కాంగ్రెస్‌లో చేరిన కొండా దంపతులు.!

వరంగల్ వెస్ట్ నియోజకవర్గానికి చెందిన తాజా మాజీ ఎమ్మెల్యే కొండా సురేఖ, ఆమె భర్త ఎమ్మెల్సీ కొండా మురళీ రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. నిన్న హైదరాబాద్‌లో ప్రెస్‌మీట్ పెట్టి.. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌పై తీవ్ర విమర్శలు చేసిన కొండా దంపతులు.. తమకు పదిహేను పార్టీల నుంచి ఆహ్వానం ఉందని చెప్పుకొచ్చారు. నాలుగైదు రోజుల్లో నిర్ణయం తీసుకుంటామన్నారు. అయితే హఠాత్తుగా ఈ రోజు ఉదయం ఢిల్లీ వెళ్లి రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి వారిని రాహుల్ వద్దకు తీసుకెళ్లారు.

ఒకప్పుడు ఎర్రబెల్లి దయాకర్ రావు అనుచరుడిగా ఉన్న కొండా మురళి.. ఆ తర్వాత ఆయనతో ఉప్పునిప్పులా వ్యవహరించి.. రాజకీయంగా ఎదిగారు. వైఎస్ హయాంలో కాంగ్రెస్ పార్టీలో కొండా దంపతులకు ఎనలేని ప్రాధాన్యం లభించింది. వైఎస్ వారిని బాగా ప్రొత్సహించారు. కొండా మురళిపై తీవ్రమైన ఆరోపణలు ఉండటంతో ప్రత్యక్ష ఎన్నికల్లో కొండా సురేఖనే పోటీ చేస్తూ వస్తున్నారు. వైఎస్ హయాంలో మంత్రిగా కూడా వ్యవహరించారు. వైఎస్ చనిపోయిన తర్వాత జగన్‌కో నడిచారు. తెలంగాణ ఉద్యమ సమయం తీవ్రంగా ఉన్న సమయంలోనూ వారు జగన్‌ వెంటే ఉన్నారు. జగన్ కోసం రాజీనామా చేశారు. ఉపఎన్నికల్లో వైసీపీ తరపున పోటీ చేశారు. తెలంగాణ సెంటిమెంట్… చాలా ఎక్కువగా ఉన్నా.. జగన్ పార్టీ తరపున.. పరకాలలో దాదాపుగా గెలిచినంత పని చేశారు. చాలా స్వల్ప తేడాతో ఓడిపోయారు. ఆ తర్వాత జగన్‌తో విబేధాలొచ్చాయి. గత ఎన్నికలకు ముందు ఆమె టీడీపీలో చేరుదామనుకున్నారు. కానీ… ఎర్రబెల్లి దయాకర్ రావు అడ్డపడ్డారని… కొండా సురేఖనే స్వయంగా వెల్లడించారు. ఆ తర్వాత టీఆర్ఎస్‌లో చేరారు.

టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అందరికీ టిక్కెట్ ప్రకటించి.. తన టిక్కెట్‌ను పెండింగ్‌లో పెట్టడంతో.. కొండా సురేఖ మనస్థాపానికి గురయ్యారు. తాము హరీష్ వర్గం అవడం వల్లే పక్కన పెట్టారని ఆరోపిస్తూ.. తీవ్ర ఆరోపణలు చేసి పార్టీకి గుడ్ బై చెప్పారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఒకే టైటిల్… మూడు సినిమాలు

టాలీవుడ్ లో టైటిళ్ల‌కు కొర‌త వ‌చ్చిందా? ప‌రిస్థితి చూస్తుంటే అదే అనిపిస్తోంది. త‌మ సినిమాల‌కు ఎలాంటి టైటిల్ పెట్టాలో అర్థం కాక‌, ఒక‌టే టైటిల్ తో మూడు సినిమాలు తీసేస్తున్నారు. టాలీవుడ్ లో...

బీజేపీపై పోస్టర్లు – అప్పట్లో బీఆర్ఎస్ ఇప్పుడు కాంగ్రెస్

బీజేపీపై చార్జిషీట్ అంటూ కాంగ్రెస్ పార్టీ నేతలు పోస్టర్లు రిలీజ్ చేశారు. తెలంగాణకు బీజేపీ చేసిన అన్యాయం అంటూ విభజన హామీలు సహా అనేక అంశాలను అందులో ప్రస్తావించింది. వాటిని హైదరాబాద్...

నామినేషన్‌లో పవన్ ఫోటో వాడేసుకున్న గుడివాడ అమర్నాథ్ !

రాజకీయ నాయకులకు కొంచెమైన సిగ్గు.. ఎగ్గూ ఉండవని జనం అనుకుంటూ ఉంటారు. అది నిజమేనని తరచూ కొంత మంది నిరూపిస్తూంటారు. అలాంటి వారిలో ఒకరు గుడివాడ్ అమర్నాథ్. పవన్ కల్యాణ్ పై...

కవిత అరెస్ట్ వెనక సంతోష్ రావు..!?

కవిత లిక్కర్ స్కామ్ లో కటకటాల పాలవ్వడానికి ఆ నేతే కారణమా..? తన స్వప్రయోజనాల కోసం ఆయన కవితను ఇరికించారా..?నమ్మకస్తుడిగా ఉంటూనే కేసీఆర్ కు వెన్నుపోటు పొడిచారా..?గత కొద్ది రోజులుగా సంతోష్ రావు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close