ఎన్టీఆర్ బయోపిక్: సతీమణి సన్నివేశాలు తక్కువే!

ఎన్టీఆర్ బ‌యోపిక్‌ని తీస్తే ‘బాహుబలి’ టైపులో రెండు భాగాలుగా తీయవచ్చు. లేదంటే మూడు నాలుగు ఐదు భాగాలుగానూ తీయవచ్చు. నటసార్వభౌమ నందమూరి తారక రామారావు జీవితంలో ఎన్నో అద్భుత ఘట్టాలు వున్నాయి. ఆయన జీవిత చరిత్రలో ఎన్నో విశేషాలు వున్నాయి. ఒక్క సినిమాలో అవన్నీ చూపించాలంటే కుదరని పని. అందుకని, పలువురి పాత్రల నిడివిని కుదిస్తున్నారు. అందులో భాగంగా ఎన్టీఆర్ సతీమణి బసవతారకం పాత్రనీ కుదించార్ట‌. బసవతారకం పాత్రలో హిందీ నటి విద్యా బాలన్ నటిస్తున్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ సినిమా చిత్రీకరణ కోసం హైదరాబాద్ వచ్చిన ఆమె, ముందుగా ఎన్టీఆర్ కుటుంబ సభ్యులను కలిసి బసవతారకం గురించి తెలుసుకొని సెట్స్ కి వెళ్లిన సంగతి తెలిసిందే. ఇప్పటివరకూ ఆమె ఎన్ని రోజులు షూటింగ్ చేశారో తెలుసా? ఐదు రోజులు. మరికొన్ని రోజులు ఆమె షూటింగ్ చేయనున్నారు. అయితే… ఆమె పాత్ర వెండితెరపై ఎక్కువసేపు కనిపించదట. అలాగని, మరీ కనిపించీ కనిపించనట్టూ వుండదట. కనిపించేది తక్కువ సన్నివేశాల్లో అయినా ఎంతో ప్రభావం చూపేలా దర్శకుడు క్రిష్ ప్లాన్ చేశార్ట‌. సినిమాలు, రాజకీయాలు, వ్యక్తిగత జీవితంలోని ముఖ్యమైన ఘట్టాలు రెండున్నర గంటల్లో చూపించాలంటే కుదించక తప్పదు మరి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రాజ్ దీప్ ఇంటర్యూలు : పవన్ జోష్, చంద్రబాబు విజన్ – జగన్ అహంకారం !

అసెంబ్లీ ఎన్నికలు కూడా జరుగుతున్న ఆంధ్రప్రదేశ్ లో ఇండియాటుడే చానల్ హెడ్ రాజ్ దీప్ సర్దేశాయ్ ముగ్గురు ప్రధాన నేతల్ని... ఇంటర్యూ చేశారు. ఏపీకే వచ్చారు. ముగ్గురు ప్రధాన నేతల ఇంటర్యూలను...

సేమ్ బీఆర్ఎస్ లాగే వైసీపీకి ఓవైసీ సపోర్ట్ !

మాము కేసీఆర్ ను మూడో సారి సీఎంను చేసుకుందామని అసదుద్దీన్ ఓవైసీ ముస్లిలు ఎక్కువగా ఉండే ఊళ్లన్నీ తిరిగారు. కేసీఆర్ సీఎం కాకపోతే.. కాంగ్రెస్ గెలిస్తే ఏదో జరిగిపోతుందని భయపెట్టారు. కానీ ఒక్కరూ...

బీజేపీకి ముచ్చెమటలు పట్టిస్తోన్న ధృవ్ రాతీ..!

ధృవ్ రాతీ... సోషల్ మీడియాలో ఓ సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నాడు. పొలిటికల్ బెసేడ్ వీడియోలు చేస్తూ ప్రకంపనలు రేపుతున్నాడు. మీడియా అంత గోది మీడియాగా మారిందన్న ఆరోపణలు వస్తోన్న వేళ ధృవ్ రాతీ...

ఓటేస్తున్నారా ? : ఓ సారి రోడ్ల వైపు చూడండి!

ఏదైనా ఓ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే ముందుగా మౌలిక సదుపాయాలు ఉండాలి. అంటే రోడ్లు, కరెంట్, నీరు వంటివి. ఏపీలో రూ. 43 వేల కోట్లతో రోడ్లేశామని మేనిఫెస్టో విడుదల సందర్భంగా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close