యాభై స్థానాల్లో కాంగ్రెస్ టిక్కెట్ల కోసం భారీ పోటీ !

తెలంగాణ కాంగ్రెస్ లో అభ్యర్థిత్వం కోసం పోటీ తీవ్ర స్థాయిలో ఉంది. అరవై స్థానాల్లో అభ్యర్థుల్ని కష్టపడకుండానే ఖరారు చేసినా మిగిలిన చోట్ల మాత్రం భారీ పోటీ నెలకొంది. ఆయా చోట్ల అభ్యర్థులు… కాంగ్రెస్ లో తమకు తెలిసిన పెద్ద తలకాయలందరి దగ్గరకు వెళ్లి ప్రసన్నం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో గతంలో ఎప్పుడూ లేనంత పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. సీనియర్లంతా తమ వర్గం వారికి టిక్కెట్లు ఇప్పించుకోవాలని ప్రయత్నిస్తున్నారు.

మరో వైపు సామాజిక సమీకరణాలనూ చూసుకోవాలనుకుంటున్నారు. ప్రతి పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో ఉండే 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 2-3 నియోజకవర్గాలను బీసీలకు కేటాయించాలని నిర్ణయించారు. మొత్తంగా రాష్ట్రంలోని 17 ఎంపీ స్థానాల పరిధిలో 34 మంది బీసీ అభ్యర్థులను బరిలోకి దింపాలని భావిస్తోంది. ఇప్పటికే బలమైన బీసీ అభ్యర్థుల జాబితాను ఫైనల్ చేసుకున్నారు. కొన్ని చోట్ల పోటీ ఎక్కువగా ఉండటంతో బుజ్జగింపులు చేస్తున్నారు.

బీసీలకు అత్యధిక సీట్లు ఇవ్వడం ద్వారా ఈ సారి బీసీ ఓటు బ్యాంక్ ను గణనీయంగా తమ వైపు తిప్పుకోవాలని కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది. ఈ నిర్ణయం మధుయాష్కీ లాంటి నేతలకు కలసి వస్తోంది. బలమైన నేత కావడంతో ఆయనకు ఎల్బీనగర్ టిక్కెట్ ఖరారయిందన్న ప్రచారం జరుగుతోంది. తొలి జాబితాను సిద్ధం చేసిన అనంతరం స్క్రీనింగ్‌ కమిటీ ఆ లిస్టును అధిష్ఠానానికి చేరవేయనుంది. ఈ నెలాఖరు లేదా అక్టోబరు తొలివారంలో మొదటి జాబితాను ప్రకటించే అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

తెలంగాణలో కనిపించని ఎన్నికల హడావుడి – ఖర్చు భయమే !

తెలంగాణలో లోక్ సభ ఎన్నికలు జరుగుతున్నాయి. మీడియాలో తప్ప క్షేత్ర స్థాయిలో ఎక్కడా ఎన్నికల ప్రచార హడావుడి కనిపించడం లేదు. అన్ని ప్రధాన పార్టీలు ఇంకా ప్రచారాన్ని ఉద్ధృతం చేయలేదు. మరో...

మోనిఫెస్టో మోసాలు : కొత్తది సరే పాతదాంట్లో ఎగ్గొట్టిన వాటికి సమాధానం చెప్పాలి కదా !

వైసీపీ చీఫ్ జగన్ కొత్త మేనిఫెస్టో విడుదల చేశారు. పాత దాంట్లో అమలు చేయనివి తీసేసి కొత్తగా ప్రింట్ చేసి ఇచ్చారు. కాస్త డబ్బులు ఎక్కువ ఇస్తానని ఆశ పెట్టే ప్రయత్నం...

పిఠాపురంలో పవన్‌పై పుకార్ల కుట్రలు !

పవన్ కల్యాణ్ గెలిస్తే అసెంబ్లీలో అడుగుపెడితే తాము చూస్తూ బతకలేమని చస్తూ బతకాలని అనుకుంటున్నారేమో కానీ వైసీపీ నేతలు ప్రతి అడ్డమైన వ్యూహాన్ని పాటిస్తున్నారు. రాత్రికి రాత్రి పిఠాపురం వర్మ వైసీపీలోకి...

ఆర్కే పలుకు : జగన్‌ను ఓడించాల్సిన అవసరం రేవంత్‌కూ ఉంది !

జగన్ ను ఓడించాల్సిన అవసరం రేవంత్‌కు ఉందా ?. ముందు తెలంగాణలో పార్లమెంట్ సీట్లను గెలిపించుకోవాల్సిన అవసరం మాత్రం రేవంత్ కు ఉంది. అందుకే ఆయన కిందా మీదా పడుతున్నారు....

HOT NEWS

css.php
[X] Close
[X] Close