మూడేళ్లలో జమిలీ ఎన్నికలు..! ఇది సీఎం రమేష్ జోస్యం..!

భారత రాజకీయాల్లో ఇక నుంచి ప్రాంతీయ పార్టీలకు మనుగడ లేదని గుర్తించే… భారతీయ జనతా పార్టీలో చేరినట్లుగా… ఎంపీ సీఎం రమేష్ ప్రకటించుకున్నారు. బీజేపీలో చేరిన రెండున్నర నెలల తర్వాత తొలి సారి ఆయన మీడియాతో మాట్లాడారు. తాను భారతీయ జనతా పార్టీలో చేరడానికి… కారణాన్ని చెప్పుకొచ్చారు. మూడేళ్లలో జమిలీ ఎన్నికలు జరుగుతాయని మాత్రం. సీఎం రమేష్ గట్టిగా చెబుతున్నారు. భారతీయ జనతా పార్టీ తరపున ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చేందుకు సుజనాతో పాటు.. సీఎం రమేష్ కూడా రెడీ అయ్యారు. బీజేపీలో చేరిన తర్వాత సీఎం రమేష్… మీడియా ముందుకు రాకపోయినప్పటికీ.. బీజేపీ తరపున మాత్రం.. తెర వెనుక రాజకీయాల్లో కీలకంగా వ్యవహరిస్తున్నారు.

పార్లమెంట్ జరిగేటప్పుడు.. మరింత యాక్టివ్ గా ఉంటున్నారు. రాజ్యసభలో బిల్లులను పాస్ చేసే విషయంలో… సభ్యుల మద్దతు కూడగట్టగడంలో.. తన టాలెంట్ మొత్తం చూపిస్తున్నారు. ఈ క్రమంలో… ఏపీలో బీజేపీని బలోపేతం చేసే దిశగా… తెర వెనుక వ్యూహాలకు … సీఎం రమేష్ ఎక్కువ సమయం కేటాయిస్తున్నారు. భవిష్యత్ ప్రణాళికలపై… బీజేపీ హైకమాండ్ నుంచి స్పష్టమైన సమాచారం ఉండటంతోనే… సీఎం రమేష్.. ముందస్తు ఎన్నికల గురించి చెబుతున్నారన్న ప్రచారం జరుగుతోంది. బీజేపీ కూడా.. జమిలీ ఎన్నికల నిర్వహణకు పట్టుదలగా ఉంది.

రెండో సారి ఎన్నికల్లో గెలిచిన వెంటనే.. అన్ని పార్టీల సమావేశం పెట్టిన ప్రధాని మోడీ.. ఈ మేరకు అంగీకారం కూడా తీసుకున్నారు. ఆగస్టు పదిహేను ప్రసంగంలోనూ.. వన్ నేషన్ – వన్ ఎలక్షన్ విధానాన్ని గట్టిగానే ప్రస్తావించారు. దీంతో.. జమిలీ ఎన్నికలు ఖాయమనే అభిప్రాయం అందరికీ వచ్చింది. అయితే. ఎప్పుడనేదానిపైనే స్పష్టత లేదు. కొసమెరుపేమిటంటే.. గుంటూరులో వైసీపీ బాధితుల పునరావాస శిబిరంలో మాట్లాడిన… చంద్రబాబు కూడా.. మూడేళ్లలో… జమిలీ ఎన్నికలు వస్తాయని ప్రకటించారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

అలా చేస్తే రాహుల్ నపుంసకుడో కాదో తేలుతుంది..కాంగ్రెస్ నేత సంచలన వ్యాఖ్యలు

ఎన్నికలు వచ్చిన ప్రతిసారి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పెళ్లి విషయంపై బీజేపీ నేతలు కామెంట్స్ చేయడం పరిపాటిగా మారింది. ఆయనకు మగతనం లేదని అందుకే పెళ్లి చేసుకునేందుకు భయపడుతున్నారని బీజేపీ నేతలు...

బీజేపీకి రాజాసింగ్ షాక్…ఏం జరిగిందంటే..?

హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలత నామినేషన్ కు ఎమ్మెల్యే రాజాసింగ్ డుమ్మా కొట్టారు.హైదరాబాద్ సెగ్మెంట్ ఇంచార్జ్ గా తన అభిప్రాయాన్ని తీసుకోకుండానే ఏకపక్షంగా మాధవీలత అభ్యర్థిత్వాన్ని ఫిక్స్ చేశారని రాజాసింగ్ అసంతృప్తిగా...

తెలంగాణలో ఛాలెంజింగ్ పాలిటిక్స్

లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ హోరాహోరీగా తలపడుతున్నాయి. ప్రజాభిప్రాయం ఎలా ఉన్నా మెజార్టీ సీట్లు మావంటే మావేనని ప్రకటిస్తున్నాయి. ప్రత్యర్ధి పార్టీలపై ఆయా పార్టీల నేతలు విమర్శలు, ప్రతి విమర్శలు...

కొనసాగింపు కథల బాక్సాఫీసు వేట

‘బాహుబలి’ సినిమా సైజ్ ని పెంచింది. ప్రేక్షకులందరికీ థియేటర్స్ లోకి తీసుకురాగలిగితే బాక్సాఫీసు వద్ద ఎలాంటి మాయ చేయొచ్చు నిరూపించింది. సినిమా కథకు కూడా కొత్త ఈక్వేషన్ ఇచ్చింది. బహుబలికి ముందు దాదాపు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close