కృష్ణంరాజు అప్పటి వ్యాఖ్యల మర్మం ఇదేనా?

సాహో సినిమా విడుదల కోసం అత్యంత ఆత్రుతగా ఎదురు చూసిన ప్రేక్షకులకు, ఇవాళ విడుదలైన సినిమా భారీ గా షాక్ ఇచ్చింది. అయితే ఇప్పుడు సినిమా విడుదలయ్యాక – విడుదలకు ముందు ఈ సినిమా గురించి వివిధ వ్యక్తులు మాట్లాడిన మాటలను ప్రేక్షకులు విశ్లేషించుకుంటూ ఉన్నారు. ఈ క్రమంలో సాహో విడుదలకు ముందు కృష్ణంరాజు మాట్లాడిన వ్యాఖ్యలను గుర్తు తెచ్చుకుంటూ అప్పుడు ఆయన మాట్లాడిన వ్యాఖ్యల మర్మం ఇదా అని చర్చించుకుంటున్నారు.

వివరాల్లోకి వెళితే, సాహో విడుదలకు ముందు ఫంక్షన్లో కృష్ణంరాజు మాట్లాడుతూ, ” ఎంతో భారీ బడ్జెట్ తో నిర్మించిన ఈ సినిమా అటు ఇటు అయితే పరిస్థితి ఏంటి అనే అనుమానం సినిమా కి పనిచేసిన వాళ్ళలో కొంతమంది లో కనిపించిందని, అయితే తన అపార అనుభవంతో, ఈ సినిమా కచ్చితంగా విజయం సాధిస్తుందని తాను ఘంటాపధంగా చెప్పగలను అని, కాబట్టి దర్శక నిర్మాతలతో సహా ఎవరూ కూడా ఈ సినిమా ఫలితం గురించి భయపడాల్సిన పనిలేదని” కృష్ణంరాజు వ్యాఖ్యానించారు. అయితే అప్పుడు జనాలకు అర్థం కాలేదు కానీ, ఇప్పుడు సినిమా విడుదలయ్యాక కృష్ణంరాజు వ్యాఖ్యలు గుర్తు తెచ్చుకుంటే, సినిమా ఫలితం మీద సినిమాకు పని చేసిన వాళ్ళలో చాలామందికి అనుమానం ఉండేది అన్న విషయం అర్థమవుతుంది. బయటనుండి టీజర్ ట్రైలర్ మాత్రమే చూసిన కృష్ణంరాజు లాంటి వాళ్లకు అర్థం కాకపోయినా, సినిమాకు పని చేసిన వాళ్లకు సినిమా ఎలా వచ్చింది ఫలితం ఎలా ఉండబోతోంది అన్న దానిపై ముందుగానే ఒక అవగాహన ఉంటుంది. ఆ భయాన్ని గమనించే కృష్ణంరాజు ఆ వ్యాఖ్య లు చేసి ఉంటారని ఇప్పుడు అర్థమవుతోంది.

మొత్తంగా చూస్తే పైకి సినిమా యూనిట్ ఎంత గంభీరంగా మాట్లాడినప్పటికీ, సినిమా ఫలితం తేడా కొట్టే అవకాశం ఉందని వాళ్లకు ముందుగానే ఒక భయం ఉన్నట్లుగా తెలుస్తోంది. వాళ్లు భయపడ్డట్టే ఇప్పుడు జరిగిందని కూడా అర్థమవుతుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

నాలుగైదు సినిమాలకు అడ్వాన్సులు – గెలిచినా పవన్ బిజీనే !

పవన్ కల్యాణ్ ఎన్నికల తర్వాత కూడా తీరిక లేకుండా ఉంటారు. అయితే రాజకీయాలతో కాదు. సినిమాలతో. పవన్ కల్యాణ్ పిఠాపురంలో నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా తన ఆస్తులు,...

మేనిఫెస్టో మోసాలు : చేసింది జలయజ్ఞం కాదు జలభగ్నం !

వైఎస్ఆర్ జలయజ్ఞం.. వైఎస్ఆర్ కలలు కన్నారు. ఆ యజ్ఞాన్ని పూర్తి చేస్తాం. పోలవరం, వెలిగొండ యుద్ధప్రాతిపదికన పూర్తి చేస్తాం. రక్షిత మంచినీరు, సాగునీరు కల నిజం చేస్తాం. చెరువులను పునరుద్ధరిస్తాం .. జలకళను...

కాంగ్రెస్ కు అడ్వాంటేజ్ గా హరీష్ రావు సవాళ్ళు..!?

బీఆర్ఎస్ అధికారం కోల్పోయాక అటు కేసీఆర్, ఇటు హరీష్ రావు రాజకీయ వ్యూహాలు తేలిపోతున్నాయి. ప్రత్యర్ధులను కట్టడి చేసేందుకు చేస్తోన్న వ్యాఖ్యలు బీఆర్ఎస్ కు మేలు చేయకపోగా...అధికార కాంగ్రెస్ కు ఫేవర్ చేసేలా...

ఎడిటర్స్ కామెంట్ : ఆన్ లైన్ ఎలక్షన్స్ !

ఇండియాలో కేజీ బియ్యం రూ. వంద పలుకుతుంది కానీ ఒక్క జీబీ డేటా మాత్రం ఐదు రూపాయలకే వస్తుంది. మీరు సమయం అంతా యూట్యూబ్ వీడియోలు.. సోషల్ మీడియా మీదే గడపుతామంటే...

HOT NEWS

css.php
[X] Close
[X] Close