అమరావతి నిర్మాణానికి అన్నీ రెడీ

అమరావతి శంఖుస్థాపన కార్యక్రమం సజావుగా పూర్తయిపోయింది. కనుక తరువాత ఏమిటి? అనే ప్రశ్నకు రాజధాని నిర్మాణమే అని జవాబు చెప్పుకోవలసి ఉంటుంది. అమరావతి నిర్మాణం పూర్తి కావడానికి కనీసం పదేళ్ళు పడుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అంచనా వేశారు. మొట్టమొదటగా అమరావతి సీడ్ క్యాపిటల్ నిర్మాణ పనులను ఆరంభించడానికి ప్రభుత్వం కసరత్తు మొదలుపెట్టింది. చంద్రబాబు నాయుడు శుక్రవారం సాయంత్రం విజయవాడలో తన క్యాంప్ కార్యాలయంలో రాజధాని కమిటీ సభ్యులతో సమావేశమయ్యి సీడ్ క్యాపిటల్ నిర్మాణ కార్యక్రమాలు మొదలుపెట్టేందుకు తీసుకోవలసిన చర్యల గురించి చర్చించారు.

ఇప్పటికే అన్ని అనుమతులు లభించాయి. కేంద్రం ఇచ్చిన నిధులు కొంచెం చేతిలో ఉన్నాయి. మాష్టర్ ప్లాన్ సిద్దంగా ఉంది. భూమి కూడా సిద్దంగా ఉంది. రాజధాని నిర్మాణానికి అవసరమయిన నిధులు సమకూర్చి నిర్మాణ కార్యక్రమాలు చేప్పట్టడానికి జపాన్ సిద్దంగా ఉంది. రాజధాని నిర్మాణం కోసం అన్ని విధాల సహకరించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్దంగా ఉంది. కేంద్ర ప్రభుత్వంలో పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా ఉన్న ఎం.వెంకయ్యనాయుడు రాజధాని నిర్మాణానికి తన శాఖ తరపున సహకరించేందుకు సిద్దంగా ఉన్నారు. ఇంకా కేంద్రంలో మంత్రులుగా ఉన్న రాష్ట్రానికి చెందిన నిర్మలా సీతారామన్, అశోక్ గజపతి రాజు, సుజనా చౌదరి, తెలంగాణాకు చెందిన బండారు దత్తాత్రేయ రాజధాని నిర్మాణానికి అన్ని విధాల సహాయసహకారాలు అందించేందుకు సిద్దంగా ఉన్నారు. అదీగాక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి దాదాపు కేంద్రమంత్రులు అందరితో చాలా సత్సంబంధాలున్నాయి కనుక వారిలో పీయూష్ గోయల్, ఉమా భారతి, స్మృతీ ఇరానీ వంటి వారు చాలా మంది రాజధాని నిర్మాణానికి సహకరించేందుకు సిద్దంగా ఉన్నారు. బహుశః ఇంత సానుకూల పరిస్థితులు ఎప్పడూ చూసి ఉండము. కనుక త్వరలోనే రాజధాని నిర్మాణ పనులు చాలా పెద్ద ఎత్తున మొదలయ్యే అవకాశం కనబడుతోంది.

జపాన్ దేశం అత్యాధునిక యంత్ర పరికరాలతో, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రాజధాని నిర్మాణం చేప్పట్టబోతోంది. జపాన్ దేశంపై అమెరికా అణ్వస్త్ర దాడి చేసినప్పటి నుండి నేటి వరకు వచ్చిన అనేక ప్రకృతి విపత్తులను ఎదుర్కొని అనేకసార్లు అనేక నగరాలను మెరుపు వేగంతో పునర్నిర్మించుకొన్న అనుభవం ఉందని ఆ దేశం తరపున శంఖుస్థాపన కార్యక్రమానికి హాజరయిన జపాన్ మంత్రి తన ప్రసంగంలో పేర్కొన్నారు. కనుక అమరావతి నిర్మాణ పనులు కూడా వేగంగా జరుగవచ్చును. వచ్చే శీతాకాల శాసనసభా సమావేశాలను అమరావతిలోనే నిర్వహించాలని నిర్ణయం జరిగింది కనుక ముందుగా తాత్కాలిక శాసనసభ భవనాల నిర్మాణం మొదలుపెట్టవచ్చును.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఢిల్లీకి చిరు.. రేపే ప‌ద్మ ప్ర‌దానం

మెగాస్టార్‌ చిరంజీవిని ఇటీవ‌ల ప‌ద్మ విభూష‌ణ్ పుర‌స్కారం వ‌రించిన సంగ‌తి తెలిసిందే. ఈ పుర‌స్కార ప్ర‌దానోత్స‌వం రేపు ఢిల్లీలో జ‌ర‌గ‌బోతోంది. ఈ సంద‌ర్భంగా చిరు ఢిల్లీ బ‌య‌ల్దేరారు. ఆయ‌న‌తో పాటుగా సురేఖ‌, రామ్...

విదేశాలకు వెళ్తా… కోర్టు అనుమతి కోరిన జగన్

విదేశాలకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని సీబీఐ కోర్టును కోరారు ఏపీ సీఎం జగన్. లండన్ వెళ్లేందుకు పర్మిషన్ ఇవ్వాలని కోరారు. ఈ నెల 17 నుంచి జూన్ 1 మధ్య విదేశాలకు వెళ్లేందుకు...

వైన్స్ బంద్… ఆ ఒక్క షాప్ మాత్రం ఓపెన్

తెలంగాణలో లోక్ సభ ఎన్నికల పోరు తుది అంకానికి చేరుకుంది. మరో మూడు రోజుల్లో ప్రచార పర్వం ముగియనున్న నేపథ్యంలో రాష్ట్రమంతటా మద్యం దుకాణాలు రెండు రోజులపాటు మూతబడనున్నాయి. ఈ నెల 11న...

పోలింగ్ ముగిసిన తర్వాత ఫ్యామిలీతో విదేశాలకు జగన్

పోలింగ్ ముగిసిన వెంటనే విదేశీ పర్యటనకు వెళ్లాలని జగన్ నిర్ణయించుకున్నారు. పదమూడో తేదీన పోలింగ్ ముగుస్తుంది. ఆ తర్వాత లెక్కలు చూసుకుని పదిహేడో తేదీన విమానం ఎక్కాలనుకుంటున్నారు. ఈ మేరకు ఇప్పటికే...

HOT NEWS

css.php
[X] Close
[X] Close