గంటా మళ్లీ సీటు మారడం ఖాయమేనా..?

“ఎంపీగా పోటీ చేయాలా..? ఎమ్మెల్యేగా పోటీ చేయాలా అనేది.. హైకమాండ్ నిర్ణయిస్తుంది..” ఇది మంత్రి గంటా శ్రీనివాసరావు మాట. ఆ తర్వాత భీమిలిలో కార్యకర్తల సమావేశం పెట్టి… దమ్ముంటే.. జగన్ భీమిలీలో తనపై పోటీ చేయాలని… సవాల్ చేశారు. రెండూ పరస్పర విరుద్ధమైనవే అయినప్పటికీ.. ఓ సారి పోటీ చేసిన సీటు నుంచి రెండో సారి పోటీ చేయడం అన్నది గంటా హిస్టరీలో లేదు. అందుకే.. ఈ సారి గంటా.,.. భీమిలీలో పోటీలో ఉంటారా.. లేదా అన్నది.. ఆసక్తికరంగా మారింది. దానికి తగ్గట్లుగా… ఆయన ఎంపీగా పోటీ చేయాలా.. ఎమ్మెల్యేగా పోటీ చేయాలా..అన్నది హైకమాండ్ నిర్ణయం అంటూ… ప్రకటనలు చేస్తున్నారు.

నిజానికి గంటా పేరు.. విజయనగరం జిల్లాలోని నెల్లిమర్ల అసెబ్లీ నియోజకవర్గం నుంచి ప్రచారంలోకి వచ్చింది. ఇటీవలి కాలంలో ఆయన అక్కడ చాలా కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. కొన్నాళ్ల క్రితం.. ఆంధ్రజ్యోతి దినపత్రిక.. ఓ సర్వేను ప్రకటించింది. అందులో గంటా వెనుకబడి ఉన్నారని వెల్లడించారు. ఈ సర్వేపై అప్పట్లో ఆయన అగ్గిమీద గుగ్గిలం అయ్యారు. హైకమాండ్ పై అలిగారు కూడా. కానీ తర్వాత బుజ్జగించారు. గంటా శ్రీనివాసరావు 1999లో తెలుగుదేశం పార్టీ నుంచి రాజకీయ ఆరంగేట్రం చేశారు. ఇప్పటి వరకు ఎక్కడా ఓటమిని చవి చూడలేదు. ప్రతిఎన్నికల్లోనూ గెలుస్తునే ఉన్నారు. అయితే ప్రతీసారి కొత్త చోట పోటీ చేస్తున్నారు. 1999 లో అనకాపల్లి ఎంపిగా గెలిచారు. ఆ తర్వాత 2004 లో ఆదే పార్టీ తరుపున చోడవరం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుపొందారు. 2009 లో ప్రజారాజ్యం తరుపున అనకాపల్లి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచారు. రాష్ట్ర విభజన నేపధ్యంలో ఆయన మళ్లీ తెలుగుదేశం పార్టీలోకి వచ్చి 2014 భీమిలి అసెంబ్లీ నియోజక వర్గం పోటీ చేసి విజయసాధించి, ప్రసుత్తం చంద్రబాబు కేబినేట్ లో మానవవనరుల శాఖా మంత్రిగా పనిచేస్తున్నారు. ఎంపిగా పోటీచేసినా, ఎమ్మెల్యేగా పోటీ చేసినా ఎప్పుడు ఓటమిని ఎరుగని నేతగా గుర్తింపు తెచ్చుకున్నారు.

భీమిలి నుంచి గతంలో ఎమ్మెల్యేగా గెలిచిన సహచరుడు.. అవంతి ప్రస్తుతం ప్రత్యర్థిగా ఉన్నారు. భీమిలీ నియోజకవర్గంలో టిడిపి చాలా బలంగా ఉంది.. కానీ గంటా అనే సరికి కాస్తా తడబాటు ఉందని జోరు ప్రచారం జరుగుతోంది. ఇదే విషయాన్ని మంత్రి గంటా శ్రీనివాసరావు గ్రహించినట్లే కనిపిస్తోంది. అందుకే ఎంపి స్థానానికి పోటీ చేయడానికైనా రెడీ అంటూ సంకేతాలు ఇస్తున్నారు. మొన్నటి వరకు భీమిలి అసెంబ్లీ నియోజక వర్గం నుంచే పోటీ చేస్తానని పట్టుబట్టిన గంటా ఇప్పుడు పట్టువిడుపులు ప్రదర్శిస్తున్నారు. ఎప్పుడు గంటా నోటా పార్లమెంట్ నుంచి పోటీ చేస్తానన్న మాట రాలేదు…కానీ హఠాత్తుగా ఎంపి స్థానం అనే మాట వినబడుతోంది. అందుకే గంటా ఈ సారి సీటు మారొచ్చన్న ప్రచారం జరుగుతోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

జగన్ ఎంత మాట్లాడితే షర్మిలకు అంత మేలు !

వైఎస్ వారసులు ఎవరు ?. ఈ విషయంలో ప్రజలు తేల్చుకోవాల్సిందేనని జగన్మోహన్ రెడ్డి చెబుతున్నారు. పులివెందులలో సభ పెట్టి వారసత్వం గురించే మాట్లాడారు. ఇప్పటి వరకూ ప్రజలు ఆయనకే...

సికింద్రాబాద్ లో ఎవరిదీ పైచేయి..?

సికింద్రాబాద్ లోక్ సభ సెగ్మెంట్ లెక్కలు మారుతున్నాయా..? సికింద్రాబాద్ సిట్టింగ్ ఎంపీ కిషన్ రెడ్డికి ఝలక్ తప్పదా..? కేసీఆర్ చెప్పినట్టుగానే సికింద్రాబాద్ లో బీఆర్ఎస్ అభ్యర్థి పద్మారావు ముందంజలో ఉన్నారా..? బలమైన అభ్యర్థిగా...

ఏపీకి ప్రధాని మోడీ…షెడ్యూల్ ఇదే

ప్రధాని మోడీ ఏపీ ఎన్నికల పర్యటన ఖరారు అయింది.మే 3, 4తేదీలలో మోడీ ఏపీలో పర్యటించనున్నారు. 3న పీలేరు, విజయవాడలో పర్యటించనున్నారు. 4న రాజమండ్రి, అనకాపల్లిలో ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు మోడీ. 3న...

నాలుగైదు సినిమాలకు అడ్వాన్సులు – గెలిచినా పవన్ బిజీనే !

పవన్ కల్యాణ్ ఎన్నికల తర్వాత కూడా తీరిక లేకుండా ఉంటారు. అయితే రాజకీయాలతో కాదు. సినిమాలతో. పవన్ కల్యాణ్ పిఠాపురంలో నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా తన ఆస్తులు,...

HOT NEWS

css.php
[X] Close
[X] Close