బీఆర్ఎస్ రుణమాఫీ హామీని మర్చిపోని రైతులు !

భారత రాష్ట్ర సమితి తెలంగాణ దశాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తోంది. వందల కోట్లు ఖర్చు పెట్టి మరీ ఊరూవాడా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా రైతులకు రైతు వేదికల వద్ద విందు సమావేశాలు నిర్వహిస్తున్నారు. అయితే చాలా చోట్ల… రైతుల నుంచి ప్రభుత్వానికి మంత్రులకు ఎదురైన ప్రశ్న రుణమాఫీ. రుణమాఫీ ఎందుకు చేయడం లేదని ప్రశ్నించారు. ఇలాంటి ప్రశ్నలకు సమాధానం చెప్పలేరు పాలేరు ఎమ్మెల్యే ఉపేందర్ రెడ్డి .. విందు భోజనాల్లో మధ్యలోనే వెళ్లిపోయారు.

గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ రూ. రెండు లక్షల రుణమాఫీ హామీ ఇచ్చింది. బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిగా రూ. లక్ష ఏక మొత్తంలో రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చింది. అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తిగా మర్చిపోయారు. ఇటీవల రుణమాఫీ చేస్తామని.. చెప్పినప్పటికీ.. కొంత మంది ఖాతాల్లో రూ. పాతిక వేల వరకూ జమ చేశారు కానీ..అత్యధిక మందికి రుణమాఫీ అమలు కాలేదు. దీనిపై రైతులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు.

ఇతర పథకాల పేరుతో రుణమాఫీ హామీని మర్చిపోయేలా చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. కానీ ఎన్నికలు అంటే.. గతంలో కేసీఆర్ ఇచ్చిన హామీలే గుర్తుకు వస్తాయి. అందుకే రైతులకు సంబంధించిన కార్యక్రమాల్లో ఎక్కువగా ఈ అమలు కాని హామీల ప్రస్తావన వస్తోంది. ఈ హామీ విషయంలో రైతుల్లో ఉండే అసంతృప్తిని కేసీఆర్ ఎలా అధిగమిస్తారో కానీ.. ఇప్పుటికే వివిద రూపాల్లో రైతాంగంలో పెరిగిపోయిన అసంతృప్తికి ఇది కూడా తోడైతే.. కేసీఆర్ గట్టి ఓటు బ్యాంకును కోల్పోతారన్న అభిప్రాయం వినిపిస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

నాలుగైదు సినిమాలకు అడ్వాన్సులు – గెలిచినా పవన్ బిజీనే !

పవన్ కల్యాణ్ ఎన్నికల తర్వాత కూడా తీరిక లేకుండా ఉంటారు. అయితే రాజకీయాలతో కాదు. సినిమాలతో. పవన్ కల్యాణ్ పిఠాపురంలో నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా తన ఆస్తులు,...

మేనిఫెస్టో మోసాలు : చేసింది జలయజ్ఞం కాదు జలభగ్నం !

వైఎస్ఆర్ జలయజ్ఞం.. వైఎస్ఆర్ కలలు కన్నారు. ఆ యజ్ఞాన్ని పూర్తి చేస్తాం. పోలవరం, వెలిగొండ యుద్ధప్రాతిపదికన పూర్తి చేస్తాం. రక్షిత మంచినీరు, సాగునీరు కల నిజం చేస్తాం. చెరువులను పునరుద్ధరిస్తాం .. జలకళను...

కాంగ్రెస్ కు అడ్వాంటేజ్ గా హరీష్ రావు సవాళ్ళు..!?

బీఆర్ఎస్ అధికారం కోల్పోయాక అటు కేసీఆర్, ఇటు హరీష్ రావు రాజకీయ వ్యూహాలు తేలిపోతున్నాయి. ప్రత్యర్ధులను కట్టడి చేసేందుకు చేస్తోన్న వ్యాఖ్యలు బీఆర్ఎస్ కు మేలు చేయకపోగా...అధికార కాంగ్రెస్ కు ఫేవర్ చేసేలా...

ఎడిటర్స్ కామెంట్ : ఆన్ లైన్ ఎలక్షన్స్ !

ఇండియాలో కేజీ బియ్యం రూ. వంద పలుకుతుంది కానీ ఒక్క జీబీ డేటా మాత్రం ఐదు రూపాయలకే వస్తుంది. మీరు సమయం అంతా యూట్యూబ్ వీడియోలు.. సోషల్ మీడియా మీదే గడపుతామంటే...

HOT NEWS

css.php
[X] Close
[X] Close