సునందా పుష్కర్ మృతి కేసులో కొత్త ట్విస్ట్

కాంగ్రెస్ నేత శశి ధరూర్ భార్య సునంద పుష్కర్ గత ఏడాది జనవరి 17న ఢిల్లీలోని లీలా హోటల్ లో అనుమానాస్పద రీతిలో మరణించిన సంగతి తెలిసిందే. సునంద పుష్కర్ ఆత్మహత్య చేసుకొన్నారని మొదట పోలీసులు భావించారు. కానీ డిల్లీలోని ఎయిమ్స్ వైద్యులు ఇచ్చిన పోస్టుమార్టం నివేదికలో ఆమెపై ‘పొలోనియం’ అనే రేడియో ధార్మిక పదార్థం ప్రయోగించబడిందని చెప్పడంతో దానిని హత్యకేసుగా పరిగణించి దర్యాప్తు చేస్తున్నారు. ఈ మిస్టరీని చేదించేందుకు వారు అమెరికాకు చెందిన ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (ఎఫ్.బి.ఐ.) సహాయం కోరారు.

ఎయిమ్స్ వైద్యులు ఇచ్చిన పోస్టుమార్టం నివేదికను ఎఫ్.బి.ఐ.కి పంపించి దానిపై వారి అభిప్రాయం కోరారు. సుమారు తొమ్మిది నెలల తరువాత ఆ నివేదిక నిన్న డిల్లీ పోలీసులకి అందింది. అందులో చాలా ఆశ్చర్యకరమయిన విషయం బయటపడింది. సునంద పుష్కర్ సునంద మృతికి పొలోనియం కారణం కాదని ఎఫ్.బి.ఐ. తన నివేదికలో పేర్కొంది. కానీ ఆమె ఏవిధంగా మృతి చెందారనే విషయంపై ఎఫ్.బి.ఐ. తన నివేదికలో ఏమి చెప్పింది? అనే విషయం మాత్రం ఇంకా బయటకు రాలేదు. కనుక సునందా పుష్కర్ ని ఎవరయినా హత్య చేసారా లేక ఆమె ఆత్మహత్య చేసుకొన్నారా? అనే అనుమానం కలుగుతోంది.

ఈ కేసును దర్యాప్తు చేస్తున్న ఢిల్లీ పోలీస్ కమిషనర్ బిఎస్ బాసీ మీడియాతో మాట్లాడుతూ “త్వరలోనే ఈ కేసుకు సంబంధించిన మరి కొన్ని నిజాలు తెలుస్తాయి’ అని మాత్రమే చెప్పారు. సునంద పుష్కర్ దేశ విదేశాలలో చాలా పలుకుబడి ఉన్న కాంగ్రెస్ నేత శశి ధరూర్ భార్య కావడంతో, ఆమె హత్యను ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు ప్రయత్నాలు సాగుతున్నాయా? అనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

పాల్ గారి పార్టీ టిక్కెట్ కోసం రూ. 50 లక్షలు ఇచ్చాడట !

సమాజంలో కొన్ని వింతలు జరగుతూ ఉంటాయి. నమ్మాలా వద్దో తేల్చుకోలేము. కేఏ పాల్ ఎల్బీ నగర్ టిక్కెట్ ఇస్తానంటే రూ. 50 లక్షలు పాల్ కు ఇచ్చేశాడట. చివరికి పాల్ టిక్కెట్ ఇవ్వలేదని...

“ఈ ఆఫీస్” భద్రం – స్పందించిన ఈసీ

ఏపీ ప్రభుత్వం జీవోలను అన్నీ దాచిన ఈ ఆఫీస్ ను అప్ గ్రేడేషన్ పేరతో సమూలంగా మాల్చాలనుకున్న ఏపీ ప్రభుత్వానికి ఈసీ చెక్ పెట్టింది. ఈ ఆఫీస్ అప్ గ్రేడేషన్ పేరుతో...

విజయ్ సేతుపతి నుంచి ఓ వెరైటీ సినిమా

హీరోగానే కాకుండా ప్రతి నాయకుడిగానూ కనిపించి ప్రేక్షకుల ఆదరణ సొంతం చేసుకున్న విలక్షణ నటుడు విజయ్‌ సేతుపతి. హీరోయిజం లెక్కలు వేసుకోకుండా పాత్రలకు ప్రాధాన్యత ఇస్తూ ఆయన ప్రయాణం సాగుతోంది. ఇదే ఆయన్ని...

చంద్రముఖి కన్నా ఘోరం… ఆర్ఎస్పీ పై సోషల్ మీడియా ఫైర్

ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ అయి తీహార్ జైల్లోనున్న ఎమ్మెల్సీ కవితను కలిసిన బీఆర్ఎస్ నేత ఆర్ఎస్. ప్రవీణ్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలపై విమర్శలు వస్తున్నాయి. ఢిల్లీ లిక్కర్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close