మినిస్టర్ విడదల రజిని తెలంగాణ బిడ్డ !

ఏపీ మంత్రి విడదల రజినిని అందరూ ఇప్పటి వరకూ చిలుకలూరిపేటలో పుట్టి పెరిగారని అనుకుంటున్నారు. కానీ ఆమె పెళ్లి చేసుకుంది చిలుకలూరిపేట పురుషోత్తమపట్నంకు చెందిన కుమారస్వామి అనే కాపు కుటుంబానికి చెందిన వ్యక్తిని కానీ ఆమె పుట్టింది పెరిగింది హైదరాబాదే. ఆమె తల్లిదండ్రులు తెలంగాణకు చెందిన వారు. యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం కొండాపురం గ్రామం విడదల రజిని తల్లిదండ్రుల స్వగ్రామం. ఆమె తండ్రి పేరు రాగుల సత్తయ్య. సత్తయ్య రెండో కూతురు రజిని.

రాగుల సత్తయ్య బతుకుదెరువు నిమిత్తం 40 ఏళ్ల కిందట హైదరాబాద్‌కు వలస వెళ్లారు. సఫిల్‌గూడలో నివాసం ఉంటున్నారు. రాగుల సత్తయ్యకు ఇద్దరు కూతుళ్లు, కొడుకు ఉన్నారు. రెండో కూతురు రజని. చిలుకలూరిపేటకు చెందిన విడదల కుమారస్వామిని ఆమె వివాహం చేసుకున్నారు. రజని మంత్రి కావడంతో కొండాపురం గ్రామంలో ప్రజలు, ప్రజా ప్రతినిధులు సంబరాలు చేసుకున్నారు. దీంతో విషయం బయటకు వచ్చింది.

రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణకు చెందిన ఒకరు ఏపీలో ఎమ్మెల్యేగా ఎన్నికవడం.. ఇప్పుడు మంత్రిగా బాధ్యతలు చేపట్టడం అనూహ్యమే. అయితే ఇలా తెలంగాణ వ్యక్తులు ఏపీ రాజకీయాల్లో ఉండటం అనూహ్యమేమీ కాదు. ప్రస్తుత వైసీపీ ఎమ్మెల్సీ పోతుల సునీత కూడా తెలంగాణకు చెందినవారే. ఆమె ఏపీలో రాజకీయాలు చేస్తున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

అల్ల‌రోడికి కాస్త ఊర‌ట‌

అల్ల‌రి న‌రేష్ 'ఆ ఒక్క‌టీ అడ‌క్కు' ఈవార‌మే ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. ఈ సినిమాపై వ‌చ్చిన‌వ‌న్నీ నెగిటీవ్ రివ్యూలే. ఈవీవీ సూప‌ర్ హిట్ టైటిల్ ని చెడ‌గొట్టార‌ని, కామెడీ ఏమాత్రం పండ‌లేద‌ని విశ్లేష‌కులు...

మరో డీఐజీ రెడ్డి గారికి ఊస్టింగ్ ఆర్డర్స్

పోలింగ్ కు ముందు వైసీపీ అరాచకాలకు పూర్తి స్థాయిలో సహకారం అందిస్తున్న పోలీసు అధికారులపై ఈసీ గట్టిగానే గురి పెట్టింది. అనంతపురం రేంజ్ డీఐజీ అమ్మిరెడ్డిని బదిలీ చేసింది. ఆయనకు ఎన్నికల...

సందీప్ సినిమాలో ‘మ‌న్మ‌థుడు’ హీరోయిన్‌

'మ‌న్మ‌థుడు'లో క‌థానాయిక గా మెరిసిన అన్షు గుర్తుంది క‌దా? ఆ సినిమా సూప‌ర్ హిట్ అయ్యాక అన్షుకి మంచి అవ‌కాశాలే వ‌చ్చాయి. కానీ.. రెండు మూడు సినిమాల త‌ర‌వాత‌.. లండ‌న్ వెళ్లిపోయింది....

గుంటూరు జిల్లా టీడీపీలో చేరికల హుషారు !

గుంటూరు, పల్నాడు జిల్లాల్లో వైసీపీ పూర్తిగా బలహీనపడుతోంది. ఆ పార్టీ నుంచి ద్వితీయ శ్రేణి నాయకత్వం అంతా వరుసగా టీడీపీలో చేరిపోతున్నారు. స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు అనేక మంది టీడీపీలో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close