ప్ర‌భాస్‌కి షాక్ ఇచ్చిన విష్ణు

భ‌క్త క‌న్న‌ప్ప గురించి ఇద్ద‌రు హీరోలు పోటీ ప‌డుతున్నారిప్పుడు. ఒక హీరో ప్ర‌భాస్ అయితే.. మ‌రో హీరో మంచు విష్ణు. ప్ర‌భాస్ తో భ‌క్త‌క‌న్న‌ప్ప సినిమాని భారీ లెవిల్లో తీయాల‌ని… కృష్ణంరాజు ఎప్ప‌టి నుంచో అనుకొంటున్నారు. దానికి సంబంధించి గోపీ కృష్ణా మూవీస్‌లో స్ర్కిప్టు వ‌ర్క్ కూడా జ‌రుగుతోంది. అయితే స‌డ‌న్‌గా విష్ణు ఎంట్రీ ఇచ్చాడు. త‌నికెళ్ల భ‌ర‌ణి ద‌ర్శ‌క‌త్వంల‌తో క‌న్న‌ప్ప క‌థ‌ని రెడీ చేశారు. దాన్నీ భారీ స్థాయిలో తీయ‌డానికి సిద్ధ‌మ‌య్యాడు. దాంతో ఈ ఇద్ద‌రి సినిమాల్లో ఏది ముందొస్తుందా అనే ఆస‌క్తి మొద‌లైంది. అయితే మ‌ధ్య‌లో ఏమైందో… మంచు విష్ణు ఈ ప్రాజెక్టు నుంచి డ్రాప్ అయిన‌ట్టు చెప్పుకొన్నారు. దాంతో ప్ర‌భాస్‌కి లైన్ క్లియ‌ర్ అయ్యింద‌నుకొన్నారు.

అయితే ఇప్పుడు విష్ణు మ‌ళ్లీ మాట మార్చాడు. ‘క‌న్న‌ప్ప సినిమా ఉంటుంది.. భ‌ర‌ణి గారు క‌థ రెడీ చేశారు. త్వ‌ర‌లోనే ఈ సినిమాని ప్రారంభిస్తాం. అస‌లు ఈ క‌థ‌ని ప్ర‌భాస్ చేస్తున్న‌ట్టు నాకు తెలీదు’ అంటున్నాడు. ఈ సినిమాలో మోహ‌న్ బాబు కూడా న‌టిస్తున్నార‌ని విష్ణు చెబుతున్నాడు. అంటే.. తెలుగులో క‌న్న‌ప్ప క‌థ‌లు రెండు రాబోతున్నాయ‌న్న‌మాట‌. ప్ర‌భాస్ బాహుబ‌లి 2తో బిజీగా ఉన్నాడు కాబ‌ట్టి.. విష్ణునే త‌న సినిమాకి ముందు రిలీజ్ చేసే అవ‌కాశాలున్నాయి. వెంట వెంట‌నే ఒకే క‌థ తో రెండు సినిమాలు తెర‌కెక్క‌డం.. స్ట్రాట‌జీ ప‌రంగా మంచిది కాదు. సో.. ప్ర‌భాస్ డ్రాప్ అవుతాడా? లేదంటే క‌న్న‌ప్ప పై ఉన్న ఇష్టంతో.. తానూ రంగంలోకి దిగుతాడా? అన్న‌ది ఆస‌క్తిగా మారింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

జగన్ తండ్రిని కూడా వదల్లేదా..? షర్మిల సంచలన వ్యాఖ్యలు

ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల అసలు రాజకీయం ఇప్పుడు స్టార్ట్ చేశారు.వైఎస్సార్ కు వారసురాలు జగన్ రెడ్డి కాదని బలంగా చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. వైఎస్ రాజకీయ వారసత్వాన్ని కొనసాగిస్తున్నది తను...

భయపెడుతోన్న ఎండలు…వాతావరణ శాఖ బిగ్ అలర్ట్

ఎండలతో తెలుగు రాష్ట్రాలు కుతకుత ఉడుకుతున్నాయి. బయటకు వెళ్లేందుకు జనం జంకుతున్నారు. పగలూ, సాయంత్రం అనే తేడా లేకుండా ఉక్కపోత సెగలు పుట్టిస్తోంది.ఈ క్రమంలోనే వాతావరణ శాఖ బిగ్ అలర్ట్ ఇచ్చింది. రానున్న...

ఈవీఎం, వీవీ ప్యాట్ పిటిషన్లపై సుప్రీం కీలక తీర్పు

లోక్ సభ ఎన్నికల వేళ ఈవీఎం-వీవీప్యాట్‌కు సంబంధించి దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. వీవీప్యాట్‌ స్లిప్పులతో ఈవీఎం ద్వారా పోలైన ఓట్లను వందశాతం సరిపోల్చాలనే పిటిషన్లను సర్వోన్నత న్యాయస్థానం తిరస్కరించింది. జస్టిస్...

పోలింగ్ ముగిసిన తర్వాత ట్యాపింగ్ కేసులో అసలైనఅరెస్టులు !

ఎన్నికల హడావుడి తగ్గిన తర్వాత ట్యాపింగ్ కేసులో ఎన్నో బ్రేక్ డాన్సులు చోటు చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. స్పెషల్‌ ఇంటెలిజెన్స్ బ్యూరో చీఫ్‌గా పనిచేసిన ప్రభాకర్ రావుపై రెడ్ కార్నర్ నోటీసులు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close