మరీ అన్ని తప్పటడుగులు వేస్తే ఎలా జగన్?

ఈనెల 22న ప్రధాని నరేంద్ర మోడీ అమరావతి శంఖుస్థాపన కోసం వచ్చినప్పుడు ఆయనని కలిసేందుకు జగన్మోహన్ రెడ్డి అపాయింట్ మెంట్ కోరబోతున్నట్లు సాక్షి మీడియాలో వార్తలు వచ్చేయి. అదే నిజమయితే ఒక చారిత్రక కార్యక్రమం జరుగుతున్న వేళలో కూడా జగన్మోహన్ రెడ్డి దాని గురించి ఆలోచించకుండా తన ప్రాధాన్యతని, ప్రత్యేక హోదా తను చేస్తున్న పోరాటాన్ని ప్రధాని నరేంద్ర మోడీ దృష్టికి తీసుకు వెళ్ళాలనుకొంటున్నట్లు అర్ధం అవుతుంది. బహుశః అందుకే ప్రధాని నరేంద్ర మోడీ విజయవాడలో అడుగు పెట్టే ముందు రోజు వరకు కూడా వైకాపా రకరకాల నిరసన దీక్షలు చేపట్టాలని నిశ్చయించుకొన్నట్లు అనుమానించవలసి వస్తోంది.

జగన్మోహన్ రెడ్డికి నిజంగా ప్రత్యేక హోదా సాధించాలనే కోరిక ఉందో లేదో తెలియదు కానీ ఆయన వ్యవహార శైలి మాత్రం ప్రజలలో అపనమ్మకం కలిగేందుకే దోహదపడుతోంది. కేంద్రప్రభుత్వం ప్రత్యేక హోదా విషయంలో వెనకడుగు వేసినందునే జగన్మోహన్ రెడ్డికి ఈ ఉద్యమాలు చేసే అవకాశం కలిగింది. తను చేస్తున్న ఈ ఉద్యమాల వలన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చాలా ఇబ్బందికర పరిస్థితులు కల్పిస్తూ మళ్ళీ దాని కోసమే జగన్ ప్రధాని నరేంద్ర మోడీ అపాయింట్ మెంట్ ఆశించడం హాస్యాస్పదంగా ఉంది. ఒకవేళ ఆయన ప్రధాని నరేంద్ర మోడీ కలవాలనుకొంటే ఆయన ఆంధ్రాకి వచ్చేలోగా లేదా తిరిగి ఆయన డిల్లీ చేరుకొన్నాక ఎప్పుడయినా వెళ్లి ఆయనను కలిసి మాట్లాడవచ్చును. కానీ సమయం సందర్భం లేకుండా రాష్ట్రంలో ఒక చారిత్రాత్మక ఘట్టం ఆవిష్కరిస్తున్నపుడు ప్రత్యేక హోదా గురించి మాట్లాడాలని అపాయింట్ మెంట్ అడిగి ఇవ్వకుంటే, రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వడం ప్రధాని మోడీకి ఇష్టం లేదని వాదిస్తూ అందుకు నిరసనగా మళ్ళీ దీక్షలు ధర్నాలు చేయాలనుకొంటున్నారేమో?

జగన్ తను ప్రత్యేక హోదా కోసం అకుంటిత దీక్షతో పోరాడుతున్నట్లు చాటుకొనేందుకే ఇవన్నీ చేస్తుండవచ్చును. కానీ ఆయన చర్యలు ప్రజలకు తప్పుడు సంకేతాలు పంపిస్తున్నాయి. ఆయనకి రాజధాని నిర్మాణం జరగడం ఇష్టం లేదు అందుకే దానికి అడ్డంకులు సృష్టిస్తున్నారనే అభిప్రాయం ప్రజలకి కలిగేలా చేస్తున్నారు. కనుక జగన్ కొంచెం ఆలోచించి అడుగులు ముందుకు వేస్తే మంచిది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రాజారెడ్డి రాజ్యాంగంలో అది హత్యాయత్నమే!

సాక్షి పేపర్ రాతల్ని పోలీసులు యథావిథిగా రిమాండ్ రిపోర్టుగా రాసి.. ఓ బీసీ మైనల్ బాలుడ్ని మరో కోడికత్తి కేసు శీనులా బలి చేయడానికి రెడీ అయిపోయారు. రాయితో దాడి చేశారో లేదో...

క‌విత అరెస్ట్… కేసీఆర్ చెప్పిన స్టోరీ బానే ఉందా?

త‌న కూతురు, ఎమ్మెల్సీ క‌విత అరెస్ట్ పై ఇంత‌వ‌ర‌కు కేసీఆర్ ఎక్క‌డా స్పందించ‌లేదు. ఈడీ కేసులో అరెస్ట్ అయి తీహార్ జైల్లో ఉన్న క‌విత‌ను చూసేందుకూ వెళ్లలేదు. ఫైన‌ల్ గా బీఆర్ఎస్ నేత‌ల...

రానాతోనే ‘లీడ‌ర్ 2’: శేఖ‌ర్ క‌మ్ముల‌

శేఖ‌ర్ క‌మ్ముల సినిమాలో హిట్లూ, సూప‌ర్ హిట్లూ ఉన్నాయి. అయితే సీక్వెల్ చేయ‌ద‌గిన స‌బ్జెక్ట్ మాత్రం 'లీడ‌ర్‌' మాత్ర‌మే. ఈ సినిమాని కొన‌సాగిస్తే బాగుంటుంద‌ని రానా చాలాసార్లు చెప్పాడు. ఇప్పుడు శేఖ‌ర్ క‌మ్ముల...

విజ‌య్ దేవ‌ర‌కొండ.. త్రివిక్ర‌మ్‌.. అలా మిస్స‌య్యారు!

'గుంటూరు కారం' త‌ర‌వాత త్రివిక్ర‌మ్ త‌దుప‌రి సినిమా విష‌యంలో క్లారిటీ రాలేదు. ఆయ‌న అల్లు అర్జున్ కోసం ఎదురు చూస్తున్నారు. బ‌న్నీ ఏమో.. అట్లీ వైపు చూస్తున్నాడు. బ‌న్నీతో సినిమా ఆల‌స్య‌మైతే ఏం...

HOT NEWS

css.php
[X] Close
[X] Close