర్‌ రిజిస్ట్రేష‌న్ కార్యాల‌యం ద‌గ్గ‌ర టీవీ ఛాన‌ళ్లు చుట్టిముడితే వాళ్ల మీద మోహ‌న్ బాబు ఫైర్ అయ్యారు. బుద్ది లేదా? మీ ఉద్యోగాలు ఊడ‌పీకుతా.. అంటూ ప‌రుషంగా మాట్లాడారు. అస‌లు విష‌యం ఎక్క‌డ చెప్పాల్సివ‌స్తుందో అని మోహ‌న్‌బాబు అక్క‌డ రివ‌ర్స్ గేర్‌లో వెళ్లి మీడియా ముందు ముందే ఫైర్ అయ్యార‌న్న గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రేవంత్ ను కలిసిన రోహిత్ వేముల తల్లి..కేసు రీఓపెన్ కు హామీ

హెచ్ సీ యూ విద్యార్ధి రోహిత్ వేముల ఆత్మహత్యకు ఎవరూ కారణం కాదని, ఈ కేసును ఇంతటితో మూసివేస్తున్నట్లు హైకోర్టు ప్రకటించడంతో తాజాగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు రోహిత్...

అనంత శ్రీ‌రామ్ పై బాల‌య్య ఫ్యాన్స్ ఫైర్‌

టాలీవుడ్ లో పేరున్న గీత ర‌చ‌యిత‌... అనంత శ్రీ‌రామ్‌. ఇప్పుడు ఈయ‌న‌కు కూడా రాజ‌కీయం బాగానే వంటబ‌ట్టింద‌నిపిస్తోంది. అప్పుడ‌ప్పుడూ కొన్ని పొలిటిక‌ల్ సెటైర్ల‌తో క‌వ్వించ‌డం అనంత శ్రీ‌రామ్‌కు అల‌వాటే. తాజాగా ఆయ‌న చేసిన...

య‌శ్ స‌ర‌స‌న న‌య‌న‌తార‌

'కేజీఎఫ్`తో య‌శ్ పాన్ ఇండియా హీరో అయిపోయాడు. 'కేజీఎఫ్‌' త‌ర‌వాత య‌శ్ ఎలాంటి సినిమా చేయ‌బోతున్నాడా? అని దేశ‌మంతా ఆస‌క్తిగా ఎదురు చూస్తోంది. ఈ నేప‌థ్యంలో గీతు మోహ‌న్ దాస్ ద‌ర్శ‌క‌త్వంలో న‌టించ‌డానికి...

శింగనమల రివ్యూ : కాంగ్రెస్ రేసులో ఉన్న ఒకే ఒక్క అసెంబ్లీ నియోజకవర్గం !

అనంతపురం జిల్లా శింగనమల నియోజకవర్గం అందర్నీ ఆకర్షిస్తోంది. ఈ సారి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ రేసులో ఉందని చెప్పుకుంటున్న ఒకే ఒక్క నియోజకవర్గం శింగనమల. మాజీ మంత్రి శైలజానాథ్ గతంలో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close