దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవడం కథానాయికలకే చెల్లింది. కథ, అందులో తమ పాత్ర ఎలా ఉన్నాసరే పారితోషికం కోసమో, పేరు కోసమో, కాంబినేషన్ కోసమో ఒప్పేసుకుంటారు. ఐతే స్టార్ హీరోల లెక్కకు వేరుగా ఉంటాయి. కథ నచ్చక పోయినా, కాంబినేషన్ పై ఏమాత్రం అనుమానాలు వున్నా ‘నో’ చెప్పాల్సిందే. అలాంటప్పుడు పారితోషికం ఎంత ఇస్తానన్నా వదులుకోవాల్సిందే. అలాంటి పరిస్థితే మహేష్ బాబుకి ఎదురయ్యింది. మహేష్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మహేష్ కోసం టాలీవుడ్ లో చాలా కథలు సిద్ధం అవుతున్నాయి. తమిళ్ దర్శకుడు సుందర్ సి కూడా మహేష్ ని దృష్టిలో ఉంచుకుని ఓ కథ రెడీ చేసాడట. మహేష్ ఒప్పుకుంటే తెలుగు, తమిళ భాషల్లో ఈ సినిమా ఒకేసారి పూర్తి చెయ్యాలనుకున్నాడట. అంతే కాదు… తమిళ మార్కెట్ కోసం జయం రవి నీ ఈ సినిమాలో తీసుకొచ్చి దీనికి మల్టీ స్టారర్ లుక్ తీసుకొద్దాం అనుకున్నాడు.
అందుకోసం మహేష్ కి రూ. 30 కోట్ల పారితోషికం కూడా ఆఫర్ చేశారని తెలుస్తోంది.
కావాలంటే మహేష్ సొంత బ్యానర్ లోనే ఈ సినిమా పూర్తి చెయ్యడానికి కూడా రెడీ నే అన్నారట. కానీ మహేష్ మాత్రం సుందర్ సి తో సినిమా చేయడం ఇష్టం లేక ఈ ఆఫర్ ని సున్నితంగా తిరస్కరించినట్టు తెలుస్తోంది. మహేష్ నో చెప్పడంతో ఈ కథ కోసం మరో స్టార్ హీరో వేటలో పడ్డాడు సుందర్. ఒకవేళ వీలు కాకపోతే తమిళ హీరోలతోనే ఈ సినిమా పూర్తి చెయ్యాలని భావిస్తున్నాడట.