తూచ్… ఆ కేసులను సీబీఐకి ఇచ్చేది లేదు..!

వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు కానీ… కోడి కత్తి కేసు కానీ.. సీబీఐకి అప్పగించే ఉద్దేశమే లేదని… వైసీపీ స్పష్టం చేసింది. ఈ మేరకు విజయసాయిరెడ్డి తమ నిర్ణయాన్ని సమర్థించుకుంటూ… సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. టీడీపీ హయాంలో పోలీసులు పచ్చ చొక్కాలు వేసుకున్నందున… అప్పుడు సీబీఐ విచారణకు డిమాండ్ చేశామని.. ఇప్పుడు పోలీసులు నీతిమంతులయ్యారని… సిన్సియర్ గా పనిచేస్తున్నారని… ఆయన చెప్పుకొచ్చారు. అంటే.. తాము డిమాండ్ చేసిన కేసుల్లోనూ… విచారణ రాష్ట్ర పోలీసులతోనే.. అదీ కూడా.. స్వయంగా సీఎం జగన్ పై .. జరిగిన హత్యాయత్నం.. అలాగే సీఎం జగన్ బాబాయ్ హత్యకేసులనూ.. ఏపీ పోలీసులే విచారిస్తారని.. సీబీఐ దాకా పోవడం లేదని… విజయసాయిరెడ్డి నేరుగా అంగీకరించినట్లయింది.

వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో… ఎలాంటి తీవ్రమైన ఆరోపణలు వచ్చి.. ప్రతిపక్షాల నుంచి సీబీఐ విచారణకు డిమాండ్ వచ్చిన మరుక్షణం… సీఎం హోదాలో వైఎస్.. ఏ మాత్రం ఆలోచించేవారు కాదు. తక్షణం సీబీఐ విచారణకు సిఫార్సు చేస్తూ ప్రభుత్వం తరపున కేంద్రానికి లేఖ వెళ్లిపోయేది. అది… ఫోక్స్ వ్యాగన్ కేసు కావొచ్చు.. పరిటాల రవి హత్య కేసు కావొచ్చు… ఏదైనా సరే… స్వయంగా.. వైఎస్ జగన్ పై ఆరోపణలు ఉన్నప్పటికీ.. ఆయన లెక్కచేసేవారు కాదు. కానీ ఇప్పుడు ఆయన కుమారుడు జగన్మోహన్ రెడ్డి మాత్రం.. తాము స్వయంగా డిమాండ్ చేసిన కేసుల్లోనూ… అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నప్పటికీ.. సీబీఐ విచారణకు ఇచ్చేందుకు సిద్ధంగా లేరు. ఆ విషయం విజయసాయిరెడ్డి ప్రకటనలతో స్పష్టమయింది.

కేంద్రంతో సంబంధాలు అంతంతమాత్రంగానే ఉన్నాయనే విషయాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ నెంబర్ -2 విజయసాయిరెడ్డి పరోక్షంగా అంగీకరించినట్లయింది. వైఎస్ వివేకా కేసు కానీ.. కోడి కత్తి కేసు కానీ.. సీబీఐకి ఇస్తూ.. సిఫార్సు చేస్తే తమ జుట్టు మరోసారి కేంద్రం చేతికి ఇచ్చినట్లవుతుందన్న ఆందోళన.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్దల్లో ఉందన్న అభిప్రాయం కలుగుతోంది. వైఎస్ వివేకా హత్య కేసులో నిజమైన నిందితుల్ని పట్టుకోవాలంటే… గంటల్లో పని అని… పోలీసు శాఖలో సాధారణ కానిస్టేబుల్ కూడా అంచనా వేయగలిగిన విషయం. అయినా… ఎందుకు సాగదీస్తున్నారో… కొంత మందికే తెలుసు. కోడికత్తి కేసు విషయంలోనూ అదే పరిస్థితి. మొత్తానికి… ప్రతిపక్షంలో ఉన్నప్పుడు.. సీబీఐ విచారణ కోసం కోర్టులకు సైతం వెళ్లిన వైసీపీ.. ఇప్పుడు.. అధికారంలోకి వచ్చాక అవే కేసులను…సీబీఐకి అప్పగించడంలో మాత్రం… వెనుకగుడు వేస్తోందని స్పష్టమవుతోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఆ స్థానాల్లో ఇద్దరేసి అభ్యర్థులకు బీజేపీ బీ ఫాం..!?

పార్లమెంట్ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బీజేపీ వ్యూహాత్మకంగా ముందుకు సాగుతోంది.పోటీ చేసే అభ్యర్థులకు గెలుపు వ్యూహాలను చేరవేస్తూనే..మరోవైపు పార్టీ పరంగా ఎలాంటి వ్యూహాలను అనుసరించాలో అన్నింటిని పక్కా ప్లాన్ తో అమలు చేస్తోంది....

కేసీఆర్ బస్సులో లిఫ్ట్.. ఎంట్రీ వేరే లెవల్..!!

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వినియోగిస్తోన్న బస్సు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. కేసీఆర్ సౌలభ్యం కోసం బస్సును కొత్త టెక్నాలజీతో అప్డేట్ చేయడంతో బస్సు డిజైన్ ఆకట్టుకుంటోంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ముగిసాక కేసీఆర్...

రియల్లీ గ్రేట్..50 మందిని కాపాడిన బాలుడు

రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ లోని ఫార్మా కంపెనీ అగ్ని ప్రమాద ఘటనలో ఓ బాలుడి సాహసం 50మందిని ప్రాణాపాయం నుంచి కాపాడింది. భారీగా మంటలు ఎగిసిపడటంతో ప్రమాదంలో చిక్కుకొని ఆపన్నహస్తం కోసం...

పిఠాపురంపైకి అసాంఘిక శక్తుల దండయాత్ర !

ఒక్కడిని ఒక్కరంటే ఒక్కర్ని ఓడించడానికి అన్ని రకాల మాఫియాల్ని రంగంలోకి దించుతోంది వైసీపీ. విచ్చలవిడిగా డబ్బులు ఖర్చుపెట్టడమే కాదు.. నకిలీ మద్యంతో ముంచెత్తుతున్నారు. బయట నుంచి ఎర్ర చందనం స్మగ్లర్లు,...

HOT NEWS

css.php
[X] Close
[X] Close