మోత్కుపల్లి విలీన వ్యూహం

టిటిడిపి ఫైర్‌బ్రాండ్‌గా పేరొందిన సీనియర్‌ నాయకుడు మోత్కుపల్లి నరసింహులు తమ పార్టీని టిఆర్‌ఎస్‌లో విలీనం చేయడం మంచిదని హితబోధ చేయడం వెనక పెద్ద వ్యూహమే వుంది. తానొక్కడే పార్టీ మారితే ఫిరాయింపు ముద్ర పడుతుంది గనక మొత్తం పార్టీని గౌరవంగా విలీనం చేద్దామని మొదట చెబుతున్నారు. తన మాటలకు ఎవరు స్పందించి వచ్చినా గౌరవంగా ప్రవేశించవచ్చునని భావిస్తున్నారు. చాలాకాలంగా బిజెపి గవర్నర్‌ గిరీ ఇస్తుందని ఎదురు చూసి నిరాశ పడ్డాక ఆయన అడుగులు అటే పడుతున్నాయి.

పార్టీ అంతర్గత సమావేశాల్లోనూ ఇదే ప్రతిపాదిస్తూ వచ్చారు. ఇటీవల రేవంత్‌ రెడ్డి కాంగ్రెస్‌లో చేరాలన్నప్పుడు అందరికంటే ఎక్కువగా వాదించింది ఆయనే. అంటేకాంగ్రెస్‌లో గాక గులాబీ గూటిలోకి వెళ్లడం మంచిదని అప్పటినుంచే అనుకుంటున్నారు. తెలుగుదేశం అంతరించిపోతుందని అందరూ అనుకుంటున్నారని అనడం ద్వారా తనే ఆ మాట చెప్పేశారు. ఇందుకు ఎన్టీఆర్‌ ఘాట్‌ను వేదికగా చేసుకోవడం, తెలంగాణలో ఆయన పార్టీ స్థాపించారని చెప్పడం ఇవన్నిటిలోనూ రాజకీయం వుంది. ఎపి ముఖ్యమంత్రి అధినేత చంద్రబాబు సమయం కేటాయించడం లేదని చెప్పడమే గాక ఎన్టీఆర్‌ఘాట్‌ దగ్గరకు కొద్దిసేపు వచ్చి వెళ్తే బావుండేదని బహిరంగంగానే విమర్శ చేశారు. ఆయన ఇన్ని మాట్లాడినా టిటిడిపి అద్యక్షుడు రమణ మాత్రం వ్యక్తిగత స్వేచ్చ కింద తీసేయడం, ఆయన తమతోనే వుంటాడని చెప్పడం నిస్సహాయతనే సూచిస్తుంది. రేవంత్‌ రెడ్డి లాగే మోత్కుపల్లి కూడా మరో చోట భవిష్యత్తు వెతుక్కొవాలనుకుంటున్నారు. టిటిడిపికి పెద్ద అవకాశాలు వుండవని మాత్రం అందరూ అనుకుంటున్నారు. కాని ఓటర్లు కార్యకర్తలు భవనాలు వున్నందువల్ల తాము ఏం చేయాలో చంద్రబాబు దిశా నిర్దేశం చేయాలని సీనియర్‌ నేతలు చాలామంది మీడియాతో అంటూ వుంటారు. ఆ విషయంలో మోత్కుపల్లి మరో అడుగు ముందుకేశారంతే. ఇందుకు చంద్రబాబు ఆశీస్సులు వుంటాయని కూడా కొందరు చెబుతున్నారు. ఏమైనా అసలే ఉనికి కాపాడుకుంటున్న టిటిడిపికి ఇదో పెద్ద దెబ్బే. దీన్ని సాకుగా చూసి నిష్క్రమించే వారు బయిలు దేరతారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఒకే టైటిల్… మూడు సినిమాలు

టాలీవుడ్ లో టైటిళ్ల‌కు కొర‌త వ‌చ్చిందా? ప‌రిస్థితి చూస్తుంటే అదే అనిపిస్తోంది. త‌మ సినిమాల‌కు ఎలాంటి టైటిల్ పెట్టాలో అర్థం కాక‌, ఒక‌టే టైటిల్ తో మూడు సినిమాలు తీసేస్తున్నారు. టాలీవుడ్ లో...

బీజేపీపై పోస్టర్లు – అప్పట్లో బీఆర్ఎస్ ఇప్పుడు కాంగ్రెస్

బీజేపీపై చార్జిషీట్ అంటూ కాంగ్రెస్ పార్టీ నేతలు పోస్టర్లు రిలీజ్ చేశారు. తెలంగాణకు బీజేపీ చేసిన అన్యాయం అంటూ విభజన హామీలు సహా అనేక అంశాలను అందులో ప్రస్తావించింది. వాటిని హైదరాబాద్...

నామినేషన్‌లో పవన్ ఫోటో వాడేసుకున్న గుడివాడ అమర్నాథ్ !

రాజకీయ నాయకులకు కొంచెమైన సిగ్గు.. ఎగ్గూ ఉండవని జనం అనుకుంటూ ఉంటారు. అది నిజమేనని తరచూ కొంత మంది నిరూపిస్తూంటారు. అలాంటి వారిలో ఒకరు గుడివాడ్ అమర్నాథ్. పవన్ కల్యాణ్ పై...

కవిత అరెస్ట్ వెనక సంతోష్ రావు..!?

కవిత లిక్కర్ స్కామ్ లో కటకటాల పాలవ్వడానికి ఆ నేతే కారణమా..? తన స్వప్రయోజనాల కోసం ఆయన కవితను ఇరికించారా..?నమ్మకస్తుడిగా ఉంటూనే కేసీఆర్ కు వెన్నుపోటు పొడిచారా..?గత కొద్ది రోజులుగా సంతోష్ రావు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close