జగన్‌ కోర్టుకు హాజరు కావాల్సిందే..! ఈడీదీ అదే వాదన..!

జగన్మోహన్ రెడ్డి సీబీఐ కేసులు మాత్రమే కాదు.. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టరేట్ కేసులు కూడా ఎదుర్కొంటున్నారు. ఆ కేసుల విచారణ కూడా సీబీఐ కోర్టులోనే సమాంతరంగా జరుగుతోంది. గతంలో సీబీఐ విచారణకు వ్యక్తిగత మినహాయింపు అడిగిన జగన్‌కు చుక్కెదురు అయింది. ఇప్పుడు.. ఈడీ కేసుల్లో విచారణకు వ్యక్తిగత హాజరు మినహాయింపు కోసం పిటిషన్ వేసుకున్నారు. దీనిపై వాదనలు ముగిశాయి. కోర్టు తీర్పును ఈ నెల ఇరవై నాలుగో తేదీకి వాయిదా వేసింది. ఈడీ కూడా.. జగన్‌కు ఎట్టి పరిస్థితుల్లోనూ.. హాజరు మినహాయింపు ఇవ్వవొద్దని ఆదేశించింది.

అక్రమాస్తుల కేసులో జగన్మోహన్ రెడ్డి చాలా రోజుల తర్వాత సీబీఐ కోర్టుకు హాజరయ్యారు. ఆయనతో పాటు ఇతర నిందితులంతా హాజరయ్యారు. పదిన్నర సమయంలో కోర్టుకు వచ్చిన జగన్.. దాదాపుగా రెండు గంటలు.. నిందితులు కూర్చునే చోట కూర్చున్నారు. అటెండర్ హాజరీ కోసం అరిచినప్పుడు తాను వచ్చినట్లుగా సంకేతం పంపారు. విచారణ జరిగినంత సేపు ఆయన సైలెంట్ గానే ఉన్నారు. తదుపరి విచారణ పదిహేడో తేదీకి వాయిదా పడటంతో.. అక్కడ్నుంచి నేరుగా.. బేగంపేట వెళ్లారు. అక్కడ్నుంచి ప్రత్యేక విమానంలో అమరావతి చేరుకున్నారు.

కోర్టు.. పెన్నా సిమెంట్ అనుబంధ చార్జీషీట్‌ను.. పరిగణనలోకి తీసుకుంది. దీన్ని పరిగణనలోకి తీసుకోవద్దని… జగన్ తో పాటు ఇతర నిందితులు దాఖలు చేసిన పిటిషన్‌ను కోర్టు కొట్టి వేసింది. ఇందులో నిందితులుగా ఉన్న.. జగన్ తో పాటు బొత్స, ధర్మాన సహా ఇతరులకు సమన్లు జారీ చేసింది. అందరూ ఈ నెల పదిహేడో తేదీన మళ్లీ హాజరు కావాల్సి ఉంది. జగన్మోహన్ రెడ్డి కోర్టు హాజరు నుంచి తప్పించుకోలేని పరిస్థితుల్లో పడ్డారని న్యాయనిపుణులు చెబుతున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

స్మూత్ గా ఓట్ల బదిలీ ఖాయం – ఫలించిన కూటమి వ్యూహం !

ఏపీలో ఎన్డీఏ కూటమి మధ్య ఓట్ల బదిలీ సాఫీగా సాగిపోయే వాతావరణం కనిపిస్తోది. ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ, బీజేపీ, జనసేన కలిసి పోటీ చేయాలని అనుకున్నప్పుడు చాలా మంది ఓటు బదిలీపై...

బెట్టింగ్ రాయుళ్ల టార్గెట్ ప‌వ‌న్‌!

ఏపీ మొత్తానికి అత్యంత ఫోక‌స్ తెచ్చుకొన్న నియోజ‌క వ‌ర్గం పిఠాపురం. ప‌వ‌న్ క‌ల్యాణ్ అక్క‌డి నుంచి పోటీ చేయ‌డంతో పిఠాపురం ఒక్క‌సారిగా టాక్ ఆఫ్ ఏపీ పాలిటిక్స్ అయ్యింది. గ‌త ఎన్నిక‌ల్లో భీమ‌వ‌రం,...

ప్రధాని రేసులో ఉన్నా : కేసీఆర్

ముఖ్యమంత్రి పదవి పోతే పోయింది ప్రధానమంత్రి పదవి కోసం పోటీ పడతానని కేసీఆర్ అంటున్నారు. బస్సు యాత్రతో చేసిన ఎన్నికల ప్రచారం ముగియడంతో .. తెలంగాణ భవన్ లో మీడియాతో మాట్లాడారు. ఈ...

ఎక్స్ క్లూజీవ్‌: ర‌ణ‌వీర్‌, ప్ర‌శాంత్ వ‌ర్మ‌… ‘బ్ర‌హ్మ‌రాక్ష‌స‌’

'హ‌నుమాన్' త‌రువాత ప్ర‌శాంత్ వ‌ర్మ రేంజ్ పెరిగిపోయింది. ఆయ‌న కోసం బాలీవుడ్ హీరోలు, అక్కడి నిర్మాణ సంస్థ‌లు ఎదురు చూపుల్లో ప‌డిపోయేంత సీన్ క్రియేట్ అయ్యింది. ర‌ణ‌వీర్ సింగ్ తో ప్ర‌శాంత్ వ‌ర్మ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close