భాజపాని ఓడించాలంటే అందరూ త్యాగాలు చేయాలి!

“భాజపాని ఓడించాలంటే అందరూ త్యాగాలకు సిద్దపడాలి. నేను, లాలూ ప్రసాద్ యాదవ్ త్యాగాలు చేయకపోయుంటే బిహార్ లో మహాకూటమి ఏర్పడేదే కాదు. మేమిద్దరం త్యాగాలు చేయబట్టే బిహార్ లో మతతత్వ భాజపాని ఓడించగలిగాము. కనుక ఇప్పుడు ఇదే ఫార్ములాని దేశవ్యాప్తంగా అమలు చేసి భాజపాని వ్యతిరేకించే సెక్యులర్ పార్టీలన్నీ కూడగట్టేందుకు ప్రయత్నిస్తాను. అదేమీ నేరం కాదు కనుక వాటినన్నిటినీ దగ్గర చేసేందుకు వాటి మధ్య నేను జిగురు పదార్ధంలాగ పనిచేస్తాను. వ్యక్తిగత రాజకీయ ప్రయోజనాలను ఆశించి నేను ఈ పని చేయడం లేదు. దేశ ప్రధాని ఎవరు కావాలని ప్రజలు నిర్ణయిస్తే వారే అవుతారు,” అని బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ అన్నారు. ఆయనను జెడియు పార్టీ జాతీయ అధ్యక్షుడిగా ఎన్నికయిన తరువాత డిల్లీలో పార్టీ కార్యాలయంలో తన నేతలను ఉద్దేశ్యించి ప్రసంగిస్తూ ఈ మాటలు అన్నారు.

నితీష్ కుమార్ కి ఎప్పటికయినా ప్రధాన మంత్రి అవ్వాలనే కోరిక చాలా బలంగా ఉంది. అందుకే మోడీని ప్రధాన మంత్రి అభ్యర్ధిగా భాజపా ప్రకటించేందుకు సిద్దం కాగానే ఆయన ఎన్డీయే నుంచి బయటకు వచ్చేసారు. మళ్ళీ ఇప్పుడు తన లక్ష్యం నెరవేర్చుకొనేందుకు ప్రయత్నాలు మొదలుపెడుతున్నారు. అందుకోసం అందరూ త్యాగాలు చేయాలని కోరుతున్నారు. ఆ త్యాగాలు తన కోసం కాదు భాజపాని ఓడించడానికేనని నమ్మమని కోరుతున్నారు. బిహార్ లో కూడా భాజపాని ఓడించడానికి తాము త్యాగాలు చేసామని చెపుకొన్నారు. ఆ త్యాగాలు ఏమిటో వారికే తెలియాలి ఎందుకంటే బిహార్ లో తన అధికారం నిలబెట్టుకోవడానికే మహాకూటమి ఏర్పాటు చేసారు. నితీష్ కుమార్ పట్టుబట్టి, బెదిరించి ముఖ్యమంత్రి అభ్యర్ధిగా ప్రకటింపజేసుకొన్నారు. ఆ తరువాత, మహాకూటమి అధ్యక్షుడిగా ఉన్న ములాయం సింగ్ యాదవ్ కి కూడా తెలియకుండా లాలూ, నితీష్, కాంగ్రెస్ పార్టీలు మొత్తం సీట్లన్నీ పంచేసుకొన్నారు. దానితో ఆయన అలిగి కూటమి నుంచి బయటకు వెళ్లిపోయి ఒంటరిగా పోటీ చేసారు.

ఇప్పుడు అదే మహాకూటమి ఫార్ములాతో దేశంలో అన్ని పార్టీలను కలుపుతానని నితీష్ కుమార్ చెపుతున్నారు! అంటే ఇంతకు ముందు బిహార్ ముఖ్యమంత్రి అయ్యేందుకు స్థానిక పార్టీలను వాడుకొన్నట్లుగానే, ఇప్పుడు ప్రధాని కావాలనే తన లక్ష్యం నెరవేర్చుకోవడానికి దేశంలో అన్ని పార్టీలని కూడా నితీష్ కుమార్ వాడుకోవాలనుకొంటున్నారన్న మాట! తన కోసం అందరూ త్యాగాలు చేయాలని కూడా చెపుతున్నారు. కాకపోతే దానికి మతతత్వ భాజపాకి వ్యతిరేకంగా పోరాటం అనే కలరింగ్ ఇస్తున్నారు అంతే! ప్రధాని కావాలని కోరుకొనేవారు ఉత్తరాది రాష్ట్రాలలో కనీసం ఓ డజను మంది, దక్షిణాదిన కనీసం ఓ అరడజను మంది ఉన్నప్పుడు నితీష్ కుమార్ కోసం వారందరూ ఎందుకు త్యాగాలు చేయాలి? ఆయనే జవాబు చెప్పాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

మదర్స్ డే @ 200 సంవత్సరాలు

ప్రతి ఏడాది మే రెండో ఆదివారం మదర్స్ డే గా జరుపుకుంటారని మనకు తెలుసు.. అయితే ఈ ప్రతిపాదన మొదలై 200 సంవత్సరాలు అయిందనే విషయం మీకు తెలుసా? వాస్తవానికి 'మదర్స్ డే వేడుకలు'...

కోమటిరెడ్డికి హైకమాండ్ వద్ద రిమార్క్స్

కోమటిరెడ్డి వెంకటరెడ్డి కి ముఖ్యమంత్రి అయ్యే అర్హత ఉందని రేవంత్ రెడ్డి ఉబ్బేస్తున్నారు కానీ ఆయన పనితీరుపై హైకమాండ్ తీవ్ర అసంతృప్తిలో ఉన్నట్లుగా కనిపిస్తోంది. చెప్పిన పని చేయకుండా నల్లగొండ పార్లమెంట్ పరిధిలో...

తెలుగు రాష్ట్రాల్లో ప్రధాని ప్రచారం… షెడ్యూల్ ఇదే

తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు ప్రధాని మోడీ. ప్రధాని పర్యటన నేపథ్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మంగళవారం రాత్రే హైదరాబాద్ చేరుకున్న మోడీ రాజ్ భవన్ లో బస చేశారు....

నిర్లక్ష్యమే ముంచింది…కాళేశ్వరంపై నిపుణుల మధ్యంతర నివేదిక

కాళేశ్వరం ప్రాజెక్టుపై తెలంగాణ ప్రభుత్వానికి నేషనల్ డ్యాం సేఫ్టీ మధ్యంతర నివేదికను అందజేసింది. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలకు సంబంధించి ఎలాంటి చర్యలు చేపట్టాలో ప్రభుత్వానికి సూచించింది.వర్షాకాలం దృష్టిలో పెట్టుకొని...

HOT NEWS

css.php
[X] Close
[X] Close