జీవోలన్నీ ప్రజలకు అందుబాటులో ఉంచాల్సిందేనన్న హైకోర్టు..!

ప్రభుత్వ జీవోలన్నింటినీ ప్రజలకు అందుబాటులో ఉంచారని హైకోర్టు ఆదేశించింది. అయితే జీవోలను ఆఫ్‌లైన్‌లో మాత్రం ఉంచాలని… రిజిస్టర్లలో మాన్యువల్ పద్దతికి పోయిన ఏపీ ప్రభుత్వానికి హైకోర్టు ఇచ్చిన ఆదేశాలు కావు ఇవి.. తెలంగాణ సర్కార్ కు అక్కడి హైకోర్టు ఇచ్చిన ఆదేశాలు. వాసాలమర్రి గ్రామంలో ఇటీవల దళిత బంధు పథకాన్ని కేసీఆర్ ప్రారంభించారు. ఆ సందర్భంగా గ్రామంలో ఉన్న 76 కుటుంబాలకు పథకం వర్తిస్తుందని ప్రకటించి.. తర్వాతి రోజు నిధులు విడుదల చేశారు. అయితే పథకానికి సంబంధించి విధి విధానాలు ఖరారు చేయకుండానే ప్రజాధనం చెల్లిస్తున్నారని వాచ్‌ వాయిస్‌ ఆఫ్ పీపుల్ సంస్థ హైకోర్టులో పిటిషన్ వేసింది.

దీనిపై జరిగి న విచారణలో… పథకానికి సంబంధించిన నిబంధనలు ఖరారు చేయలేదని పిటిషన్ హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. అయితే నిబంధనలు ఖరారు చేశామని.. రాష్ట్రంలో ఉన్న దళిత కుటుంబాలన్నింటికీ అమలు చేస్తామని ప్రభుత్వం తరపు న్యాయవాది కోర్టులో వాదించారు. ఆ విషయం ఎందుకు పిటిషన్‌లో పేర్కొనలేదని హైకోర్టు పిటిషనర్‌ను ప్రశ్నించింది.కానీ నిబంధనలు ఖరారు చేసినట్లుగా ఎలాంటి ఆదేశాలు అధికారికంగా ఇవ్వలేదని… జీవోలను కూడా వెబ్‌సైట్‌లో పెట్టలేదని పిటిషనర్ హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. దీంతో జీవోలను ప్రజలకు అందుబాటులో ఉంచడానికి ఇబ్బంది ఏమిటని .. వాటిని ఇరవై నాలుగు గంటల్లో అందుబాటులో ఉంచారని ఆదేశించింది.

తెలంగాణ అడ్వకేట్ జనరల్ వివరణను నమోదు చేసుకుని పిటిషన్‌పై విచారణ ముగించింది. తెలంగాణ సర్కార్ మరో రోజులో దళిత బంధుకు సంబంధించిన విధి విధానాల జీవోను వెబ్‌సైట్‌లో పెట్టే అవకాశం ఉంది. అయితే ఏపీ సర్కార్ ఆఫ్ లైన్ జీవోలపై ఎవరైనా హైకోర్టులో పిటిషన్ వేస్తే.. పరిస్థితేమిటన్న చర్చ సహజంగానే తెలంగాణ హైకోర్టు తీర్పుతో వస్తుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

మా రాష్ట్రానికి రండి… రేవంత్ కోసం 7 రాష్ట్రాల రిక్వెస్ట్!

గెల‌వ‌టం అసాధ్య‌మ‌నుకున్న తెలంగాణ‌లో పార్టీని గెలిపించిన సీఎం రేవంత్ రెడ్డికి... ఇత‌ర రాష్ట్రాల నుండి మా రాష్ట్రానికి రండి అంటూ ఇన్విటేష‌న్లు వ‌స్తున్నాయి. మా రాష్ట్రంలో తెలుగు వారున్నారు మీరు రండి అంటూ...

నేల దిగిన విక్ర‌మ్‌… ఈసారి కొట్టేస్తాడేమో..?!

విక్ర‌మ్ న‌టుడిగా ఎప్పుడూ ఫెయిల్ కాలేదు. ప్ర‌తీసారీ ఏదో ఓ రూపంలో కొత్త‌ద‌నం ఇవ్వాల‌నే ప్ర‌య‌త్నం చేస్తూనే ఉంటాడు. అదే త‌న ప్ల‌స్సు, అదే మైన‌స్సు కూడా. మితిమీరిన ప్ర‌యోగాల‌తో చేతులు కాల్చుకోవ‌డం...

మోత్కుపల్లి ఏ పార్టీలో ఉన్నా అంతే !

మోత్కుపల్లి నరసింహులు కాంగ్రెస్ పార్టీపై అసంతృప్తి వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌లో మాదిగలకు అన్యాయం జరుగుతోందని.. మఖ్యమంత్రి రేవంత్ తప్పు చేస్తున్నారని తెరపైకి వచ్చారు. ఒక రోజు దీక్ష చేస్తానని ప్రకటించారు. నిజానికి మోత్కుపల్లి...

తగ్గేదేలే – తోట త్రిమూర్తులే అభ్యర్థి !

దళితుల శిరోముండనం కేసులో దోషిగా తేలి జైలు శిక్షకు గురైన మండపేట వైసీపీ అభ్యర్థి తోట త్రిముర్తులకు జగన్ అభయం ఇచ్చారు. జైలు శిక్ష పడినా అభ్యర్థి ఆయనేనని స్పష్టం చేయడంతో ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close