తెలంగాణలో రైతుల ఆందోళన ఎవరికీ కనిపించదా..?

తెలంగాణ సీఎం కేసీఆర్ “రైతు బంధు” అనే పథకం పెట్టి రైతుబంధుగా మారారు. అయితే.. ఎకరానికి రూ. నాలుగు లేదా ఐదు వేలు ఇచ్చినంత మాత్రానే రైతు బంధు అవుతారా..? వారికి గిట్టుబాటు ధరలు కల్పించవద్దా..? ఈ విషయంలో ప్రభుత్వం చేయాల్సినంత ప్రయత్నం చేస్తోందా.. అన్నదే కీలకంగా మారింది. నిజామాబాద్ జిల్లాలో కొన్నాళ్ల కిందట.. ఎస్సారెస్పీ నీటి కోసం… జరిగిన ఆందోళనలు… కలకలం రేపాయి. ఎన్నికలకు ముందుగా జరిగిన గొడవలు కాబట్టి.. హుటాహుటిన .. సింగూరు నుంచి జలాలను తరలించి… సమస్యను.. దాదాపుగా పరిష్కరించింది తెలంగాణ ప్రభుత్వం. ఇప్పుడు.. రైతులు మరో సమస్యపై ఉద్యమిస్తున్నారు. అదే గిట్టుబాటు ధరలు.

నిజామాబాద్ జిల్లాలో ఎర్ర జొన్న, పసుపు రైతులు గుట్టుబాటు ధర కోసం.. కొద్ది రోజులుగా ఆందోళన చేస్తున్నారు. ఆర్మూరులో ఓ రోజు మహా ధర్నా చేపట్టారు. పసుపు మద్దతు ధర 15 వేలు, ఎర్రజొన్నకు 3500 రుపాయలు ధర కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు రైతులు. వారికి ఈ మేరకు.. గత ఎన్నికల్లో అన్ని పార్టీలు హామీ ఇచ్చాయి. కానీ ఇప్పుడు మాత్రం.. రైతుల ఆందోళనను పోలీసులు అడ్డుకుంటున్నారు. ఆర్మూర్ డివిజన్ పరిధిలోని 13 మండలాల్లో ఇప్పటికీ 144 సెక్షన్ కొనసాగుతోంది. గ్రామాల్లో గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. రైతు సంఘాల నేతల్ని ఎక్కడికక్కడ అరెస్ట్ చేస్తున్నారు. ప్రభుత్వానికి రైతు సంఘాలు పెట్టిన డెడ్ లైన్ ముగిసింది. ఇప్పుడు వాళ్లు మరింత దూకుడైన ప్రత్యక్ష కార్యాచరణకు సిద్ధం అవుతున్నారు.

ఇప్పుడు.. తెలంగాణలో రైతుల సమస్యలపై దృష్టి పెట్టే వ్యవస్థ లేదు. ఇలాంటి సమస్యలు ఏమైనా వస్తే.. ముందుగా.. వ్యవసాయ మంత్రి వద్దకు వెళ్తారు. అలాంటి మంత్రి..తెలంగాణలో విధులు నిర్వహించి ఐదు నెలలు దాటిపోయింది. అసెంబ్లీని రద్దు చేసిన తరవాత ఏ మంత్రి కూడా బాధ్యతలు నిర్వహించలేదు. ఎన్నికలు అయిపోయి.. రెండు నెలలు అయినా వ్యవసాయమంత్రి లేరు. ఇప్పుడు రైతులకు ఎవరికి చెప్పుకోవాలో కూడా తెలియని పరిస్థితి ఏర్పడింది. రైతులకు భరోసా ఇచ్చే వారు కూడా లేరు. మీడియా కూడా.. ఈ సమస్యను… గట్టిగా ప్రజల ముందుకు తీసుకెళ్లే స్థితిలో లేదు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

మేనిఫెస్టో మోసాలు : చేసింది జలయజ్ఞం కాదు జలభగ్నం !

వైఎస్ఆర్ జలయజ్ఞం.. వైఎస్ఆర్ కలలు కన్నారు. ఆ యజ్ఞాన్ని పూర్తి చేస్తాం. పోలవరం, వెలిగొండ యుద్ధప్రాతిపదికన పూర్తి చేస్తాం. రక్షిత మంచినీరు, సాగునీరు కల నిజం చేస్తాం. చెరువులను పునరుద్ధరిస్తాం .. జలకళను...

కాంగ్రెస్ కు అడ్వాంటేజ్ గా హరీష్ రావు సవాళ్ళు..!?

బీఆర్ఎస్ అధికారం కోల్పోయాక అటు కేసీఆర్, ఇటు హరీష్ రావు రాజకీయ వ్యూహాలు తేలిపోతున్నాయి. ప్రత్యర్ధులను కట్టడి చేసేందుకు చేస్తోన్న వ్యాఖ్యలు బీఆర్ఎస్ కు మేలు చేయకపోగా...అధికార కాంగ్రెస్ కు ఫేవర్ చేసేలా...

ఎడిటర్స్ కామెంట్ : ఆన్ లైన్ ఎలక్షన్స్ !

ఇండియాలో కేజీ బియ్యం రూ. వంద పలుకుతుంది కానీ ఒక్క జీబీ డేటా మాత్రం ఐదు రూపాయలకే వస్తుంది. మీరు సమయం అంతా యూట్యూబ్ వీడియోలు.. సోషల్ మీడియా మీదే గడపుతామంటే...

కేసీఆర్, హరీష్ రావులకు నోటిసులు..?

కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో కాంగ్రెస్ సర్కార్ ఏర్పాటు చేసిన జ్యుడిషియల్ కమిషన్ వర్క్ స్టార్ట్ చేసింది. గురువారం మొదటిసారి రాష్ట్రానికి వచ్చిన జస్టిస్ పినాకి చంద్రఘోష్ టీం బీఆర్కేఆర్ భవన్ లో ఇరిగేషన్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close